ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఇతర నాయకులు భీమవరం రాక నేపథ్యంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొని ఉంది. ఈ నెల నాలుగున అల్లూరి సీతారామ రాజు 125 వ జయంత్యుత్సవాల సందర్భంగా ఇక్కడికి ప్రధాని రానున్నారు. బహిరంగ సభలో మాట్లాడనున్నారు. 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, దేశ ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. ఇదంతా బాగుంది మోడీ రాక నేపథ్యంలోనే ట్రిపుల్ ఆర్ సంబరాలు జరగనున్నాయి. అంటే సినిమా సంబరాలు అని కాదు ఎంపీ రఘురామ రాక నేపథ్యంలో సంబరాలు జరగనున్నాయి. ఎన్నో ఏళ్ల తరువాత ఇటుగా వస్తున్న తిరుగుబాటు ఎంపీ రఘురామను అరెస్టు చేసేందుకు వీల్లేదని హైకోర్టు స్పష్టం అయిన వైఖరి ఒకటి ఏపీ పోలీసు ఎదుట వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి మౌఖిక ఆదేశాలు కూడా ఇచ్చింది.
కానీ ఇవి అమలు అవుతాయా లేదా అన్నదే సందిగ్ధం. అప్పటికప్పుడు ఎంపీ పై కేసులు నమోదు చేసి సర్కారు కక్ష్యపూరిత వైఖరి ప్రదర్శించేందుకు వీల్లేదని కూడా చెప్పింది. దీంతో ఇప్పుడు రెబల్ ఎంపీ రాకపైనే వివాదాలు ఉన్నాయి. రాక తరువాత ఎటువంటి పరిణామాలు ఉంటాయో అన్న ఉత్కంఠతలూ నెలకొని ఉన్నాయి. మోడీ ఎదుట రఘురామ పరువు ఏపీ పోలీసులు తీయరు కదా ! అనే సందేహాలూ సంబంధిత వర్గాల్లో వస్తున్నాయి.
ఇప్పటికే శిలాఫలకంపై తన పేరు ఉంచాలని పదే పదే వేడుకున్నారు ఎంపీ రఘురామ. అల్లూరి విగ్రహ ఆవిష్కరణలో భాగంగా ఏర్పాటుచేసే శిలాఫలకంపై తన పేరు ఉంచాలన్నది ఆయన డిమాండ్. ఈ ప్రాంతంకు చెందిన ఎంపీని తాను అని కనీసం ప్రొటొకాల్ అయినా పాటించాలని వేడుకుంటున్నారు. ఇప్పుడు ఇదే పెద్ద వివాదం కానుంది. ఇప్పుడు శిలాఫలకం పై పేరు ఉంచుతారా లేదా రాజకీయంలో భాగంగా లేకుండా చేస్తారా?
మరోవైపు ఆర్ఆర్ఆర్ రాక నేపథ్యంలో భీమవరం క్షత్రియులు భారీ ఎత్తున స్వాగతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వంపై నిరంతరం పోరు సాగిస్తున్న వైనాన్ని తాము స్వాగతిస్తున్నామని పలువురు బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయనేమీ షో చేయడం లేదని, నిజాన్ని నిర్భయంగా చెబుతున్నారని పలువురు పొగుడుతున్నారు. ఇవన్నీ వైసీపీకి కంటగింపుగానే ఉన్నాయి. వైసీపీ కౌంటర్లు ఇంకా మొదలు కాకపోయినా, సాయిరెడ్డి నుంచి ఎటువంటి మాటల తూటాలు వస్తాయో అన్నది ఆసక్తిదాయకంగా ఉంది.
This post was last modified on July 2, 2022 5:10 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…