Political News

యాత్రపై జనసేనాని కీలక ప్రకటన

ఇప్పటికే ఏపీ రాజకీయం హాట్ హాట్ గా ఉండటం తెలిసిందే. తెల్లారింది మొదలు ఏదో రచ్చ ఏపీ అధికారపక్షానికి సరిపోతుంది. దీనికి తోడు.. పాలన మీద కంటే పంచాయితీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే జగన్ సర్కారు పుణ్యమా అని.. ఏదో ఒక వివాదం.. మరేదో ఒక ఇష్యూతోనే సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఏపీ రాజకీయాల్ని మరింత వేడెక్కించేలా జనసేనాని పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. అక్టోబరు 5 నుంచి ఏపీ వ్యాప్తంగా ఆయన యాత్ర చేయనున్నట్లుగా ప్రకటించారు.

పవన్ కల్యాణ్ ఏపీ యాత్ర మొదలు పెట్టారంటే.. నిత్యం ఏదో ఒక స్టేట్ మెంట్ తో పాటు.. జగన్ సర్కారు తీరును కడిగిపారేయటం ఖాయం. పవన్ ఫైర్ అయిన వేళ.. అధికారపక్ష నేతలు అందుకు బదులుగా కౌంటర్ ఇవ్వటం ఖాయం. మొత్తంగా రాజకీయం వేడెక్కిపోవటం పక్కా అని చెప్పక తప్పదు. తన యాత్రకు సంబంధించిన కీలక ప్రకటన చేసిన పవన్ కల్యాణ్.. జగన్ సర్కారుపై ఘాటు విమర్శల్ని ఎక్కు పెట్టారు.

వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో అభివృద్ధిని మరచిందని.. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసి యువత భవిష్యత్తును నాశనం చేసిందన్నారు. జనసేన పార్టీ సరికొత్త ఐటీ పాలసీతో ముందుకు వస్తుందని.. అది రాష్ట్ర అభివృద్ధికి.. ఐటీ రంగ విస్తరణకు సాయం చేస్తుందన్నారు. తాజాగా మంగళగిరిలోని జనసేన ఐటీ విభాగం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.

పార్టీ బలోపేతం కోసం పని చేసే విభాగాల్లో ఐటీ విభాగం చాలా కీలకమన్న ఆయన.. పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్రానికి  పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. పారిశ్రామికవేత్తల్ని  ఆకర్షించేలా జనసేన ఐటీ పాలసీ ఉండనున్నట్లుగా చెప్పి ఆసక్తిని రేకెత్తించారని చెప్పాలి. అక్టోబరు 5 నుంచి జనసేనాని రాష్ట్రవ్యాప్త యాత్రను మొదలు పెడతారన్న ఆయన.. ఎక్కడి నుంచి మొదలవుతుంది? రూట్ మ్యాప్ ఏమిటి? అన్న వివరాల్ని వెల్లడించాల్సి ఉంది.

This post was last modified on August 14, 2022 8:44 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

9 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

9 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

11 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

11 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

11 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

13 hours ago