Political News

మూడు సింహాల‌పై తీవ్ర దుమారం

భార‌త జాతీయ చిహ్నం.. మూడు సింహాల‌పై ముప్పేట దుమారం రేగింది. దేశ‌వ్యాప్తంగా అన్ని బీజేపీయేత‌ర పార్టీలు.. తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. మోడీ నిర్వాకంతో భార‌త్‌ ప‌రువు మంట‌గ‌లుస్తోంద‌ని నిప్పులు చెరుగుతున్నారు. మ‌రి ఇంత‌కీ ఏం జ‌రిగింది? అనేది ఆస‌క్తిగా మారింది. పార్లమెంటు నూతన భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం.. రాజకీయ దుమారానికి కారణమైంది.

కొత్త చిహ్నంపై విపక్షాలు, సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. హుందాగా, రాజసంగా, ఆత్మవిశ్వాసంతో ఉండే నాలుగు సింహాలు.. క్రూరంగా, దౌర్జన్యపూర్వకంగా కనిపిస్తున్నాయని, తక్షణమే మార్చాలన్నది వారి ప్రధాన డిమాండ్.

ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఈ జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. దేశంలో అతి పెద్దది ఇదే. 9,500 కిలోల బరువు, ఆరున్నర మీటర్ల ఎత్తుతో అశోక చక్రం, నాలుగు సింహాల ప్రతిమను రూపొందించారు. మోడీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంపై అభ్యంతరం తెలుపుతూ కాంగ్రెస్, టీఎంసీ సహా మరికొన్ని పార్టీల నేతలు, చరిత్రకారులు ట్వీట్ చేశారు.

మోడీ గారూ… దయచేసి సింహం ముఖాన్ని ఓసారి చూడండి. సర్నాథ్ నుంచి స్ఫూర్తిపొంది రూపొందించిన ప్రతిమలా ఉందా లేక వక్రీకరించిన గిర్ సింహం ఫొటోలా ఉందో ఒకసారి పరిశీలించండి. అవసరమైతే మార్పించండి అని ట్వీట్ చేశారు లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి.

మన జాతీయ చిహ్నాన్ని అవమానించారు. ఎడమ వైపు ఉన్నది ఒరిజినల్ ఫొటో. సింహాలు హుందాగా, రాజసంతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. కుడి వైపు ఉన్నది మోదీ వెర్షన్. ఆ సింహాలు.. ఆగ్రహంతో, దూకుడుగా ఉన్నాయి. ఇది సిగ్గుచేటు. తక్షణమే మార్చండి. అని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్.

జాతీయ చిహ్నంతో ఆటలు ఆడడం అనవసరం. మన సింహాలు అసలు ఎందుకు క్రూరంగా, కోపంగా కనిపించాలి? 1950లో అశోకుడి సింహాల నుంచి స్ఫూర్తి పొంది స్వతంత్ర భారత దేశం ఈ చిహ్నాన్ని రూపొందించింది అని ట్వీట్ చేశారు చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్. జాతీయ చిహ్నంలో మార్పును తప్పుబట్టారు సీనియర్ న్యాయవాది, సామాజిక ఉద్యమకారుడు ప్రశాంత్ భూషణ్. ‘మోడీ నవ భారత్’ ఇదేనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

6 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

8 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

10 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

10 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

11 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

11 hours ago