ఆయన సొంత నియోజకవర్గం.. ఏకంగా ప్రధాన మంత్రి స్వయంగా వస్తున్న కార్యక్రమం.. ఎన్నో ప్రయ త్నాలు.. మరెన్నో ప్రయాసలు కూడా పడ్డారు.. స్థానిక పార్లమెంటు సభ్యులు.. వైసీపీ నాయకులు.. కనుమూరి రఘురామకృష్ణరాజు. పైగా.. తమ వాడే అయిన.. మన్యం వీరుడు.. స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటుకు.. ప్లాన్ చేసి.. నిధులు కూడా మంజూరు చేసిన ఎంపీ. అయితే.. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఆయన రావడం లేదు.
ఎక్కిన రైలును కూడా దిగిపోయి.. వెనక్కి వెళ్లిపోయారు. దీనికి కారణం.. ప్రభుత్వం నుంచి తనకు ఆహ్వా నం లేకపోగా.. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోకేంద్ర పర్యటక శాఖ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి.. ఎంపీ రఘురామను ఆహ్వానించక పోవడం.. వివాదానికి దారితీసింది. వాస్తవానికి.. ఇక్కడ క్షత్రియ సామాజిక వర్గం.. ఆయన రాకకోసం ఎదురు చూసింది. అయితే.. ప్రభుత్వానికి రాజుకు మధ్య ఏర్పడిన వివాదం తారస్థాయికి చేరింది.
అయినప్పటికీ.. ప్రోటోకాల్ మేరకు రఘురామ ఈ కార్యక్రమానికి.. పాల్గొనాలని అన్ని వైపుల నుంచి ప్రయత్నించారు. కానీ, ఎక్కడా ఆయనకు ఉపశమనం లభించలేదు. ప్రత్యేక భద్రతను కల్పించాలంటూ.. రఘురామ కోరిన వినతిని.. హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో తనపై మరిన్ని కేసులు బుక్కయ్యే ప్రమాదం ఉందని గ్రహించిన.. రఘురామ.. మౌనంగా ఉండిపోయారు. అయితే.. రఘురామ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
ఇక, ఇక్కడి క్షత్రియ సామాజిక వర్గం కూడా నిప్పులు చెరుగుతుండడం గమనార్హం. ఎందుకంటే.. ప్రభుత్వం వేసిన ఆహ్వాన పత్రికల్లో కేవలం.. సీఎం జగన్మోహన్రెడ్డి, మంత్రి రోజా రెడ్డి, కిషన్ రెడ్డి తదితరుల పేర్లు వేశారు. కానీ, రఘురామరాజు పేరు మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో కనీసం.. ఆయనను పిలవకపోయినా.. కనీసం.. ఆయన పేరు కూడా వేయరా? అనేది రఘురామకృష్ణరాజు.. అభిమానులు.. ఆయన అనుచరుల వాదనగా ఉంది. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం.. ఏం చేయాలని అనుకుంటోంది? అనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on July 4, 2022 1:43 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…