Political News

సీఎం టూరుకు నో చెప్పడం ఏంటి?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంగా సరికొత్త పంచాయతీ మొదలైంది. ఆగష్టు 1వ తేదీ సింగపూర్లో ప్రపంచ నగరాల సదస్సు జరగబోతోంది. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా కేజ్రీవాల్ కు ఆహ్వానం అందింది. సరే ఢిల్లీకి రాష్ట్ర హోదానే ఉన్నా పరిమితిమైన అధికారాలే ఉన్న విషయం తెలిసిందే. అయినా ఏ ముఖ్యమంత్రయినా విదేశీ పర్యటనలకు వెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. అయితే ఇక్కడ కేజ్రీవాల్ కు ఒక సమస్యుంది.

అవేమిటంటే ముందుగా లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనుమతి తీసుకోవాలి. కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా లెఫ్ట్ గవర్నర్ ఆమోదం అయితేనే అమల్లోకి వస్తుంది. ఇందులో బాగంగానే తన సింగపూర్ పర్యటనకు అనుమతించాలని లెఫ్ట్ గవర్నర్ వీకే సక్సేనాకు లెటర్ రాశారు. అయితే దాదాపు నెలన్నర రోజుల తర్వాత ఇపుడు అనుమతి నిరాకరిస్తూ సమాధానమిచ్చారు. నిజానికి విదేశీ ప్రయాణానికి వెళ్ళటానికి సీఎంలు లేఖలు రాయటం కేవలం లాంఛనం మాత్రమే.

ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విదేశీ ప్రయాణానికి అనుమతి కోరుతూ లేఖలు అందినా కేంద్రం వెంటనే ఓకే చెప్పేస్తుంది. కాబట్టి ఎప్పుడూ ఏ సీఎంకు సమస్యలు ఎదురుకాలేదు. కానీ ఇక్కడ కేజ్రీవాల్ లేఖను నెలన్నరోజులు అట్లే పెట్టుకుని చివరకు అనుమతి నిరాకరించటం విచిత్రంగా ఉంది. ఇక్కడే కేజ్రీవాల్ కు కొత్త పంచాయితీ మొదలైంది. పైగా అనుమతి నిరాకరణకు కారణంగా ‘అది మేయర్ల సదస్సు కాబట్టి ముఖ్యమంత్రి హాజరు అవసరంలేదని భావించినట్లు లెఫ్ట్ గవర్నర్ చెప్పటమే ఆశ్చర్యం.

ఇక్కడ విషయం ఏమిటంటే చాలాకాలంగా కేజ్రీవాల్ కు కేంద్రానికి ఏమాత్రం పడటం లేదు. ఢిల్లీ సీఎంను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ సర్కార్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను ముందు పెట్టి వ్యూహాలు రచిస్తోంది. దాన్ని ఎప్పటికప్పుడు అరవింద్ తిప్పికొడుతున్నారు. ఈ నేపధ్యంలోనే కేంద్రం-కేజ్రీవాల్ మధ్య బాగా గొడవలవుతున్నాయి. సింగపూర్ పర్యటనకు తాను కచ్చితంగా హాజరైతీరుతానని కేజ్రీవాల్ ప్రకటించారు. మరి కేంద్రం ఏమి చేస్తుందో చూడాలి. అయినే… లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయం సిల్లీగా ఉందని రాజకీయ విమర్శకులు అంటున్నారు. ఒకవేళ బీజేపీ మనసు గెలుచుకోవడానికే ఆయన చేశారనుకుందామన్నా… అది బీజేపీకి నష్టం చేస్తుందే గాని లాభం చేయదు అంటున్నారు.

This post was last modified on July 22, 2022 10:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

27 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago