Political News

రాజ‌ధాని ఎఫెక్ట్‌.. ఆ మూడు స్థానాల్లో టీడీపీ

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో రాజ‌కీయ ప‌వ‌నాలు మారుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరులో వైసీపీ హ‌వా జోరుగా సాగింది. వాస్త‌వానికి రాజ‌ధాని అమ‌రావ‌తి ఏర్పాటుతో త‌మ‌కు తిరుగులేద‌ని అనుకున్న టీడీపీకి ఇక్క‌డ చాలా దెబ్బ త‌గిలింది. కీల‌క‌మైన మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసిన టీడీపీ అధినేత చంద్ర బాబు కుమారుడు నారా లోకేష్ కూడా ఇక్క‌డ పరాజ‌యం పాల‌య్యారు. దీంతో ఇంత చేసినా.. త‌మ‌కు ఈ ప‌రిస్థితి వ‌చ్చిందేంట‌ని.. టీడీపీ ఖంగుతింది.

అయితే..ఇప్పుడు మ‌ళ్లీ టీడీపీ ప‌వ‌నాలు జోరుగా వీస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీ తీసుకున్న నిర్ణ‌య‌మే ఆ పార్టీకి పెను శాపంగా మారింద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. అమ‌రావ‌తి రాజ‌ధానినికాద‌ని.. మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం తీసుకోవ‌డం.. ఇక్క‌డ అగ్గిని రాజేసింది. దీంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు వైసీపీపై తీవ్ర వ్య‌తిరేకత‌ వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ పుంజుకుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న మూడు కీలక నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి జోష్ క‌నిపిస్తోంది.

ముఖ్యంగా తాడికొండ‌, మంగ‌ళ‌గిరి, పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. ఆది నుంచి కూడా అమ‌రావ‌తికి మ‌ద్ద‌తివ్వ‌డం.. న్యాయ పోరాటంలో రైతుల‌కు సాయం చేయ‌డం.. ఇక్క‌డి టీడీపీ నేత‌లు రైతుల‌కు అన్ని విధాలా అండ‌గా ఉండ‌డం వంటి ప‌రిణామాల‌తో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ పుంజుకుంద‌నే భావ‌న వ్య‌క్త‌మవుతోంది. ముఖ్యంగా పెద‌కూర‌పాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌.. ప్ర‌జ‌ల‌తోనే ఉంటున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. వాటికి ప‌రిష్కారాల‌ను కూడా అన్వేషిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో పెద‌కూర‌పాడు టీడీపీలో గెలుపు సంకేతాలు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉండ‌డం.. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తుండ‌డం వంటివి ఆపార్టీకి తీవ్ర‌ మైన‌స్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డ టీడీపీ పుంజుకుంటోంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. మొత్తానికి అటు రాజ‌ధాని ఎఫెక్ట్‌.. ఇటు ఎమ్మెల్యే ప‌నితీరుతో వైసీపీ డౌన్ అవుతుంటే.. టీడీపీ పుంజుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on August 21, 2022 11:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

3 minutes ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

22 minutes ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

1 hour ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

1 hour ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

2 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

4 hours ago