బీజేపీతో జనసేన పార్టీ పొత్తులో ఉంది. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని.. బీజేపీ నాయకులు పదే పదే చెబుతున్నారు. అంతేకాదు.. వేరే పార్టీలతో తమకు అవసరం కూడా లేదని చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, జనసేన వైపు నుంచే అనేక సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో బీజేపీ రంగంలోకి దిగింది. అయితే.. ఇదే స్థానం నుంచి జనసేన పోటీకి దూరంగా ఉంది. నిజానికి ఇప్పటికి రెండు సార్లు రాష్ట్రంలో ఉప ఎన్నిక జరగ్గా.. ఒక్కసారి కూడా బీజేపీ .. తమ పొత్తుపార్టీ అని చెప్పుకొనే జనసేనకు అవకాశం ఇవ్వలేదు.
గతంలో తిరుపతి, బద్వేల్లోనూ బీజేపీ పోటీ చేసింది. తిరుపతి విషయంలో తొలుత జనసేన పోటీ చేస్తానని చెప్పినా.. పట్టుబట్టి.. బీజేపీ పోటీ చేసింది. ఇక, ఇప్పుడు కూడా జనసేన పోటీకి దూరంగా ఉంటానని చెప్పినప్పటికీ.. పొత్తు పార్టీ బీజేపీ మాత్రం పోటీకి దిగింది. అంతేకాదు.. ఆత్మకూరులో బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేసే సమయంలో.. జనసేన నాయకుడు ఇక్కడ తమ తరఫున ప్రచారం చేస్తారని బీజేపీ నేతలు ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు ఎక్కడా క్లారిటీ రాలేదు. అంతేకాదు.. జనసేన జెండాలు కూడా బీజేపీ వెంట కనిపించడం లేదు.
దీంతో అసలు బీజేపీ పక్షాన జనసేన ప్రచారం చేస్తుందా? లేదా? అనేది ప్రశ్నగా మారింది. ఆత్మకూరు నియోజకవర్గంలో.. మెగా అభిమానులు ఎక్కువని.. వారంతా తమ వెంటే ఉంటారని.. బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. కానీ, మెగా కుటుంబం మాట ఎలా ఉన్నప్పటికీ.. పవన్ మాత్రం తన అభిమానులకు కూడా ఎలాంటి సందేశం పంపించలేదు. దీంతో ఇక్కడ బీజేపీకి మద్దతు పలికే జనసేన నాయకులు కనిపించలేదు. మరోవైపు.. అసలు బీజేపీ తరఫున కూడా పెద్దగా ఎవరూ ప్రచారం చేయడం లేదు. దీంతో ఇక్కడ బీజేపీ ఓటమి రాసిపెట్టుకున్నట్టు అయింది.
గెలుపు ఓటములు ఎలా ఉన్నప్పటికీ.. అసలు జనసేన.. బీజేపీ పొత్తులో ఉన్నాయా? లేవా? అనే సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో కలిసి వెళ్లాలని.. జనసేన ప్రయత్నాలు చేస్తుంటే.. టీడీపీతో కలిసి వెళ్లేందుకు బీజేపీ ససేమిరా అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేన ఇప్పుడు.. ఆత్మకూరు ప్రచారానికి సైతం దూరంగా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదెలా చూసినా.. పొత్తు మాటల మాటున బీజేపీ పైచేయి సాధించే ప్రయత్నాలు చేయడం గమనార్హం.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…