Political News

తిరుమ‌ల‌లో ఏపీ మంత్రి హ‌ల్చ‌ల్‌

తిరుమలలో ఏపీ మంత్రి ఉష శ్రీచ‌ర‌ణ్ హ‌ల్చ‌ల్ చేశారు. సామాన్య భ‌క్తులు.. శ్రీవారి ద‌ర్శ‌నం కోసం.. రోజుల త‌ర‌బ‌డి ఎదురు చూస్తున్నా.. ఆమె ఏమాత్రం వారిని ప‌ట్టించుకోకుండా.. త‌న వెంట వ‌చ్చిన 50 మంది అనుచ‌రుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించి తీరాల్సిందేన‌ని అధికారుల‌కు హుకుం జారీ చేశారు. దీంతో విధిలేక‌.. సామాన్యులను క్యూలైన్ల‌కే వ‌దిలేసిన‌.. అధికారులు.. మంత్రికి, ఆమె అనుచ‌రుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న తీవ్ర వివాదానికి దారితీయ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి గడిచిన వారం రోజుల నుంచీ తిరుమ‌ల‌లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. దీంతో.. స్వామి దర్శనానికి ఏకంగా 40 గంటలకు పైగా సమయం పడుతోంది. ఫలితంగా.. చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ కారణంగానే.. బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఏపీ మంత్రి ఉష శ్రీ చరణ్ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లడం గమనార్హం. ఏకంగా 50 మంది అనుచరులతో కలిసి బ్రేక్ దర్శనానికి వ‌చ్చారు.

అక్కడి అధికారులు పరిస్థితి వివరించినా.. వారిపై ఒత్తిడి చేసి అనుచరులకు బ్రేక్ దర్శనాలు ఇప్పించా రు మంత్రి. మరో పది మంది అనుచరుల వరకు సుప్రభాత సేవా టికెట్లు సైతం ఇప్పించారు. మంత్రి వ్యవహార శైలిపై సామాన్య భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి దర్శనం కోసం తాము రోజుల తరబడి నిల్చుంటే.. మంత్రి మధ్యలో వచ్చి, వెంట జనాన్ని తీసుకొచ్చి, బ్రేక్ దర్శనాల పేరుతో దర్శనం చేసుకొని వెళ్లిపోతారా? అని మండి పడ్డారు.

మీడియాపై దూకుడు..

మంత్రి ఉష శ్రీచ‌ర‌ణ్ వ్య‌వ‌హారంపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులతోనూ.. మంత్రి దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. మీడియా ప్ర‌తినిధుల‌ను తోసుకుని మ‌రీ మంత్రి ఉష శ్రీచరణ్ వెళ్లిపోవడం గమనార్హం. దీంతో మీడియా ప్ర‌తినిధులు అవాక్క‌య్యారు. దీనిపై టీటీడీ అధికారుల‌ను ప్ర‌శ్నించ‌గా.. వారి నుంచి ఎలాంటి స‌మాధానం లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on August 15, 2022 9:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

21 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

1 hour ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

1 hour ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago