Political News

రాజ‌ధాని ఎఫెక్ట్‌.. ఆ మూడు స్థానాల్లో టీడీపీ

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో రాజ‌కీయ ప‌వ‌నాలు మారుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరులో వైసీపీ హ‌వా జోరుగా సాగింది. వాస్త‌వానికి రాజ‌ధాని అమ‌రావ‌తి ఏర్పాటుతో త‌మ‌కు తిరుగులేద‌ని అనుకున్న టీడీపీకి ఇక్క‌డ చాలా దెబ్బ త‌గిలింది. కీల‌క‌మైన మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసిన టీడీపీ అధినేత చంద్ర బాబు కుమారుడు నారా లోకేష్ కూడా ఇక్క‌డ పరాజ‌యం పాల‌య్యారు. దీంతో ఇంత చేసినా.. త‌మ‌కు ఈ ప‌రిస్థితి వ‌చ్చిందేంట‌ని.. టీడీపీ ఖంగుతింది.

అయితే..ఇప్పుడు మ‌ళ్లీ టీడీపీ ప‌వ‌నాలు జోరుగా వీస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీ తీసుకున్న నిర్ణ‌య‌మే ఆ పార్టీకి పెను శాపంగా మారింద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. అమ‌రావ‌తి రాజ‌ధానినికాద‌ని.. మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం తీసుకోవ‌డం.. ఇక్క‌డ అగ్గిని రాజేసింది. దీంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు వైసీపీపై తీవ్ర వ్య‌తిరేకత‌ వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ పుంజుకుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న మూడు కీలక నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి జోష్ క‌నిపిస్తోంది.

ముఖ్యంగా తాడికొండ‌, మంగ‌ళ‌గిరి, పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. ఆది నుంచి కూడా అమ‌రావ‌తికి మ‌ద్ద‌తివ్వ‌డం.. న్యాయ పోరాటంలో రైతుల‌కు సాయం చేయ‌డం.. ఇక్క‌డి టీడీపీ నేత‌లు రైతుల‌కు అన్ని విధాలా అండ‌గా ఉండ‌డం వంటి ప‌రిణామాల‌తో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ పుంజుకుంద‌నే భావ‌న వ్య‌క్త‌మవుతోంది. ముఖ్యంగా పెద‌కూర‌పాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌.. ప్ర‌జ‌ల‌తోనే ఉంటున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. వాటికి ప‌రిష్కారాల‌ను కూడా అన్వేషిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో పెద‌కూర‌పాడు టీడీపీలో గెలుపు సంకేతాలు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉండ‌డం.. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తుండ‌డం వంటివి ఆపార్టీకి తీవ్ర‌ మైన‌స్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డ టీడీపీ పుంజుకుంటోంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. మొత్తానికి అటు రాజ‌ధాని ఎఫెక్ట్‌.. ఇటు ఎమ్మెల్యే ప‌నితీరుతో వైసీపీ డౌన్ అవుతుంటే.. టీడీపీ పుంజుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on August 21, 2022 11:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

45 minutes ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

2 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

4 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

4 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

4 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

5 hours ago