మిగిలిన దేశాల సంగతి ఎలా ఉన్నా.. ప్రజాస్వామ్య భారతంలో ఏమైనా జరిగే వీలుంది. అది ఈ దేశానికి మాత్రమే సాధ్యమన్నట్లుగా పరిస్థితులు ఉంటాయి. అందుకు నిబంధనలు.. విధానాలు సాయం చేస్తుంటాయి. తాజాగా ఏపీ అధికార పక్షం వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. ఆయన ఈ రోజు రాజ్యసభ సభాపతి స్థానంలో కూర్చొని.. పెద్దల సభను నిర్వహించే వీలు లభించింది.
ఈ పరిణామాన్ని కొందరు హర్షించొచ్చు. మరికొందరు జీర్ణించుకోకపోవచ్చు. కానీ.. విధానాల పరంగా ఈ దేశంలో ఏమైనా సాధ్యమనే విషయానికి ఈ ఉదంతం ఒక నిలువెత్తు నిదర్శనంగా చెప్పొచ్చు. నిబంధనల ప్రకారం రాజ్యసభ వైస్ ఛైర్మన్ కొత్త ప్యానల్ లో విజయసాయి రెడ్డికి ఇటీవల అవకాశం లభించింది. రాజ్యసభ ప్యానల్ వైస్ ఛైర్మన్ హోదాలో గురువారం తొలిసారి ఆయన రాజ్యసభను నడించారు.
అదెలా సాధ్యమైందంటే.. రాజ్యసభ ఛైర్మన్.. డిప్యూటీ ఛైర్మన్ ఇద్దరు అందుబాటులో లేనప్పుడు.. వైస్ ఛైర్మన్లుగా ఎంపికైన వారిలో ఎవరో ఒకరు సభను నిర్వహించే వీలు ఉంటుంది. గత నెలలో రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానల్ ను ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు రీషఫిల్ చేశారు. అందులో విజయసాయికి చోటు లభించింది. విజయసాయి విషయానికి వస్తే ఆడిటర్ గా సుప్రసిద్ధుడు..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. ఆయన మీద ఉన్న కేసుల్లో జగన్ తో పాటు సహ నిందితుడిగా పలు కేసుల్ని ఎదుర్కొంటున్నారు. అవి కోర్టు విచారణలో ఉన్నాయి. ఇలాంటివేళలో.. దేశంలోనే అత్యుత్తమమైన పార్లమెంటు లోని పెద్దల సభను నిర్వహించే వీలు చిక్కటం చూస్తే.. మన దేశంలోని నిబంధనలు.. విధానాలు ఆసక్తికరంగా ఉంటాయని చెప్పక తప్పదు. ఈ దేశంలో ఏమైనా జరగొచ్చన్న దానికి నిలువెత్త నిదర్శనంగా తాజా పరిణామాన్ని చెప్పొచ్చు.
This post was last modified on August 4, 2022 8:56 pm
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…