టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరితో తమ్ముళ్లు తర్జన భర్జన పడుతున్నారా? అసలు పార్టీలో ఏం జరుగుతోందో కూడా తెలియడం లేదా? అంటే.. ఔననే అంటున్నారు సీనియర్ నాయకులు.. ప్రస్తుతం చంద్రబాబు నియోజకవర్గాల వారీగా.. నాయకులతో సమీక్షలు చేస్తున్నారు. వరుసగా సాగుతున్న ఈ పరిణామాలతో నియోజకవర్గాల్లో పార్టీ నేతలు హుషారుగా ఉన్నారు. ఎందుకంటే.. ఈ సమీక్షల్లో చంద్రబాబు.. కొందరికి టికెట్లు ఖరారు చేస్తున్నారనే వార్తలు రావడమే.
అది కూడా.. చంద్రబాబు అనుకూల మీడియాలోనే… ఈ వార్తలు వస్తున్నాయి. ఏకంగా ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే చంద్రబాబు టికెట్లు కన్ఫర్మ్ చేస్తున్నారని.. టీడీపీ చరిత్రలోనే ఇది రికార్డని పత్రికలు రాసుకొస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు సమీక్షలు జరిగిన పలు నియోజకవర్గాల్లో నాయకులు హుషారుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ కన్ఫర్మ్ అయిందని.. భావిస్తూ.. సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాదు.. రెట్టించిన ఉత్సాహంతో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు.
అయితే.. ఇలా సాగుతున్న క్రమంలో చంద్రబాబు చేసిన సంచలన ప్రకటన.. పార్టీలో నాయకులను నిరాశకు గురి చేసింది. ఎందుకంటే.. ఇప్పటి వరకు తాను కేవలం సమీక్షలు మాత్రమే చేశానని.. ఎవరికీ టికెట్లు కన్ఫర్మ్ చేయలేదని.. చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. టికెట్ల విషయాన్ని నాయకులు మరిచిపోవాలని ఘాటుగానే వ్యాఖ్యానించారు. ప్రతి మూడు మాసాలకు ఒకసారి ప్రతి నియోజకవర్గంపైనా.. సమీక్షలు చేస్తానని చెప్పారు. అప్పుడు కానీ.. నిర్ణయం వెలువరించనని అన్నారు.
ఇదే ఇప్పుడు.. పార్టీలో తీవ్ర ఇబ్బందికర పరిణామంగా మారిపోయింది. ఎందుకంటే.. నియోజకవర్గాల్లో ఇప్పుడు కష్టపడి పనిచేయాలని అనుకుంటున్నవారు.. పనిచేసేవారు.. తీరా ఎన్నికల సమయానికి తమకు టికెట్ దక్కుతుందో లేదో..అని వగరుస్తున్నారు. ఇంతా కష్టపడి తాము.. ఇంత చేస్తే.. రేపు ఎవరికో టికెట్ ఇస్తే.. తమ పరిస్థితి ఏంటని వారు అంతర్మథనం చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు చేసిన ప్రకటన టీడీపీలో పెను కలకలంగా మారింది. ఏదో ఒకటి కన్ఫర్మ్ చేస్తే.. పూర్తిగా పనిచేసేందుకుతాము సిద్ధమని.. ఇలా నాన్చడం వల్ల ప్రయోజనం ఏంటని.. కొందరు సీనియర్లు కూడా ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on August 21, 2022 12:32 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…