షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జంపింగుల విషయంలో మూడు ప్రధాన పార్టీల్లోను అయోమయం పెరిగిపోతోంది. ఏ నేత ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో జనాలకు అర్థం కావటం లేదు. నిన్నటిదాకా కాంగ్రెస్, బీజేపీలను తిట్టిపోసిన కారుపార్టీ నేతలు హఠాత్తుగా పై రెండు పార్టీల్లో ఏదో ఒకపార్టీ కండువా కప్పుకుని కనబడుతున్నారు. ఇదే సమయంలో బీజేపీలో ఉంటు కేసీయార్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో ఆరోపణలు, విమర్శలు గుప్పించిన కమలం పార్టీ నేతలు మరుసటి రోజు గులాబీ కండువా కప్పుకుని కనబడుతున్నారు.
ఇక బీజేపీ, టీఆర్ఎస్ లోని నేతలు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరి గాంధీభవన్లో కనబడుతున్నారు. దీంతో ఏ నేత ఏరోజు ఏపార్టీలో ఉంటారో మామూలు జనాలకు కాదుకదా చివరకు సదరు నేతల సహచరులకు కూడా అర్ధం కావటంలేదు. పార్టీల మధ్య ఇంత గందరగోళానికి, జంపింగులు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుపై అనుమానాలు మొదటి కారణం.
ఇక రెండో కారణం ఏమిటంటే తాము పోటీచేసేందుకు టికెట్ వస్తుందో రాదో అనే గ్యారెంటీ లేకపోవటం. బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందనే నమ్మకం ఉన్న నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్ లో నుండి కమలం పార్టీలో చేరిపోతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం గ్యారెంటీ అనే నమ్మకంతోనే కొందరు నేతలు టీఆర్ఎస్, బీజేపీలో నుండి జంపయిపోతున్నారు. టీఆర్ఎస్ లో కూడా కొందరు చేరుతున్నప్పటికీ పెద్ద సంఖ్యలో మాత్రం కాదు.
హోలు మొత్తం మీద చూస్తే బీజేపీ, టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరిపోయేందుకు ఎక్కువమంది నేతలు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది కాంగ్రెసే అనే ప్రచారం పెరిగిపోతోంది. దీనికి అనుగుణంగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పావులు కదుపుతున్నారు. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ లోని కొందరు సీనియర్ నేతలు తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సమాచారం.
This post was last modified on July 6, 2022 2:26 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…