Political News

భీమ‌వ‌రంలో ట్రిపుల్ ఆర్ సంబ‌రాలు !

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో స‌హా ఇత‌ర నాయ‌కులు భీమ‌వ‌రం రాక నేప‌థ్యంలో ఉత్కంఠ‌భ‌రిత వాతావర‌ణం నెల‌కొని ఉంది. ఈ నెల నాలుగున అల్లూరి సీతారామ రాజు 125 వ జ‌యంత్యుత్స‌వాల సంద‌ర్భంగా ఇక్క‌డికి ప్ర‌ధాని రానున్నారు. బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడనున్నారు. 30 అడుగుల కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించి, దేశ ప్ర‌జల‌కు సందేశం ఇవ్వ‌నున్నారు. ఇదంతా బాగుంది మోడీ రాక నేప‌థ్యంలోనే ట్రిపుల్ ఆర్ సంబ‌రాలు జ‌ర‌గ‌నున్నాయి. అంటే సినిమా సంబ‌రాలు అని కాదు ఎంపీ ర‌ఘురామ రాక నేప‌థ్యంలో సంబ‌రాలు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నో ఏళ్ల త‌రువాత ఇటుగా వ‌స్తున్న తిరుగుబాటు ఎంపీ రఘురామ‌ను అరెస్టు చేసేందుకు వీల్లేద‌ని హైకోర్టు స్ప‌ష్టం అయిన వైఖ‌రి ఒకటి ఏపీ పోలీసు ఎదుట వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి మౌఖిక ఆదేశాలు కూడా ఇచ్చింది.

కానీ ఇవి అమలు అవుతాయా లేదా అన్న‌దే సందిగ్ధం. అప్ప‌టిక‌ప్పుడు ఎంపీ పై కేసులు న‌మోదు చేసి స‌ర్కారు క‌క్ష్య‌పూరిత వైఖ‌రి ప్ర‌ద‌ర్శించేందుకు వీల్లేద‌ని కూడా చెప్పింది. దీంతో ఇప్పుడు రెబ‌ల్ ఎంపీ రాక‌పైనే వివాదాలు ఉన్నాయి. రాక త‌రువాత ఎటువంటి ప‌రిణామాలు ఉంటాయో అన్న ఉత్కంఠ‌తలూ నెల‌కొని ఉన్నాయి. మోడీ ఎదుట ర‌ఘురామ ప‌రువు ఏపీ పోలీసులు తీయ‌రు క‌దా ! అనే సందేహాలూ సంబంధిత వ‌ర్గాల్లో వ‌స్తున్నాయి.

ఇప్ప‌టికే శిలాఫ‌ల‌కంపై త‌న పేరు ఉంచాల‌ని ప‌దే పదే వేడుకున్నారు ఎంపీ ర‌ఘురామ. అల్లూరి విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌లో భాగంగా ఏర్పాటుచేసే శిలాఫ‌ల‌కంపై త‌న పేరు ఉంచాల‌న్న‌ది ఆయ‌న డిమాండ్. ఈ ప్రాంతంకు చెందిన ఎంపీని తాను అని క‌నీసం ప్రొటొకాల్ అయినా పాటించాల‌ని వేడుకుంటున్నారు. ఇప్పుడు ఇదే పెద్ద వివాదం కానుంది. ఇప్పుడు శిలాఫ‌ల‌కం పై పేరు ఉంచుతారా లేదా రాజ‌కీయంలో భాగంగా లేకుండా చేస్తారా?

మ‌రోవైపు ఆర్ఆర్ఆర్ రాక నేప‌థ్యంలో భీమ‌వ‌రం క్ష‌త్రియులు భారీ ఎత్తున స్వాగ‌తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర‌భుత్వంపై నిరంత‌రం పోరు సాగిస్తున్న వైనాన్ని తాము స్వాగ‌తిస్తున్నామ‌ని ప‌లువురు బీజేపీ నాయ‌కులు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయ‌నేమీ షో చేయ‌డం లేద‌ని, నిజాన్ని నిర్భ‌యంగా చెబుతున్నార‌ని పలువురు పొగుడుతున్నారు. ఇవ‌న్నీ వైసీపీకి కంట‌గింపుగానే ఉన్నాయి. వైసీపీ కౌంట‌ర్లు ఇంకా మొద‌లు కాక‌పోయినా, సాయిరెడ్డి నుంచి ఎటువంటి మాట‌ల తూటాలు వ‌స్తాయో అన్న‌ది ఆస‌క్తిదాయ‌కంగా ఉంది.

This post was last modified on July 2, 2022 5:10 pm

Share
Show comments

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

3 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

4 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

7 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

7 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

8 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

8 hours ago