ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఇతర నాయకులు భీమవరం రాక నేపథ్యంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొని ఉంది. ఈ నెల నాలుగున అల్లూరి సీతారామ రాజు 125 వ జయంత్యుత్సవాల సందర్భంగా ఇక్కడికి ప్రధాని రానున్నారు. బహిరంగ సభలో మాట్లాడనున్నారు. 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, దేశ ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. ఇదంతా బాగుంది మోడీ రాక నేపథ్యంలోనే ట్రిపుల్ ఆర్ సంబరాలు జరగనున్నాయి. అంటే సినిమా సంబరాలు అని కాదు ఎంపీ రఘురామ రాక నేపథ్యంలో సంబరాలు జరగనున్నాయి. ఎన్నో ఏళ్ల తరువాత ఇటుగా వస్తున్న తిరుగుబాటు ఎంపీ రఘురామను అరెస్టు చేసేందుకు వీల్లేదని హైకోర్టు స్పష్టం అయిన వైఖరి ఒకటి ఏపీ పోలీసు ఎదుట వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి మౌఖిక ఆదేశాలు కూడా ఇచ్చింది.
కానీ ఇవి అమలు అవుతాయా లేదా అన్నదే సందిగ్ధం. అప్పటికప్పుడు ఎంపీ పై కేసులు నమోదు చేసి సర్కారు కక్ష్యపూరిత వైఖరి ప్రదర్శించేందుకు వీల్లేదని కూడా చెప్పింది. దీంతో ఇప్పుడు రెబల్ ఎంపీ రాకపైనే వివాదాలు ఉన్నాయి. రాక తరువాత ఎటువంటి పరిణామాలు ఉంటాయో అన్న ఉత్కంఠతలూ నెలకొని ఉన్నాయి. మోడీ ఎదుట రఘురామ పరువు ఏపీ పోలీసులు తీయరు కదా ! అనే సందేహాలూ సంబంధిత వర్గాల్లో వస్తున్నాయి.
ఇప్పటికే శిలాఫలకంపై తన పేరు ఉంచాలని పదే పదే వేడుకున్నారు ఎంపీ రఘురామ. అల్లూరి విగ్రహ ఆవిష్కరణలో భాగంగా ఏర్పాటుచేసే శిలాఫలకంపై తన పేరు ఉంచాలన్నది ఆయన డిమాండ్. ఈ ప్రాంతంకు చెందిన ఎంపీని తాను అని కనీసం ప్రొటొకాల్ అయినా పాటించాలని వేడుకుంటున్నారు. ఇప్పుడు ఇదే పెద్ద వివాదం కానుంది. ఇప్పుడు శిలాఫలకం పై పేరు ఉంచుతారా లేదా రాజకీయంలో భాగంగా లేకుండా చేస్తారా?
మరోవైపు ఆర్ఆర్ఆర్ రాక నేపథ్యంలో భీమవరం క్షత్రియులు భారీ ఎత్తున స్వాగతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వంపై నిరంతరం పోరు సాగిస్తున్న వైనాన్ని తాము స్వాగతిస్తున్నామని పలువురు బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయనేమీ షో చేయడం లేదని, నిజాన్ని నిర్భయంగా చెబుతున్నారని పలువురు పొగుడుతున్నారు. ఇవన్నీ వైసీపీకి కంటగింపుగానే ఉన్నాయి. వైసీపీ కౌంటర్లు ఇంకా మొదలు కాకపోయినా, సాయిరెడ్డి నుంచి ఎటువంటి మాటల తూటాలు వస్తాయో అన్నది ఆసక్తిదాయకంగా ఉంది.
This post was last modified on July 2, 2022 5:10 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…