విషయం పాతదే అయినా చెప్పటమే కొత్తగా చెప్పాలని జనసేన ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని రోడ్ల పరిస్దితిపై జనసేన ఈనెల 15, 16, 17 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ ప్రచారం చేయబోతున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ డిజిటల్ ప్రచారానికి ‘గుడ్ మార్నింగ్ సీఎం సర్’ అనే హ్యాష్ ట్యాగ్ లైన్ తో నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు.
రాష్ట్రంలోని గ్రామాల్లో రోడ్ల దుస్ధితిని ఫొటోలు, విజువల్స్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలని అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారట. గతంలో కూడా రోడ్ల పరిస్ధితిపై కొద్దిరోజులు జనసేన నేతలు, కార్యకర్తలు నానా హడావుడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. పాడైపోయిన రోడ్లను మరమ్మతులు చేసే కార్యక్రమాన్ని అప్పట్లో జనసేన టేకప్ చేసింది. పవన్ స్వయంగా కాకినాడలోని ఒక రోడ్డు గుంతను పూడ్చేందుకు వెళ్ళారు. అయితే వివిధ కారణాల వల్ల నిరసనలో పవన్ పాల్గొనలేకపోయారు.
ఇదే సమయంలో కొందరు జనసేన నేతలు, కార్యకర్తల అత్యుత్సాహం వల్ల అప్పటి నిరసన కార్యక్రమం పెద్దగా వర్కవుట్ కాలేదు. దీనికి కారణం వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడమే. అప్పట్లో కూడా వర్షాకాలంలోనే జనసేన టేకప్ చేసింది.
మళ్ళీ ఇంతకాలానికి సేమ్ వర్షాకాలంలోనే జనసేన కొత్త పద్దతిలో గుడ్ మార్నింగ్ సీఎం సర్ అనే హ్యాష్ ట్యాగ్ లైన్ తో డిజిటల్ రూపంలో నిరసన చెప్పబోతోంది. అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటంటే రోడ్లు మరింతగా డామేజ్ అయ్యాయి. కొన్ని పనులు చేసినా అయితే ఇంకా పనులు మొదలుకాని గ్రామాలు చాలానే ఉన్నాయి. మరీ కొత్త పద్దతి డిజిటల్ నిరసన ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.
This post was last modified on July 13, 2022 10:01 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…