పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో అత్యంత వైభవంగా నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఘోర అవమానం జరిగింది. ఈ కార్యక్రమాన్ని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టీడీపీని ఆహ్వానించాల్సి ఉంది. అయినప్పటికీ.. ఆహ్వానించలేదు. దీంతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలుగు వాడు.. జి. కిషన్రెడ్డి.. స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి.. ఆహ్వానించారు.
ఆహ్వాన పత్రిక కూడా పంపించారు. ఈ క్రమంలో బాబు తనకు బదులుగా.. ఏపీ టీడీపీ అద్యక్షుడు అచ్చె న్నాయుడును ఈ కార్యక్రమానికి పంపించారు. ఈ క్రమంలో అచ్చెన్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి హెలిప్యాడ్కు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. దీంతో ఇతరత్రా పనులు ఉన్నా.. వాటిని పక్కన పెట్టిన అచ్చెన్నాయుడు.. వెంటనే ఈ కార్యక్రమం కోసం.. ఒక రోజు ముందుగా వచ్చి.. నరసాపురంలోనే బస చేశారు.
అనంతరం.. సోమవారం ఉదయం.. ఆయన భీమవరం బయలు దేరగా.. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు.. జిల్లా కలెక్టర్కు పోన్ చేయగా.. తనకు వచ్చిన లిస్టులో అచ్చెన్న పేరు లేదని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ డీఐజి ఇచ్చిన జాబితాలో అచ్చెన్నాయుడు పేరు ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసుకున్న జాబితాలో మాత్రం పేరు లేదు.
ఈ నేపథ్యంలో తనను కేంద్రమే ఆహ్వానించిందని.. తన పేరు ఉందని అచ్చెన్న స్వయంగా కలెక్టర్కు చెప్పినప్పటికీ తనకు రాష్ట్ర సర్కారు ఇచ్చిన జాబితాలో లేదని ఆయన తేల్చిచెప్పేశారు. కేంద్ర మంత్రి చెప్పినా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో కేంద్ర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ జాబితాలో పేరు లేదని చెప్పటంతో బసచేసిన ప్రాంతంలోనే అచ్చెనాయుడు ఆగిపోయారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహ్వానించి అవమానించడం ఏమిటని మండిపడుతున్నారు.
This post was last modified on July 4, 2022 3:33 pm
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు భారీ షాక్ తగిలింది. కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయం లో…