ఎవరికి కూడా వైరాగ్యం అంత తొందరగా రాదు. అందులోను రాజకీయాల్లో దశాబ్దాలుగా పదవుల్లో ఉంటున్నవారికి అసలు రాదు. దీర్ఘకాలంపాటు ప్రతిపక్షంలోనే ఉన్నవారిలో కొందరు నేతలకు వైరాగ్యం వచ్చినా అదోలెక్క. ఎందుకంటే ఎంతకాలమున్నా ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సిందే అని ఫిక్సయిపోయిన కొందరికి వైరాగ్యం రావటంలో తప్పుకూడాలేదు. కానీ అధికారంలో ఉంటు మంత్రిగా పనిచేస్తున్న సీనియర్ నేతకు కూడా వైరాగ్యం వచ్చిందంటే ఏమిటర్ధం ?
ఇపుడిదంతా ఎవరి విషయంలో అంటారా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురించే. మహారాష్ట్రలోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ మాట్లాడుతు రాజకీయాలంటే కేవలం అధికారం కోసమే అన్నట్లుగా మారిపోయిందన్నారు. ఇలాంటి రాజకీయాలను చూసిన తర్వాత దూరంగా జరగాలని అనిపిస్తోందంటు గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు బీజేపీలో చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో ఉండటం, పదవులు అనుభవించటం లేదా పదవుల కోసం ప్రయత్నాలు చేసుకోవటం కన్నా చేయాల్సిన పనులు వేరే ఉన్నాయని అనిపిస్తోందని కేంద్రమంత్రి చెప్పారు.
రాజకీయాలంటే సమాజం, దేశ సంక్షేమం కోసం చేసేవేనా ? లేకపోతే పదవుల కోసం చేసేవి మాత్రమేనా అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ప్రస్తుతం రాజకీయాలంటే పదవులు, అధికారం అందుకోవటం కోసమే అన్నట్లుగా తయారైందని గడ్కరీ తెగ బాధపడిపోయారు. అందుకనే పదవుల కోసం కాకుండా రాజకీయ నేతలు సేవా మార్గం గురించి కూడా ఆలోచించాలన్నారు. అంతా బాగానే ఉందికానీ సడెన్ గా గడ్కరీలో ఇంతటి వైరాగ్యం ఎందుకు వచ్చిందో అర్ధం కావటం లేదు.
కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో ఉన్నారు. బీజేపీని కూడా శాసించగలిగిన ఆర్ఎస్ఎస్ లో కూడా గడ్కరీ ప్రముఖుడనే చెప్పాలి. నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయాన్ని చూడాల్సొస్తే ఎవరు అన్నపుడు గడ్కరీ పేరే ప్రముఖంగా వినిపించింది ఒక సమయంలో. మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేతల్లో ఈయన కూడా ముందు వరసలోనే ఉంటారు. ఇంతటి కీలకమైన స్థానంలో, కీలకమైన పాత్రను పోషిస్తున్న గడ్కరీకి ఉన్నట్టుండి రాజకీయాలంటే ఇంతటి వైరాగ్యం ఎందుకొచ్చిందో తెలీటం లేదు. తొందరలోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారేమో చూడాలి.
This post was last modified on July 26, 2022 2:22 pm
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…
2022 లెజెండ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తమిళ వ్యాపారవేత్త శరవణన్ ని మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు.…
తమిళ మలయాళ టైటిల్స్ ని ఒరిజినల్ పేర్లతో పెట్టడం సినిమాల ఓపెనింగ్స్, బజ్ మీద ఎంత ప్రభావం చూపిస్తోందో నిర్మాతలు…
ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు.…
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు ఇప్పటికీ విడుదల తేదీ ఖరారు…
యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు అంకుశం, ఆగ్రహం, మగాడు లాంటి సూపర్ హిట్స్ తో తొంభై దశకంలో మంచి…