భారత జాతీయ చిహ్నం.. మూడు సింహాలపై ముప్పేట దుమారం రేగింది. దేశవ్యాప్తంగా అన్ని బీజేపీయేతర పార్టీలు.. తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మోడీ నిర్వాకంతో భారత్ పరువు మంటగలుస్తోందని నిప్పులు చెరుగుతున్నారు. మరి ఇంతకీ ఏం జరిగింది? అనేది ఆసక్తిగా మారింది. పార్లమెంటు నూతన భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం.. రాజకీయ దుమారానికి కారణమైంది.
కొత్త చిహ్నంపై విపక్షాలు, సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. హుందాగా, రాజసంగా, ఆత్మవిశ్వాసంతో ఉండే నాలుగు సింహాలు.. క్రూరంగా, దౌర్జన్యపూర్వకంగా కనిపిస్తున్నాయని, తక్షణమే మార్చాలన్నది వారి ప్రధాన డిమాండ్.
ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఈ జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. దేశంలో అతి పెద్దది ఇదే. 9,500 కిలోల బరువు, ఆరున్నర మీటర్ల ఎత్తుతో అశోక చక్రం, నాలుగు సింహాల ప్రతిమను రూపొందించారు. మోడీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంపై అభ్యంతరం తెలుపుతూ కాంగ్రెస్, టీఎంసీ సహా మరికొన్ని పార్టీల నేతలు, చరిత్రకారులు ట్వీట్ చేశారు.
మోడీ గారూ… దయచేసి సింహం ముఖాన్ని ఓసారి చూడండి. సర్నాథ్ నుంచి స్ఫూర్తిపొంది రూపొందించిన ప్రతిమలా ఉందా లేక వక్రీకరించిన గిర్ సింహం ఫొటోలా ఉందో ఒకసారి పరిశీలించండి. అవసరమైతే మార్పించండి అని ట్వీట్ చేశారు లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి.
మన జాతీయ చిహ్నాన్ని అవమానించారు. ఎడమ వైపు ఉన్నది ఒరిజినల్ ఫొటో. సింహాలు హుందాగా, రాజసంతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. కుడి వైపు ఉన్నది మోదీ వెర్షన్. ఆ సింహాలు.. ఆగ్రహంతో, దూకుడుగా ఉన్నాయి. ఇది సిగ్గుచేటు. తక్షణమే మార్చండి. అని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్.
జాతీయ చిహ్నంతో ఆటలు ఆడడం అనవసరం. మన సింహాలు అసలు ఎందుకు క్రూరంగా, కోపంగా కనిపించాలి? 1950లో అశోకుడి సింహాల నుంచి స్ఫూర్తి పొంది స్వతంత్ర భారత దేశం ఈ చిహ్నాన్ని రూపొందించింది అని ట్వీట్ చేశారు చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్. జాతీయ చిహ్నంలో మార్పును తప్పుబట్టారు సీనియర్ న్యాయవాది, సామాజిక ఉద్యమకారుడు ప్రశాంత్ భూషణ్. ‘మోడీ నవ భారత్’ ఇదేనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
This post was last modified on July 12, 2022 10:05 pm
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…