ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఇతర నాయకులు భీమవరం రాక నేపథ్యంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొని ఉంది. ఈ నెల నాలుగున అల్లూరి సీతారామ రాజు 125 వ జయంత్యుత్సవాల సందర్భంగా ఇక్కడికి ప్రధాని రానున్నారు. బహిరంగ సభలో మాట్లాడనున్నారు. 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, దేశ ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. ఇదంతా బాగుంది మోడీ రాక నేపథ్యంలోనే ట్రిపుల్ ఆర్ సంబరాలు జరగనున్నాయి. అంటే సినిమా సంబరాలు అని కాదు ఎంపీ రఘురామ రాక నేపథ్యంలో సంబరాలు జరగనున్నాయి. ఎన్నో ఏళ్ల తరువాత ఇటుగా వస్తున్న తిరుగుబాటు ఎంపీ రఘురామను అరెస్టు చేసేందుకు వీల్లేదని హైకోర్టు స్పష్టం అయిన వైఖరి ఒకటి ఏపీ పోలీసు ఎదుట వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి మౌఖిక ఆదేశాలు కూడా ఇచ్చింది.
కానీ ఇవి అమలు అవుతాయా లేదా అన్నదే సందిగ్ధం. అప్పటికప్పుడు ఎంపీ పై కేసులు నమోదు చేసి సర్కారు కక్ష్యపూరిత వైఖరి ప్రదర్శించేందుకు వీల్లేదని కూడా చెప్పింది. దీంతో ఇప్పుడు రెబల్ ఎంపీ రాకపైనే వివాదాలు ఉన్నాయి. రాక తరువాత ఎటువంటి పరిణామాలు ఉంటాయో అన్న ఉత్కంఠతలూ నెలకొని ఉన్నాయి. మోడీ ఎదుట రఘురామ పరువు ఏపీ పోలీసులు తీయరు కదా ! అనే సందేహాలూ సంబంధిత వర్గాల్లో వస్తున్నాయి.
ఇప్పటికే శిలాఫలకంపై తన పేరు ఉంచాలని పదే పదే వేడుకున్నారు ఎంపీ రఘురామ. అల్లూరి విగ్రహ ఆవిష్కరణలో భాగంగా ఏర్పాటుచేసే శిలాఫలకంపై తన పేరు ఉంచాలన్నది ఆయన డిమాండ్. ఈ ప్రాంతంకు చెందిన ఎంపీని తాను అని కనీసం ప్రొటొకాల్ అయినా పాటించాలని వేడుకుంటున్నారు. ఇప్పుడు ఇదే పెద్ద వివాదం కానుంది. ఇప్పుడు శిలాఫలకం పై పేరు ఉంచుతారా లేదా రాజకీయంలో భాగంగా లేకుండా చేస్తారా?
మరోవైపు ఆర్ఆర్ఆర్ రాక నేపథ్యంలో భీమవరం క్షత్రియులు భారీ ఎత్తున స్వాగతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వంపై నిరంతరం పోరు సాగిస్తున్న వైనాన్ని తాము స్వాగతిస్తున్నామని పలువురు బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయనేమీ షో చేయడం లేదని, నిజాన్ని నిర్భయంగా చెబుతున్నారని పలువురు పొగుడుతున్నారు. ఇవన్నీ వైసీపీకి కంటగింపుగానే ఉన్నాయి. వైసీపీ కౌంటర్లు ఇంకా మొదలు కాకపోయినా, సాయిరెడ్డి నుంచి ఎటువంటి మాటల తూటాలు వస్తాయో అన్నది ఆసక్తిదాయకంగా ఉంది.
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…