Political News

గోమూత్రం అమ్ముతాం.. కొనుక్కోండి..బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌

బీజేపీ పాలిత ప్ర‌భుత్వాలు.. వింత వింత ప‌నుల‌తో వార్త‌ల్లో నిలుస్తున్నాయి. త‌మ‌కు ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న వారి ఇళ్ల‌పైకి రాత్రి వేళ ఏదో ఒక కార‌ణం చెప్పి.. బుల్ డోజ‌ర్లు పంపించ‌డం.. హిజాబ్ ర‌గ‌డ‌ల‌కు.. త‌మ వారినే ప్రోత్స‌హించడం .. వంటివి తెర‌మీదికి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఇప్పుడు.. గోమూత్రం అమ్ముతామంటూ.. బీజేపీ స‌ర్కారు బేరం పెట్టింది.

లీటర్ ఆవు మూత్రాన్ని రూ.4 చొప్పున కొనుగోలు చేసి స‌బ్సిడీపై తాము విక్ర‌యిస్తామ‌ని.. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్ర‌క‌టించింది. ‘గోధన్ న్యాయ్ యోజన’ పథకం కింద ఇప్పటికే ఆవు పేడను కొనుగోలు చేసి పండ‌గ‌లు.. ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు విక్ర‌యిస్తున్న ఈ స‌ర్క‌రు.. తాజాగా మూత్రాన్ని కూడా సేకరించి విక్ర‌యించ‌నున్నట్లు పేర్కొంది.

ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆవు మూత్రాన్ని కొనుగోలు చేసే పథకాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు లీటర్ ఆవు మూత్రాన్ని రూ.4 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. ‘హరేలీ’ (రైతు పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకొని జులై 28న కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది. ‘గోధన్ న్యాయ్ యోజన’ పథకం కింద ఇప్పటికే ఆవు పేడను కొనుగోలు చేస్తుండగా.. తాజాగా మూత్రాన్ని కూడా సేకరించనున్నట్లు పేర్కొంది.

రైతులు, పశుపోషకులను ప్రోత్సహించి.. గ్రామీణుల ఆదాయాన్ని పెంచేలా రెండేళ్ల కింద ఈ పథకాన్ని తీసుకువచ్చిన‌ట్టు ప్ర‌భుత్వం తెలిపింది. ఈ మూత్రాన్ని, పేడ‌ను అవ‌స‌ర‌మైన వారికి.. ప్ర‌త్యేక కౌంట‌ర్ల ద్వారా విక్ర‌యించే ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు స‌ర్కారు ఒక ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ప్రస్తుతానికి మొదటి విడతగా జిల్లాకు రెండు చొప్పున కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటి నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీని నియమించినట్లు చెప్పారు.

మహిళా స్వయం సహాయక సంఘాలకు శిక్షణ ఇచ్చి.. కొనుగోలు, విక్ర‌య‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఎరువులు, క్రిమి సంహారక ఉత్పత్తుల తయారీలో గోమూత్రాన్ని వినియోగిస్తారని పేర్కొన్నారు. అంతకుముందు 2020 జులైలో ‘హరేలీ’ పండుగ నేపథ్యంలో గోధన్ న్యాయ్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద కిలో ఆవు పేడను రూ.2కు కొనుగోలు చేస్తారు.

గత రెండేళ్లలో సుమారు రూ.150 కోట్ల విలువైన 20 లక్షల క్వింటాళ్ల పేడను కొనుగోలు చేశారు. దానిని 200 కోట్ల కు విక్ర‌యించారు. ఇప్పుడు మూత్రం బిజినెస్ చేయాల‌ని స‌ర్కారు రెడీ కావ‌డం గ‌మ‌నార్హం. మూత్రాన్ని ల్యాబ్‌ల‌లో శుద్ధి చేసి విదేశాల‌కు కూడా పంపించే యోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌ర్కారు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

26 minutes ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

33 minutes ago

నరాల్లో హార్పిక్ ఎక్కించడం ఏంటి తల్లీ

నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…

47 minutes ago

ఈసారి స్వయంగా రంగంలోకి దిగుతున్న PK

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌.. ఉర‌ఫ్ PK .. ఈ నెల 30న జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో ప్ర‌త్య‌క్ష…

1 hour ago

ఫ్యామిలీ సినిమా… దున్నేస్తోంది

తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…

2 hours ago

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సుగాలి ప్రీతి త‌ల్లి కేసు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై క‌ర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి త‌ల్లి పార్వ‌తీదేవి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆయ‌న‌పై…

2 hours ago