Political News

రాజ‌ధాని ఎఫెక్ట్‌.. ఆ మూడు స్థానాల్లో టీడీపీ

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో రాజ‌కీయ ప‌వ‌నాలు మారుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరులో వైసీపీ హ‌వా జోరుగా సాగింది. వాస్త‌వానికి రాజ‌ధాని అమ‌రావ‌తి ఏర్పాటుతో త‌మ‌కు తిరుగులేద‌ని అనుకున్న టీడీపీకి ఇక్క‌డ చాలా దెబ్బ త‌గిలింది. కీల‌క‌మైన మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసిన టీడీపీ అధినేత చంద్ర బాబు కుమారుడు నారా లోకేష్ కూడా ఇక్క‌డ పరాజ‌యం పాల‌య్యారు. దీంతో ఇంత చేసినా.. త‌మ‌కు ఈ ప‌రిస్థితి వ‌చ్చిందేంట‌ని.. టీడీపీ ఖంగుతింది.

అయితే..ఇప్పుడు మ‌ళ్లీ టీడీపీ ప‌వ‌నాలు జోరుగా వీస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీ తీసుకున్న నిర్ణ‌య‌మే ఆ పార్టీకి పెను శాపంగా మారింద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. అమ‌రావ‌తి రాజ‌ధానినికాద‌ని.. మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం తీసుకోవ‌డం.. ఇక్క‌డ అగ్గిని రాజేసింది. దీంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు వైసీపీపై తీవ్ర వ్య‌తిరేకత‌ వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ పుంజుకుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న మూడు కీలక నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి జోష్ క‌నిపిస్తోంది.

ముఖ్యంగా తాడికొండ‌, మంగ‌ళ‌గిరి, పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. ఆది నుంచి కూడా అమ‌రావ‌తికి మ‌ద్ద‌తివ్వ‌డం.. న్యాయ పోరాటంలో రైతుల‌కు సాయం చేయ‌డం.. ఇక్క‌డి టీడీపీ నేత‌లు రైతుల‌కు అన్ని విధాలా అండ‌గా ఉండ‌డం వంటి ప‌రిణామాల‌తో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ పుంజుకుంద‌నే భావ‌న వ్య‌క్త‌మవుతోంది. ముఖ్యంగా పెద‌కూర‌పాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌.. ప్ర‌జ‌ల‌తోనే ఉంటున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. వాటికి ప‌రిష్కారాల‌ను కూడా అన్వేషిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో పెద‌కూర‌పాడు టీడీపీలో గెలుపు సంకేతాలు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉండ‌డం.. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తుండ‌డం వంటివి ఆపార్టీకి తీవ్ర‌ మైన‌స్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డ టీడీపీ పుంజుకుంటోంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. మొత్తానికి అటు రాజ‌ధాని ఎఫెక్ట్‌.. ఇటు ఎమ్మెల్యే ప‌నితీరుతో వైసీపీ డౌన్ అవుతుంటే.. టీడీపీ పుంజుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

33 minutes ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

3 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

3 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

5 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

7 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

8 hours ago