విషయం పాతదే అయినా చెప్పటమే కొత్తగా చెప్పాలని జనసేన ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని రోడ్ల పరిస్దితిపై జనసేన ఈనెల 15, 16, 17 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ ప్రచారం చేయబోతున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ డిజిటల్ ప్రచారానికి ‘గుడ్ మార్నింగ్ సీఎం సర్’ అనే హ్యాష్ ట్యాగ్ లైన్ తో నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు.
రాష్ట్రంలోని గ్రామాల్లో రోడ్ల దుస్ధితిని ఫొటోలు, విజువల్స్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలని అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారట. గతంలో కూడా రోడ్ల పరిస్ధితిపై కొద్దిరోజులు జనసేన నేతలు, కార్యకర్తలు నానా హడావుడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. పాడైపోయిన రోడ్లను మరమ్మతులు చేసే కార్యక్రమాన్ని అప్పట్లో జనసేన టేకప్ చేసింది. పవన్ స్వయంగా కాకినాడలోని ఒక రోడ్డు గుంతను పూడ్చేందుకు వెళ్ళారు. అయితే వివిధ కారణాల వల్ల నిరసనలో పవన్ పాల్గొనలేకపోయారు.
ఇదే సమయంలో కొందరు జనసేన నేతలు, కార్యకర్తల అత్యుత్సాహం వల్ల అప్పటి నిరసన కార్యక్రమం పెద్దగా వర్కవుట్ కాలేదు. దీనికి కారణం వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడమే. అప్పట్లో కూడా వర్షాకాలంలోనే జనసేన టేకప్ చేసింది.
మళ్ళీ ఇంతకాలానికి సేమ్ వర్షాకాలంలోనే జనసేన కొత్త పద్దతిలో గుడ్ మార్నింగ్ సీఎం సర్ అనే హ్యాష్ ట్యాగ్ లైన్ తో డిజిటల్ రూపంలో నిరసన చెప్పబోతోంది. అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటంటే రోడ్లు మరింతగా డామేజ్ అయ్యాయి. కొన్ని పనులు చేసినా అయితే ఇంకా పనులు మొదలుకాని గ్రామాలు చాలానే ఉన్నాయి. మరీ కొత్త పద్దతి డిజిటల్ నిరసన ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.
This post was last modified on July 13, 2022 10:01 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…