Political News

గోరంట్ల రచ్చ.. సజ్జల ప్రెస్ మీట్

గడిచిన మూడు నాలుగు రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన అశ్లీల.. జగుప్సాకరన వీడియోకు సంబంధించిన రచ్చ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అతడిపైన చర్యలు తీసుకోవాలని.. శిక్షించాలన్న డిమాండ్ల వేళ.. అందుకు భిన్నమైన రీతిలో రియాక్షన్ వెలువడింది. ఏపీ ప్రభుత్వ సలహాదారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా వ్యవహరించే సజ్జల రామక్రిష్ణారెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. ఇందులో పలు అంశాల్ని ఆయన ప్రస్తావించారు. అవేమిటన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

–  తాను ప్రజల్లో మనిషి కాదనే విషయం చంద్రబాబు నాయుడుకు తెలుసని, అందుకే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడు. 2019లో ఘోరంగా ఓటమి పాలై వెంటిలేటర్‌ మీదకు చేరుకున్న పార్టీ టీడీపీ. ఈ మూడేళ్లలో వచ్చిన ప్రతీ ఎన్నికలోనూ టీడీపీ ఘోర పరాభవం చూసింది.
–  టీడీపీ నాయకులు నిద్రలో మళ్లీ తామే వస్తున్నామని అంటూ కలవరింతలు పలుకుతున్నారు. వారికి వారు కార్యకర్తల్లో నిరాశను తొలగించడానికి సెల్ఫ్‌ హిప్నాటిజం చేసుకుంటున్నారు.
–  కాకమ్మ కథలతో కాస్త భ్రమ కలిగించవచ్చు కానీ ఫలితం ఉండదు. ఎన్నికల తర్వాత చంద్రబాబు పిల్లి మొగ్గల్లో ఏమాత్రం తేడా రాలేదు. తనని రిజెక్ట్ చేసి మూడేళ్ళయ్యింది…ఆ విషయం ఆయనకు గుర్తుకు రావడం లేదు. ఇప్పటికీ ఆ వాయిస్‌పై క్లారిటీ రాలేదు.
–  2015లో ఒక ఎమ్మెల్సీ కోసం చంద్రబాబు నాయుడు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికితే.. ఆ వాయిస్‌ తనది కాదని బాబు చెప్పారు.
–  ఢిల్లీ వెళ్లి చంద్రబాబు ఏదేదో ప్రచారం చేస్తున్నారు.ప్రధాని మోదీనే ఈయనను పిలిచినట్లు కలరింగ్‌ ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి ఊతకర్ర కోసం చూస్తున్నారు.ఏపీలో బీజేపీ సహకారం కోసం టీడీపీ ప్రయత్నిస్తోంది.
–  నాయకుడు ఎలా ఉండకూడదో చంద్రబాబుకి చూపారు..ఎలా ఉండాలో జగన్‌ చూపించారు. రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనల నుంచి వచ్చిన పార్టీ మాది. చంద్రబాబు మొదటి నుంచీ ఎవరో ఒకరితో పోయాడు. నేను ప్రజల్లో మనిషిని కాదని చంద్రబాబుకి తెలుసు. ప్రజలకు ఏమి కావాలో సీఎం జగన్‌కు తెలుసు.
–  ఓటుకు నోటు కేసులో చంద్రబాబుది ఒరిజినల్‌ వాయిస్‌ కాదా? ఏడేళ్లైనా ఓటుకు నోటు కేసులో బాబు వాయిస్‌పై క్లారిటీ లేదు. కానీ చంద్రబాబు వాయిస్‌ ఎన్నికల వ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసేలా ఉంది. అలాంటి వాడు సీఎంగా, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చేశారు కదా.
–  రాత్రికి రాత్రి పారిపోయి వచ్చిన చరిత్ర అందరికీ తెలుసు. బ్రీఫ్‌డ్‌ మీ అన్నది చంద్రబాబుది కాదా? 2015లో ఒక ఎమ్మెల్సీ కోసం చంద్రబాబు నాయుడు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికితే.. ఆ వాయిస్‌ తనది కాదని బాబు చెప్పారు. ఇప్పటికి ఆ వాయిస్ పై క్లారిటీ లేదు.
–  ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించి అది మార్ఫింగ్‌ వీడియో కాదని తేలితే తప్పక చర్యలుంటాయి. దీనిపై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు.

This post was last modified on August 9, 2022 2:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడేళ్ళలో పుష్ప 3 సాధ్యమేనా

ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప 2 ది రూల్ తర్వాత మూడో భాగం ది ర్యాంపేజ్…

53 seconds ago

బాహుబలి 1 రీ రిలీజ్ – రికార్డులు గల్లంతే

ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి దక్కిన ఆదరణే దానికి సాక్ష్యం.…

5 minutes ago

సునీతా సంపాదన ఎంతో తెలుసా?

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…

44 minutes ago

ఫ్యామిలీకి దూరంగా.. బీసీసీఐ నిబంధనపై కోహ్లీ అసహనం!

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…

1 hour ago

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…

2 hours ago

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

3 hours ago