ఆయన మాజీ మంత్రి. మంచి మాట కారి కూడా. పైగా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అయితే ఏం.. ఇప్పుడు ఆయనకు భయం పట్టుకుందని అంటున్నారు. ఒకింత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది నిజం. వచ్చే ఎన్నికల్లో తను గెలుస్తానో లేదో.. అని ఆయన తెగ మధన పడుతున్నారట. ఈ విషయం సొంత అనుచరుల్లోనే జరుగుతుండడం గమనార్హం. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. మాజీ మంత్రి.. వైసీపీ నాయకుడు.. భీమిలి ఎమ్మెల్యే.. అవంతి శ్రీనివాసరావు.
గతంలో టీడీపీ తరఫున ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఆయన 2019 ఎన్నికలకు ముందు.. వైసీపీలో చేరి.. ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. తర్వాత.. మంత్రి కూడా అయ్యారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు రెండు రకాలుగా ఆయనకు ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు. ఒకటి పార్టీ పరంగా ఆయన ఒంటరి అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి హవా తగ్గినా.. ఆయన అనుచరుల రాజకీయాలు పెరిగిపోయాయి.
ఆదినుంచి కూడా సాయిరెడ్డికి.. అవంతికి మధ్య విభేదాలు ఉన్నాయి. మంత్రిగా తనను సరిగా పనిచేయ నీయలేదని.. అందుకే తనకు మరోసారి రెన్యువల్ రాలేదని..అవంతి బాధపడుతున్నారు. దీనికితోడు.. సాయిరెడ్డి అనుచరులు.. ఆయన వర్గంగా ఉన్నవారు కూడా అవంతిని పక్కన పెట్టారు. ఇక, అధిష్టానం కూడా అవంతిని పట్టించుకోవడం లేదు. దీంతో పార్టీలో ఆయన ఒంటరి అయ్యారనే టాక్వినిపిస్తోంది. దీంతో ఒకింత మానసికంగా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. ప్రజల్లోనూ అవంతి విషయంలో సానుభూతి కనిపించడం లేదు. పార్టీలు మారడంతోపాటు.. ప్రజలను పట్టించుకోకపోవడం.. ఆయనకు సమస్యగా మారింది. ఎక్కడికి వెళ్లినా.. ఇప్పటికీ అవంతిని టీడీపీ నేతగానే కొందరు చూస్తున్నారు. అదేసమయంలో అభవృద్ధి చేయలేదని కూడా నిలదీస్తున్నారు. దీంతో ఆయన రెండు రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని.. వచ్చే ఎన్నికల నాటికి తన ఫేట్ ఏమవుతుందోనని ఇబ్బంది పడుతున్నారని ఆయన అనుచరులే చెబుతుండడం గమనార్హం.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…