Political News

పీఎం కార్య‌క్ర‌మానికి పిలిచి.. టీడీపీని ఇలా అవ‌మానించారే!

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రంలో అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించిన అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి ఘోర అవ‌మానం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మాన్ని.. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా నిర్వ‌హించాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం టీడీపీని ఆహ్వానించాల్సి ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఆహ్వానించ‌లేదు. దీంతో కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి, తెలుగు వాడు.. జి. కిష‌న్‌రెడ్డి.. స్వ‌యంగా చంద్ర‌బాబుకు ఫోన్ చేసి.. ఆహ్వానించారు.

ఆహ్వాన ప‌త్రిక కూడా పంపించారు. ఈ క్ర‌మంలో బాబు త‌న‌కు బ‌దులుగా.. ఏపీ టీడీపీ అద్య‌క్షుడు అచ్చె న్నాయుడును ఈ కార్య‌క్ర‌మానికి పంపించారు. ఈ క్ర‌మంలో అచ్చెన్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి హెలిప్యాడ్‌కు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. దీంతో ఇత‌ర‌త్రా ప‌నులు ఉన్నా.. వాటిని ప‌క్క‌న పెట్టిన అచ్చెన్నాయుడు.. వెంట‌నే ఈ కార్య‌క్ర‌మం కోసం.. ఒక రోజు ముందుగా వ‌చ్చి.. న‌ర‌సాపురంలోనే బ‌స చేశారు.

అనంత‌రం.. సోమ‌వారం ఉద‌యం.. ఆయ‌న భీమ‌వ‌రం బ‌య‌లు దేర‌గా.. ఆయ‌న‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో అచ్చెన్నాయుడు.. జిల్లా క‌లెక్ట‌ర్‌కు పోన్ చేయ‌గా.. తనకు వచ్చిన లిస్టులో అచ్చెన్న పేరు లేదని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ డీఐజి ఇచ్చిన జాబితాలో అచ్చెన్నాయుడు పేరు ఉంది. కానీ, రాష్ట్ర ప్ర‌భుత్వం రెడీ చేసుకున్న జాబితాలో మాత్రం పేరు లేదు.

ఈ నేప‌థ్యంలో త‌న‌ను కేంద్ర‌మే ఆహ్వానించింద‌ని.. త‌న పేరు ఉంద‌ని అచ్చెన్న స్వ‌యంగా కలెక్టర్‌కు చెప్పినప్పటికీ తనకు రాష్ట్ర స‌ర్కారు ఇచ్చిన‌ జాబితాలో లేదని ఆయన తేల్చిచెప్పేశారు. కేంద్ర మంత్రి చెప్పినా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో కేంద్ర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ జాబితాలో పేరు లేదని చెప్పటంతో బసచేసిన ప్రాంతంలోనే అచ్చెనాయుడు ఆగిపోయారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహ్వానించి అవమానించడం ఏమిటని మండిపడుతున్నారు.

This post was last modified on July 4, 2022 3:33 pm

Share
Show comments

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

5 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

8 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

8 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

9 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

9 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

11 hours ago