వైసీపీ అధినేత, సీఎం జగన్ నివాసం తాడేపల్లిలో అనేక కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం నిర్వహించినా.. ఇక్కడే చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రులు.. పార్టీ నాయకులు కూడా ఇక్కడే సమావేశాలకు వస్తున్నారు ఈ క్రమంలో ఒక చిత్రమైన విషయంపై సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వైసీపీలో జోష్ నెలకొందని.. ఆ జోష్ను తగ్గకుండా చూడాలని అన్నారు. దీనికి నాయకులు స్పందిస్తూ.. ప్లీనరీ సహా..భీమవరంలో నిర్వహించిన సభలు.. జోష్ నింపాయని చెప్పారు.
కానీ.. ఆ రెండు కార్యక్రమాలు అయిపోయాయని.. ఇప్పుడు.. అలాంటి కార్యక్రమాలు లేవని.. నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. మీరు ఏం చేస్తారో తెలియదు.. నాకు మాత్రం పార్టీ లో జోష్ తగ్గిందనే మాట వినిపించకూడదని వ్యాఖ్యానించినట్టు.. వైసీపీ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు వారు ఏం చేయాలనే విషయంపై తల పట్టుకున్నారు. వాస్తవానికి భీమవరంలో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ సభ..వైసీపీలో జోష్ పెంచింది.
ఈ కార్యక్రమంలో సీఎం జగన్.. అంతా తానే అయి.. సభను నిర్వహించారు. దీంతో కీలకమైన బీజేపీ పొత్తు పార్టీ అధినేత, జనసేనాని పవన్కు కూడా ఆహ్వానం అందలేదు. ఇక, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజును కూడా పక్కన పెట్టారు. మరోవైపు.. కాపులకు అత్యంత ఇష్టమైన చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీంతో ఇదంతా కూడా జగన్కు.. వైసీపీకి కూడా మైలేజీ పెంచిందనే భావన వ్యక్తం చేసింది. ఇక, తాజాగా నిర్వహించిన.. నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్లీనరీలు, మహా ప్లీనరీ కూడా పార్టీలో కొత్త ఉత్సాహం తీసుకువచ్చింది.
భారీ ఎత్తున జనం తరలిరావడంతోపాటు.. పార్టీలో కొత్త ఉత్సాహం కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల వరకు కూడా ప్లీనరీ ఉత్సాహాన్ని కొనసాగించాలని.. ఇదే జోష్ను కొనసాగించాలని.. సీఎం జగన్ భావిస్తున్నారు. అయితే.. నాయకులు మాత్రం.. ఈ రెండు కార్యక్రమాల వల్ల జోష్ వచ్చిందని.. ఇక నుంచి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి లేదని.. కాబట్టి.. జోష్ కొనసాగుతుందా? లేదా? అనేది ఎలా తెలుస్తుందని.. వ్యాఖ్యానిస్తున్నారు. అలా కాదు.. మీరు ఏం చేసినా.. జోష్ను మాత్రం తగ్గించడానికి వీల్లేదని జగన్ చెబుతున్నారు. దీంతో ఇప్పుడు నాయకులు ఏం చేయాలనే విషయంపై తల పట్టుకున్నారు.
This post was last modified on July 16, 2022 10:15 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…