Political News

రామోజీ దృతరాష్ట్రుడు: శ్రీకాంత్ రెడ్డి

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందంటూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని…. జగన్ ప్రజారంజక పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వంపై, జగన్ పై ఎల్లో మీడియాకు చెందిన కొన్ని పత్రికలు, చానెళ్లు విష ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 108 వాహనాల కొనుగోలులో 300 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తూ టీడీపీ నేతలు బురదజల్లుదున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపై వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనాడు పత్రికలో వైసీపీపై విషం చిమ్ముతున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఈనాడులో వార్తలు రాస్తున్నారని, రామోజీరావు ధృతరాష్ట్రుడిలా కళ్లు మూసుకోవద్దని హితవు పలికారు.

పార్టీ, కులం, మతం చూడకుండా అన్ని వర్గాల ప్రజలకు తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందని, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని, చెప్పని చాలా హామీలను అమలు చేస్తోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఓ వైపు కరోనా విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొంటూనే….మరో వైపు సంక్షేమ పథకాల కోసం గత 6 నెలల్లో రూ.28,122 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. ఇవేమీ రామోజీరావుకు పట్టవని, ఈనాడులో అసత్య వార్తలు వస్తున్నా…కళ్లు మూసుకున్నారని మండిపడ్డారు. కరోనాకు సంబంధించిన వార్తల్లో ఏపీకి సంబంధించి ఒకలా, తెలంగాణకు సంబంధించి మరోలా ఈనాడులో వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలను ఈనాడు, ఎల్లో మీడియా తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు.జగన్ పాలనను టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని, కరోనా విపత్తు సమయంలోనూ ప్రభుత్వంపై అసత్య ప్రచారం దారుణమని మండిపడ్డారు. 108, 104లను టీడీపీ పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ఇపుడేమో 108 వాహనాల్లో రూ. 300 కోట్ల అవినీతి అని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనపై ప్రజలంతా సంతృప్తితో ఉన్నారని…. జగన్ ప్రజాదరణ ముందు టీడీపీ మట్టికొట్టుకొనిపోతుందని అన్నారు.

This post was last modified on July 1, 2020 7:48 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

48 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago