Political News

జంపింగులతో కాంగ్రెస్ కళకళ

షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జంపింగుల విషయంలో మూడు ప్రధాన పార్టీల్లోను అయోమయం పెరిగిపోతోంది. ఏ నేత ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో జనాలకు అర్థం కావటం లేదు. నిన్నటిదాకా కాంగ్రెస్, బీజేపీలను తిట్టిపోసిన కారుపార్టీ నేతలు హఠాత్తుగా పై రెండు పార్టీల్లో ఏదో ఒకపార్టీ కండువా కప్పుకుని కనబడుతున్నారు. ఇదే సమయంలో బీజేపీలో ఉంటు కేసీయార్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో ఆరోపణలు, విమర్శలు గుప్పించిన కమలం పార్టీ నేతలు మరుసటి రోజు గులాబీ కండువా కప్పుకుని కనబడుతున్నారు.

ఇక బీజేపీ, టీఆర్ఎస్ లోని నేతలు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరి గాంధీభవన్లో కనబడుతున్నారు. దీంతో ఏ నేత ఏరోజు ఏపార్టీలో ఉంటారో మామూలు జనాలకు కాదుకదా చివరకు సదరు నేతల సహచరులకు కూడా అర్ధం కావటంలేదు. పార్టీల మధ్య ఇంత గందరగోళానికి, జంపింగులు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుపై అనుమానాలు మొదటి కారణం.

ఇక రెండో కారణం ఏమిటంటే తాము పోటీచేసేందుకు టికెట్ వస్తుందో రాదో అనే గ్యారెంటీ లేకపోవటం. బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందనే నమ్మకం ఉన్న నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్ లో నుండి కమలం పార్టీలో చేరిపోతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం గ్యారెంటీ అనే నమ్మకంతోనే కొందరు నేతలు టీఆర్ఎస్, బీజేపీలో నుండి జంపయిపోతున్నారు. టీఆర్ఎస్ లో కూడా కొందరు చేరుతున్నప్పటికీ పెద్ద సంఖ్యలో మాత్రం కాదు.

హోలు మొత్తం మీద చూస్తే బీజేపీ, టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరిపోయేందుకు ఎక్కువమంది నేతలు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది కాంగ్రెసే అనే ప్రచారం పెరిగిపోతోంది. దీనికి అనుగుణంగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పావులు కదుపుతున్నారు. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ లోని కొందరు సీనియర్ నేతలు తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సమాచారం.

This post was last modified on July 6, 2022 2:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

27 minutes ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

1 hour ago

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్…

1 hour ago

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

2 hours ago

మళ్ళీ పాద‌యాత్ర చేసి సాధించేది ఏమన్నా ఉందా జగన్?

అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న ప‌రిస్థితిలో చెప్పడం కష్టంగా…

3 hours ago

వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: చంద్రబాబు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…

3 hours ago