Political News

తిరుమ‌ల‌లో ఏపీ మంత్రి హ‌ల్చ‌ల్‌

తిరుమలలో ఏపీ మంత్రి ఉష శ్రీచ‌ర‌ణ్ హ‌ల్చ‌ల్ చేశారు. సామాన్య భ‌క్తులు.. శ్రీవారి ద‌ర్శ‌నం కోసం.. రోజుల త‌ర‌బ‌డి ఎదురు చూస్తున్నా.. ఆమె ఏమాత్రం వారిని ప‌ట్టించుకోకుండా.. త‌న వెంట వ‌చ్చిన 50 మంది అనుచ‌రుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించి తీరాల్సిందేన‌ని అధికారుల‌కు హుకుం జారీ చేశారు. దీంతో విధిలేక‌.. సామాన్యులను క్యూలైన్ల‌కే వ‌దిలేసిన‌.. అధికారులు.. మంత్రికి, ఆమె అనుచ‌రుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న తీవ్ర వివాదానికి దారితీయ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి గడిచిన వారం రోజుల నుంచీ తిరుమ‌ల‌లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. దీంతో.. స్వామి దర్శనానికి ఏకంగా 40 గంటలకు పైగా సమయం పడుతోంది. ఫలితంగా.. చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ కారణంగానే.. బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఏపీ మంత్రి ఉష శ్రీ చరణ్ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లడం గమనార్హం. ఏకంగా 50 మంది అనుచరులతో కలిసి బ్రేక్ దర్శనానికి వ‌చ్చారు.

అక్కడి అధికారులు పరిస్థితి వివరించినా.. వారిపై ఒత్తిడి చేసి అనుచరులకు బ్రేక్ దర్శనాలు ఇప్పించా రు మంత్రి. మరో పది మంది అనుచరుల వరకు సుప్రభాత సేవా టికెట్లు సైతం ఇప్పించారు. మంత్రి వ్యవహార శైలిపై సామాన్య భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి దర్శనం కోసం తాము రోజుల తరబడి నిల్చుంటే.. మంత్రి మధ్యలో వచ్చి, వెంట జనాన్ని తీసుకొచ్చి, బ్రేక్ దర్శనాల పేరుతో దర్శనం చేసుకొని వెళ్లిపోతారా? అని మండి పడ్డారు.

మీడియాపై దూకుడు..

మంత్రి ఉష శ్రీచ‌ర‌ణ్ వ్య‌వ‌హారంపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులతోనూ.. మంత్రి దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. మీడియా ప్ర‌తినిధుల‌ను తోసుకుని మ‌రీ మంత్రి ఉష శ్రీచరణ్ వెళ్లిపోవడం గమనార్హం. దీంతో మీడియా ప్ర‌తినిధులు అవాక్క‌య్యారు. దీనిపై టీటీడీ అధికారుల‌ను ప్ర‌శ్నించ‌గా.. వారి నుంచి ఎలాంటి స‌మాధానం లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on August 15, 2022 9:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

28 minutes ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

1 hour ago

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

2 hours ago

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

3 hours ago

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…

4 hours ago

స్వయంభు సౌండ్ చాలా పెంచాలి

ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…

4 hours ago