Political News

గోమూత్రం అమ్ముతాం.. కొనుక్కోండి..బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌

బీజేపీ పాలిత ప్ర‌భుత్వాలు.. వింత వింత ప‌నుల‌తో వార్త‌ల్లో నిలుస్తున్నాయి. త‌మ‌కు ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న వారి ఇళ్ల‌పైకి రాత్రి వేళ ఏదో ఒక కార‌ణం చెప్పి.. బుల్ డోజ‌ర్లు పంపించ‌డం.. హిజాబ్ ర‌గ‌డ‌ల‌కు.. త‌మ వారినే ప్రోత్స‌హించడం .. వంటివి తెర‌మీదికి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఇప్పుడు.. గోమూత్రం అమ్ముతామంటూ.. బీజేపీ స‌ర్కారు బేరం పెట్టింది.

లీటర్ ఆవు మూత్రాన్ని రూ.4 చొప్పున కొనుగోలు చేసి స‌బ్సిడీపై తాము విక్ర‌యిస్తామ‌ని.. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్ర‌క‌టించింది. ‘గోధన్ న్యాయ్ యోజన’ పథకం కింద ఇప్పటికే ఆవు పేడను కొనుగోలు చేసి పండ‌గ‌లు.. ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు విక్ర‌యిస్తున్న ఈ స‌ర్క‌రు.. తాజాగా మూత్రాన్ని కూడా సేకరించి విక్ర‌యించ‌నున్నట్లు పేర్కొంది.

ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆవు మూత్రాన్ని కొనుగోలు చేసే పథకాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు లీటర్ ఆవు మూత్రాన్ని రూ.4 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. ‘హరేలీ’ (రైతు పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకొని జులై 28న కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది. ‘గోధన్ న్యాయ్ యోజన’ పథకం కింద ఇప్పటికే ఆవు పేడను కొనుగోలు చేస్తుండగా.. తాజాగా మూత్రాన్ని కూడా సేకరించనున్నట్లు పేర్కొంది.

రైతులు, పశుపోషకులను ప్రోత్సహించి.. గ్రామీణుల ఆదాయాన్ని పెంచేలా రెండేళ్ల కింద ఈ పథకాన్ని తీసుకువచ్చిన‌ట్టు ప్ర‌భుత్వం తెలిపింది. ఈ మూత్రాన్ని, పేడ‌ను అవ‌స‌ర‌మైన వారికి.. ప్ర‌త్యేక కౌంట‌ర్ల ద్వారా విక్ర‌యించే ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు స‌ర్కారు ఒక ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ప్రస్తుతానికి మొదటి విడతగా జిల్లాకు రెండు చొప్పున కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటి నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీని నియమించినట్లు చెప్పారు.

మహిళా స్వయం సహాయక సంఘాలకు శిక్షణ ఇచ్చి.. కొనుగోలు, విక్ర‌య‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఎరువులు, క్రిమి సంహారక ఉత్పత్తుల తయారీలో గోమూత్రాన్ని వినియోగిస్తారని పేర్కొన్నారు. అంతకుముందు 2020 జులైలో ‘హరేలీ’ పండుగ నేపథ్యంలో గోధన్ న్యాయ్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద కిలో ఆవు పేడను రూ.2కు కొనుగోలు చేస్తారు.

గత రెండేళ్లలో సుమారు రూ.150 కోట్ల విలువైన 20 లక్షల క్వింటాళ్ల పేడను కొనుగోలు చేశారు. దానిని 200 కోట్ల కు విక్ర‌యించారు. ఇప్పుడు మూత్రం బిజినెస్ చేయాల‌ని స‌ర్కారు రెడీ కావ‌డం గ‌మ‌నార్హం. మూత్రాన్ని ల్యాబ్‌ల‌లో శుద్ధి చేసి విదేశాల‌కు కూడా పంపించే యోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌ర్కారు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 19, 2022 3:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టార్గెట్ పెట్టుకున్న ప్రభాస్ ఫౌజీ

ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కలయికలో తెరకెక్కుతున్న ఫౌజీ షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. ఒక మూడు యాక్షన్ ఎపిసోడ్స్…

2 hours ago

యువ ద‌ర్శ‌కుడికి కోపమొచ్చింది

చాలా త‌క్కువ‌ బ‌డ్జెట్లో, స్టార్ ఇమేజ్ లేని న‌టీన‌టులంతో నైంటీస్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ తీసి తెలుగు ప్రేక్ష‌కులను…

3 hours ago

“నేను – ప‌వ‌న్ క‌లిసే ఉంటాం… ఇక మీ ఇష్టం“

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. త‌న పార్టీ సీనియ‌ర్ల‌కు.. ప‌రోక్షంగా ఓ విష‌యాన్ని తేల్చి చెప్పేశారు. కూట‌మి విష‌యంలోనూ.. ముఖ్యంగా జ‌న‌సేన‌-టీడీపీ…

8 hours ago

విచార‌ణ మ‌ధ్య‌లో `సెక్స్` వీడియోలు.. హైకోర్టు జ‌డ్జికి షాక్‌!

అది ఢిల్లీ హైకోర్టు. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఓ కేసు విచార‌ణను ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జ‌రిగాయి. వ‌ర్చువ‌ల్ విచార‌ణ‌లో…

13 hours ago

ప‌సుపు జెండా పౌరుషం ఎప్పుడూ త‌గ్గ‌లేదు

టీడీపీ నూత‌న కార్య‌వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం ఘ‌నంగా జ‌రిగింది. ఇటీవ‌ల పార్టీలో జాతీయ‌, రాష్ట్ర స్థాయి కార్య‌వ‌ర్గాల‌తోపాటు.. పొలిట్ బ్యూరోను…

16 hours ago

పెద్ద ట్విస్టు… పెద్ది విడుదల తేదీ ఇదా

మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…

17 hours ago