బీజేపీలో సీనియర్ నేత, ఆర్ఎస్ఎస్ తో బలమైన బంధాలు కలిగిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అంటే నరేంద్ర మోడీ భయపడుతున్నారా ? పార్టీలో జరిగిన తాజా పరిణామాలు చూసిన తర్వాత సర్వత్రా అదే చర్చ జరుగుతోంది. మొదటి నుండి గడ్కరీ అంటేనే మోడీ కాస్త దూరంగా ఉంటున్నారు. తన మంత్రివర్గంలో గడ్కరీని దూరంగా పెట్టింది లేదు. అలాగని నెత్తినెక్కించుకున్నదీ లేదు. మొత్తం మంత్రివర్గంలో మోడీ తర్వాత అమిత్ షా దే ఆధిపత్యం అన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు.
చాలా శాఖలపైన అమిత్ షా దే పెత్తనం సాగుతుంది కానీ గడ్కరీ జోలికి మాత్రం వెళ్ళటం లేదట. ఎందుకంటే గడ్కరీకి ఉన్న బలమైన నేపథ్యమే దీనికి కారణమని పార్టీ వర్గాలే చెబుతాయి. అలాంటి బలమైన గడ్కరీని తాజాగా మోడీ బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుండి తప్పించారు. గడ్కరీని మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ను కూడా పంపేశారు. చౌహాన్ను పంపేయటంలో పెద్దగా ఎవరికీ ఆశ్చర్యం లేదు.
కానీ గడ్కరీని పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించటమే చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే నాగ్ పూర్లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలున్న కేంద్రమంత్రిని తప్పించాల్సిన అవసరం మోడీకి లేదు. అయినా తప్పించారంటే ఆయనంటే భయపడుతున్నారు కాబట్టే పార్లమెంటరీ బోర్డునుండి తప్పించినట్లు అనుమానిస్తున్నారు. రేపు ఏ కారణం చేతనైనా ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సొస్తే గడ్కరీ మాత్రమే పోటీదారుడనే ప్రచారం అందరికీ తెలిసిందే.
అంటే మోడీకి ప్రత్యామ్నాయం గడ్కరీనే అని పార్టీలో చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే ఇపుడు హఠాత్తుగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరుకూడా వినబడుతోంది. ఏదేమైనా చాలామంది బీజేపీ ముఖ్యమంత్రులతోను, కేంద్ర మంత్రులతోను, మహారాష్ట్రలోని బీజేపీ సీనియర్ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న గడ్కరీ తనకెక్కడ పోటీ వస్తారో అన్న భయంతోనే మోడీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించినట్లు చెప్పుకుంటున్నారు. నిజానికి మోడీని తప్పించాల్సొస్తే ప్రత్యామ్నాయం ఎక్కడున్నా ఆర్ఎస్ఎస్ పట్టుకొచ్చి కుర్చీలో కూర్చోబెడుతుంది. మోడీ ప్రధానమంత్రి అయ్యింది ఈ పద్ధతి లోనే కదా.
This post was last modified on August 18, 2022 6:12 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…