Political News

ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేనికి షాక్‌.. హైకోర్టు నోటీసులు

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గనులశాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలోని శ్రీబ్రహ్మయ్య లింగేశ్వరస్వామి దేవాలయం, బ్రహ్మ లింగయ్య చెరువు పరిసరాల్లో గనుల అక్రమ తవ్వకాల్ని అడ్డుకోవాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఎమ్మెల్యే వంశీ ఆదేశాలతో వ్యాపారులు లక్ష్మణరావు, మోహనరంగారావు, శేషుకుమార్‌ గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడుతు న్నారని పిటిష‌న‌ర్ తెలిపారు. అంతేకాదు.. ఈ కేసును తీవ్రంగా ప‌రిగ‌ణించాల‌న్నారు.

వారి నుంచి జరిమానా, సీనరేజి రుసుం వసూలు చేయాలని పిటిషనర్‌ ముప్పనేని రవికూమార్ తరపు న్యాయవాది కోరారు. బ్రహ్మలింగయ్య చెరువు సమీపంలో సహజసిద్ధంగా పెరిగిన వేల చెట్లనుకూల్చినా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫల మయ్యారని ఆరోపించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఎమ్మెల్యే స‌హా రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాలు కూడా ఈ విష‌యంలో స్పందించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే.. దీనిపై అస‌లు ఏం జ‌రిగింద‌నేది ఎమ్మెల్యే వ‌ర్గం అత్యంత గోప్యంగా ఉంచ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి.. చెరువులు తొవ్వ‌ద్ద‌ని, గ‌నుల జోలికి వెళ్లొద్ద‌ని.. గ‌తంలోనే జిల్లా అధికారుల‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఎప్పుడూ.. కూడా ఈ వివాదాల‌తోనే ముందుకు సాగే కొంద‌రు అధికారులు కూడా ఉన్నారు. వీరికి అనుకూలంగా ఉండే దిగువ స్థాయి అధికారులు.. నేత‌లు కొంద‌రు గ్రూపుగా ఏర్ప‌డి జిల్లాలో స‌హ‌జ వ‌న‌రుల‌ను దోచేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఆల‌యాల‌కు చెందిన చెరువుల‌ను.. గ‌నుల‌ను కూడా తొవ్వేస్తున్నార‌ని.. కొన్నాళ్లుగా ఇక్క‌డ తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు రావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. గ‌తంలో ఉన్న ప్ర‌భుత్వం,. ఇప్పుడున్న ప్ర‌బుత్వం కూడా వీటిని లైట్ తీసుకుంది. దీంతో ప‌రిస్థితి హైకోర్టు వ‌ర‌కు చేరింది.

This post was last modified on August 22, 2022 9:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

41 minutes ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

2 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

3 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

3 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

3 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

3 hours ago