గత పదేళ్లలో పూరి జగన్నాథ్ ట్రాక్ రికార్డు గురించి అందరికీ తెలిసిందే. ‘టెంపర్’, ‘ఇస్మార్ట్ శంకర్’ మినహాయిస్తే ఆయనకు విజయాలు లేవు. అందులో ‘టెంపర్’ కథ ఆయనది కాదు. ‘ఇస్మార్ట్ శంకర్’ ఏదో ఫ్లూక్లో హిట్టయిందే తప్ప అది కూడా అంత దమ్ముున్న సినిమా ఏమీ కాదు. పూరి పరిస్థితి ఇలా ఉంటే విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా ఇబ్బందికరమే. అతడి చివరి సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ డిజాస్టర్ అయింది. దానికి ముందు ‘డియర్ కామ్రేడ్’కు టాక్ పర్వాలేదనిపించినా అది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఇలాంటి ఇద్దరు కలిసి సినిమా చేస్తే అంతగా హైప్ ఉండకూడదు. పోనీ వీరు కలిసి చేసిన సినిమా ప్రోమోలన్నీ బాగా అనిపించాయా అంటే అదీ లేదు. ఎక్కువగా నెగెటివ్గానే మాట్లాడుకున్నారు వాటి గురించి. ఐతేనేం ‘లైగర్’ విషయంలో ప్రేక్షకాసక్తి మామూలుగా లేదు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం.
టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల లెవెల్లో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చూస్తుండగా.. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆ హీరోల లెవెల్లోనే జరుగుతున్నాయి. విడుదలకు ఐదు రోజుల ముందే చాలా షోలు సోల్డ్ ఔట్ అయిపోగా.. మిగతా షోలన్నీ ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో ఉన్నాయి. పెద్ద హీరోల సినిమాల తరహాలోనే దీనికి కూడా ఉదయం ఎక్స్ట్రా షో వేస్తుండగా.. వాటికి రెస్పాన్స్ ఇంకా బాగుంది.
టికెట్లు దొరకడం కష్టమైపోతోంది. ఇది మాస్ సినిమా అయినా సరే.. మల్టీప్లెక్సుల్లో కూడా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సింగిల్ స్క్రీన్లలో కూడా రెస్పాన్స్ అదరహో అనే చెప్పాలి. మొత్తంగా ఈ నెల 25న ‘లైగర్’ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించడం ఖాయంగానే కనిపిస్తోంది. చివరగా వేసవిలో ‘సర్కారు వారి పాట’కు ఇలాంటి హంగామా కనిపించగా.. మళ్ళీ విజయ్ సినిమాకు ఈ సందడి చూస్తున్నాం. ఈ క్రేజ్ తాలూకు మేజర్ క్రెడిట్ విజయ్కే చెందుతుందని చెప్పాలి. తనదైన శైలిలో అతను ఈ సినిమాను అగ్రెసివ్గా ప్రమోట్ చేయడం వల్లే ఈ హైప్ వచ్చిందన్నది స్పష్టం.
పెద్దికి ఒళ్ళు హూనం చేసుకుని దర్శకుడు బుచ్చిబాబు అడిగిన దానికి రెండువందల శాతం ఎక్కువ ఇచ్చిన రామ్ చరణ్ దానికి…
వైసీపీ గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. 151 స్థానాల నుంచి 11కు పడిపోయింది. దీనికి కారణాలు ఏంటన్నవి అందరికీ తెలిసినా..…
కమెడియన్ పాత్రలు చేసుకునే సత్యం రాజేష్ను హీరోగా పెట్టి చాలా తక్కువ బడ్జెట్లో ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా తీశాడు…
తెలంగాణకు కీలక ప్రాజెక్టుగా రానున్న బుల్లెట్ రైలు రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారనుంది. మొత్తం మూడు బుల్లెట్ రైళ్లను కేంద్ర…
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు యువ హీరోయిన్ రాశీ సింగ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి…
క్రిస్టఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే గ్రీక్, ట్రాయ్…