మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా నాయకులు కూడా మారతున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో మార్పు తథ్యమంటూ.. తరచుగా నాయకులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూస్తానన్న జనసేనాని పవన్ కళ్యాణ్.. దానికి అనుగుణంగానే చక్రం తిప్పు తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది.
ఈ పరిణామం తర్వాత ఏపీలోను.. అటు ఢిల్లీలోనూ రాజకీయాలు మారుతున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. చంద్రబాబు కూడా త్వరలోనే ఢిల్లీ వెళ్లేందుకు రెడీ అవుతున్నారని.. ఈ దశలో బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్షాతో ఆయన భేటీ అవుతారని చెబుతున్నారు. ఇదిలావుంటే.. నిన్న మొన్నటి వరకు ప్రధాని మోడీ గురించి మాట మాత్రం కూడా మాట్లాడని.. చంద్రబాబు.. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో ప్రధానిని ఆకాశానికి ఎత్తేశారు.
ఆయన వల్ల దేశంలో అభివృద్ధి బాటలో పయనిస్తోందని చంద్రబాబు చెప్పారు. అంతేకాదు.. కేంద్రం పెట్టుకున్న పాతికేళ్ల లక్ష్యాన్ని చంద్రబాబు కూడా మరోసారి ప్రవచించారు. అంటే.. దాదాపు బీజేపీకి అను కూలంగానే చంద్రబాబు పావులు కదుపుతున్నారనే సంకేతాలు దాదాపు వచ్చాయి. మరోవైపు.. నిన్న మొన్నటి వరకు టీడీపీ అంటే నిప్పులు చెరిగిన బీజేపీ నాయకుడు సోము వీర్రాజు సైతం.. తాజాగా టీడీపీపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం అంతో ఇంతో అభివృద్ధి చేసిందంటూ.. ఆయన వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
ఇదిలావుంటే.. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ముందుగానే జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు గెట్ టుగెదర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇది దసరా లోపు గానీ.. దసరాకు గానీ ఉంటుందని.. తాజాగా పార్టీ నేతల మధ్య చర్చ సాగుతోంది. ఇప్పటికే.. కేంద్రం నుంచి బీజేపీ రాష్ట్ర నాయకులకు కొన్ని సంకేతాలు వచ్చాయని.. చంద్రబాబు, టీడీపీల విషయంలో సానుకూలత ప్రదర్శించాలనే ఆదేశాలు అందాయని అంటున్నారు. దీంతో ఇప్పుడు వీరు కలుసుకుని.. చర్చించ బోయే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొనడం గమనార్హం.
This post was last modified on August 17, 2022 10:00 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…