జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన సొంత పార్టీ నేతలపై ఫైరయ్యారు. పార్టీలో ఉంటూ.. కోవర్టులుగా పనిచేస్తున్నారని.. ఆయన నిప్పులు చెరిగారు. అంతేకాదు.. ఇలాంటి వారి వల్ల శతృవు ఎవరో.. మిత్రుడు ఎవరో కూడా తాను పసిగట్టలేక పోతున్నానని చెప్పారు. ఇలాంటి వారు తనచుట్టూ తిరగడం కన్నా.. వారికి నచ్చిన పార్టీలో చేరొచ్చని.. ఆయన అన్నారు. తనకు కోవర్టుల గురించిన సమాచారం ఉందన్న ఆయన.. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. త్వరలోనే వారు మారాలని.. లేకపోతే.. తాను మారుస్తానని చెప్పారు.
గతంలో పార్టీలో అనేక తప్పులు జరిగాయని పవన్ అన్నారు. వాటివల్లే పార్టీ అనేక రూపాల్లో నష్టపోయిందని చెప్పారు. అయితే.. ఇప్పుడు అలాంటి తప్పులు జరగనివ్వనని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. కేవలం కొందరు నాయకులు.. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేందుకు మాత్రమే పరిమితం అవుతున్నారని.. ఇలాంటి వారు మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరికొందరు అడపా దడపా.. తాను వస్తుంటే.. తన వెంట వచ్చి.. హంగామా చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.
ఇలాంటి పరిణామాలను ఉపేక్షించేది లేదన్నారు. జనసేన వ్యూహాలు.. వచ్చే ఎన్నికల్లో అనుసరించే మార్గాలను ప్రతి ఒక్క కార్యక ర్త, నాయకుడు కూడా తెలుసుకోవాలని.. పవన్ కోరారు. “మన ఆలోచనలను, ఉద్దేశాలను ప్రజలకు చేరవేయండి. ఎప్పుడూ.. నేనే వచ్చి సమావేశాలు పెట్టాలంటే.. కుదరదు. మీరు కూడా ప్రజల్లో ఉండండి. వారి సమస్యలు తెలుసుకోండి. వారికి అండగా ఉండండి. పార్టీని బలోపేతం చేయండి.“ అని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహాలు వేయడంలో దిట్టగా పవన్ పేర్కొన్నారు. ఆయనను అనుసరించాలని తాను కోరుకుంటానని.. ఆ విధంగానే వచ్చే ఎన్నికల్లో ఏపీలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తామని పవన్ చెప్పారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యకర్తలతో భేటీ అయి.. చర్చించారు.
This post was last modified on August 22, 2022 11:11 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…