Political News

మోడీ-జ‌గ‌న్ వ్యూహం.. టీడీపీపై ఈడీ పంజా?

ప్ర‌స్తుతం ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడుకు రాష్ట్రప‌తి అవ‌కాశం ఇవ్వ‌కుండా.. ప‌క్క‌న పెట్టారు. అయితే.. దీనిపై విభిన్న‌మైన క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఏపీకి చెందిన వెంక‌య్యను ప‌క్క‌న పెట్ట‌డం వెనుక‌.. ప్ర‌ధాని మోడీ-సీఎం జ‌గ‌న్ ల వ్యూహం ఉంద‌ని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌నిషిగా వెంక‌య్య‌కు పేరు ఉంద‌ని.. చంద్ర‌బాబు నీడ‌ను కూడా ఇష్ట‌ప‌డ‌ని జ‌గ‌న్‌.. మ‌ద్ద‌తు కావాలంటే.. ఆయ‌న చెప్పిన‌ట్టు కొన్ని నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని.. కేంద్రంలోని బీజేపీ నిర్ణ‌యించే.. వెంక‌య్య‌ను ప‌క్క‌న పెట్టింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

బాబుకు సన్నిహితుడు అన్న కారణంగానే వెంకయ్యనాయుడును రాష్ట్రపతి పదవిలోకి తీసుకురానీయకుండా ఆపారని ప్రచారంలో ఉంది. ఏపీ సీఎం జగన్ విషయంలో మోడీకి కానీ.. బీజేపీ నేత‌ల‌కు కానీ ప్రత్యేక ప్రేమాభిమానాలు లేకపోయినా బాబుతో కాంగ్రెస్ తో ఆయనకు ఉన్న బద్ధ వైరమే బీజేపీతో స్నేహం కలిపేలా చేస్తోందని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికి అయితే జగన్ ఏపీలో ఉంటేనే మనకు అన్ని విధాలుగా బెటర్‌.. బెస్ట్ అని కూడా బీజేపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు.

వచ్చే ఎన్నికలు ఏపీలో హోరా హోరీగా సాగడం తధ్యం ఈ విషయంలో ఎంతదాకా అయినా టీడీపీ.. వైసీపీ వెళ్తాయి. ఈ సమయంలో ఆర్ధికపరంగా కూడా ఎవరు ముందంజలో ఉంటే వారి వైపే ఎడ్జ్ ఉంటుంద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. ఈ విషయంలో వైసీపీ తగిన జాగ్రత్తలతోనే ఉంది అని చెబుతున్నారు. ఇక కేంద్రం కూడా తగిన విధంగా వైసీపీకి సహకారం అందించే వీలు ఉంది అంటున్నారు.

అదే టైమ్ లో టీడీపీ ఆర్ధిక మూలాలను మూడేళ్ళలో జగన్ వీలైనంతగా దెబ్బ తీశారు. దాని దెబ్బకు నేతలు అంతా మూలకు వెళ్ళిపోయారు. ఇపుడిపుడే వారు బయటకు వస్తున్నారు. అయితే, ఈడీ దాడులు కొందరి మీద జరుగుతాయన్న ప్రచారం కూడా ఇపుడు జోరుగా సాగడంతో నేతలలో మళ్లీ టెన్షన్ పట్టుకుంది. అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీ మీద ఈడీ దాడులు జరిగాయి. అలాగే గోదావరి జిల్లాలతో పాటు కోస్తాలో మరి కొందరు నేతల మీద కూడా గురి ఉంది అంటున్నారు.

ఇలా కూశాలు కదిలించే మాస్టర్ ప్లాన్ కూడా రానున్న రోజులలో అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో టీడీపీకి చంద్రబాబు పెద్ద దిక్కు. ఆయనకు ఈ ఎన్నికలే బలం. ఈసారి గట్టిగా ప్రయత్నం చేసి బాబుని మూలన కూర్చోబెడితే వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఉండదు అన్న ఆలోచనలు అటు వైసీపీలో ఇటు బీజేపీలో కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ రెండు ప‌క్షాలు కూడా కూడ‌బ‌లుక్కుని ముందుకు సాగుతున్నాయ‌నే చ‌ర్చ ఢిల్లీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతుండ‌డం బీజేపీ అనుకూల మీడియాలో ఈ త‌ర‌హా వార్త‌లు వ‌స్తుండ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

25 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

31 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

45 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago