Political News

తిరుమ‌ల‌లో ఏపీ మంత్రి హ‌ల్చ‌ల్‌

తిరుమలలో ఏపీ మంత్రి ఉష శ్రీచ‌ర‌ణ్ హ‌ల్చ‌ల్ చేశారు. సామాన్య భ‌క్తులు.. శ్రీవారి ద‌ర్శ‌నం కోసం.. రోజుల త‌ర‌బ‌డి ఎదురు చూస్తున్నా.. ఆమె ఏమాత్రం వారిని ప‌ట్టించుకోకుండా.. త‌న వెంట వ‌చ్చిన 50 మంది అనుచ‌రుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించి తీరాల్సిందేన‌ని అధికారుల‌కు హుకుం జారీ చేశారు. దీంతో విధిలేక‌.. సామాన్యులను క్యూలైన్ల‌కే వ‌దిలేసిన‌.. అధికారులు.. మంత్రికి, ఆమె అనుచ‌రుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న తీవ్ర వివాదానికి దారితీయ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి గడిచిన వారం రోజుల నుంచీ తిరుమ‌ల‌లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. దీంతో.. స్వామి దర్శనానికి ఏకంగా 40 గంటలకు పైగా సమయం పడుతోంది. ఫలితంగా.. చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ కారణంగానే.. బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఏపీ మంత్రి ఉష శ్రీ చరణ్ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లడం గమనార్హం. ఏకంగా 50 మంది అనుచరులతో కలిసి బ్రేక్ దర్శనానికి వ‌చ్చారు.

అక్కడి అధికారులు పరిస్థితి వివరించినా.. వారిపై ఒత్తిడి చేసి అనుచరులకు బ్రేక్ దర్శనాలు ఇప్పించా రు మంత్రి. మరో పది మంది అనుచరుల వరకు సుప్రభాత సేవా టికెట్లు సైతం ఇప్పించారు. మంత్రి వ్యవహార శైలిపై సామాన్య భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి దర్శనం కోసం తాము రోజుల తరబడి నిల్చుంటే.. మంత్రి మధ్యలో వచ్చి, వెంట జనాన్ని తీసుకొచ్చి, బ్రేక్ దర్శనాల పేరుతో దర్శనం చేసుకొని వెళ్లిపోతారా? అని మండి పడ్డారు.

మీడియాపై దూకుడు..

మంత్రి ఉష శ్రీచ‌ర‌ణ్ వ్య‌వ‌హారంపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులతోనూ.. మంత్రి దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. మీడియా ప్ర‌తినిధుల‌ను తోసుకుని మ‌రీ మంత్రి ఉష శ్రీచరణ్ వెళ్లిపోవడం గమనార్హం. దీంతో మీడియా ప్ర‌తినిధులు అవాక్క‌య్యారు. దీనిపై టీటీడీ అధికారుల‌ను ప్ర‌శ్నించ‌గా.. వారి నుంచి ఎలాంటి స‌మాధానం లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on August 15, 2022 9:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏడు ఫ్లాపుల తర్వాతైనా హిట్టు వరించేనా

ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…

2 hours ago

ప్యారడైజ్ పరుగులు పెట్టాల్సిందే

పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…

3 hours ago

రజినీకాంత్ భయపడ్డాడా? జాగ్రత్తపడ్డాడా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…

4 hours ago

వాషింగ్టన్ డీసీని… మనమ్మాయి శాసిస్తుందా?

ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…

5 hours ago

పార్టీ పేరుతో పాటు గుర్తుతోనూ స్ట్రోక్ ఇవ్వనున్న కవిత?

బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయ‌కురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌విత త‌న దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వ‌రలోనే…

5 hours ago

భానుప్రియ మతిస్థిమితం కోల్పోయిందా?

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…

5 hours ago