Political News

‘జోష్’ త‌గ్గొద్దు.. ఏం చేస్తారో మీ ఇష్టం.. తాడేప‌ల్లిలో చ‌ర్చ‌..!

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ నివాసం తాడేప‌ల్లిలో అనేక కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వ ప‌రంగా ఏ కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా.. ఇక్క‌డే చేస్తున్నారు. ఈ క్ర‌మంలో మంత్రులు.. పార్టీ నాయకులు కూడా ఇక్క‌డే స‌మావేశాల‌కు వ‌స్తున్నారు ఈ క్ర‌మంలో ఒక చిత్ర‌మైన విష‌యంపై సీఎం జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌స్తుతం వైసీపీలో జోష్ నెల‌కొంద‌ని.. ఆ జోష్‌ను త‌గ్గ‌కుండా చూడాల‌ని అన్నారు. దీనికి నాయ‌కులు స్పందిస్తూ.. ప్లీన‌రీ స‌హా..భీమ‌వ‌రంలో నిర్వ‌హించిన స‌భ‌లు.. జోష్ నింపాయ‌ని చెప్పారు.

కానీ.. ఆ రెండు కార్య‌క్ర‌మాలు అయిపోయాయ‌ని.. ఇప్పుడు.. అలాంటి కార్య‌క్ర‌మాలు లేవ‌ని.. నాయకులు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. దీనిపై జ‌గ‌న్ స్పందిస్తూ.. మీరు ఏం చేస్తారో తెలియదు.. నాకు మాత్రం పార్టీ లో జోష్ త‌గ్గింద‌నే మాట వినిపించ‌కూడద‌ని వ్యాఖ్యానించిన‌ట్టు.. వైసీపీ వ‌ర్గాల్లో గుస‌గుస వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు వారు ఏం చేయాల‌నే విష‌యంపై త‌ల ప‌ట్టుకున్నారు. వాస్త‌వానికి భీమ‌వ‌రంలో నిర్వ‌హించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌భ‌..వైసీపీలో జోష్ పెంచింది.

ఈ కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్‌.. అంతా తానే అయి.. స‌భ‌ను నిర్వ‌హించారు. దీంతో కీల‌క‌మైన బీజేపీ పొత్తు పార్టీ అధినేత, జ‌న‌సేనాని ప‌వ‌న్‌కు కూడా ఆహ్వానం అంద‌లేదు. ఇక‌, వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణ రాజును కూడా ప‌క్కన పెట్టారు. మ‌రోవైపు.. కాపుల‌కు అత్యంత ఇష్ట‌మైన చిరంజీవిని ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. దీంతో ఇదంతా కూడా జ‌గ‌న్‌కు.. వైసీపీకి కూడా మైలేజీ పెంచింద‌నే భావ‌న వ్య‌క్తం చేసింది. ఇక‌, తాజాగా నిర్వ‌హించిన‌.. నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా స్థాయి ప్లీన‌రీలు, మ‌హా ప్లీన‌రీ కూడా పార్టీలో కొత్త ఉత్సాహం తీసుకువ‌చ్చింది.

భారీ ఎత్తున జ‌నం త‌ర‌లిరావ‌డంతోపాటు.. పార్టీలో కొత్త ఉత్సాహం కూడా క‌నిపించింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా ప్లీన‌రీ ఉత్సాహాన్ని కొన‌సాగించాల‌ని.. ఇదే జోష్‌ను కొన‌సాగించాల‌ని.. సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారు. అయితే.. నాయ‌కులు మాత్రం.. ఈ రెండు కార్య‌క్ర‌మాల వ‌ల్ల జోష్ వ‌చ్చింద‌ని.. ఇక నుంచి ఇలాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించే ప‌రిస్థితి లేద‌ని.. కాబ‌ట్టి.. జోష్ కొన‌సాగుతుందా? లేదా? అనేది ఎలా తెలుస్తుంద‌ని.. వ్యాఖ్యానిస్తున్నారు. అలా కాదు.. మీరు ఏం చేసినా.. జోష్‌ను మాత్రం త‌గ్గించ‌డానికి వీల్లేద‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. దీంతో ఇప్పుడు నాయ‌కులు ఏం చేయాల‌నే విష‌యంపై త‌ల ప‌ట్టుకున్నారు.

This post was last modified on July 16, 2022 10:15 pm

Share

Recent Posts

భూమా.. బంగార‌మా… ఎక‌రం 269 కోట్ల రూపాయలా!

బంగారంతో పోటీ ప‌డుతున్న‌ట్టుగా భూముల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఇది ఎక్క‌డో కాదు. తెలంగాణ‌లోనే !. రాష్ట్ర పారిశ్రామిక‌,…

23 minutes ago

ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ అవ‌స‌రం… ఇదిగో రీజ‌న్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ల్యాణ్ ప్ర‌జ‌ల‌కు ఎంత అవ‌స‌ర‌మో తేల్చి చెప్పే ఉదంతం ఇది. ఆయ‌న‌ను…

1 hour ago

లోకేష్… ట్విట్టర్ ని కూడా వదలట్లేదు

మనసుంటే మార్గాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ నిరూపించారు. ఒక పారిశ్రామికవేత్త ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ కు నిముషాల్లో స్పందించారు.…

2 hours ago

‘మ్యాడ్’ భామకు ప్యారడైజ్ ఛాన్స్ మిస్…

నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…

3 hours ago

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గ్రేటే

టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…

3 hours ago

నాని సినిమా… సూపర్ స్ట్రాటజీ

యుఎస్‌లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…

9 hours ago