Political News

పోలీసులకు చుక్కలు చూపించిన ఆందోళనకారుల ప్రశ్నలు

కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం మీద ఆర్మీలో చేరాలని భావించే పలువురు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టటం.. తమ ఆందోళనలో భాగంగా భారీ హింసకు తెర తీయటం తెలిసిందే. పక్కా వ్యూహంతో.. వాట్సాప్ సాయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి జొరబడి.. కొన్ని గంటల పాటు వారు చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇలా చేతల్లో తమ ఆరాచకాన్ని ప్రదర్శించిన వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా వారి నోటి నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పోలీసులు సైతం తడబడిన పరిస్థితి. వారి వాదనలో పాయింట్లు ఉండటంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆందోళన చేపట్టిన పలువురు ఆందోళకారుల్ని అడ్డుకున్న పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సదరు నిరసనకారుడు చెలరేగిపోతూ ప్రశ్నల మీద స్రశ్నల్ని సంధించారు. పోలీసులకు ఎదురైన ప్రశ్నలు చూస్తే..

  • చావడానికి సిద్ధపడే వచ్చాం.. కేంద్రం మాకు స్పష్టమైన హామీయిచ్చే వరకు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాం.
  • మేము చేసిన ఆందోళనలో ఒక్క ప్రయాణికుడు కూడా గాయపడలేదు. కానీ పోలీసులు జరిపిన కాల్పుల్లో మా వాళ్లు చాలా మంది గాయపడ్డారు.
  • మేం చేస్తున్న డిమాండ్లు మీ పరిధిలో లేవు (పోలీసుల్ని ఉద్దేశించి).. అలాంటపుడు మీతో చర్చలు జరిపి ప్రయోజనం ఏమిటి?
  • శాంతియుతంగా ఆందోళన చేపట్టిన మాపై లాఠీఛార్జి చేసి, ఎందుకు కాల్పులు జరిపారు?
  • మాకు ఉద్యోగాలు వస్తే మేము కూడా సైనికులమే, అలాంటి మాపై కాల్పులు జరుపుతారా?
  • మమ్మల్ని (ఆందోళన చేస్తున్న అందరిని) ఏఆర్వో దగ్గరికి తీసుకెళ్లలేమని పోలీసులు చెబుతున్నారు.అలాంటప్పుడు ఏఆర్వోనే మా దగ్గరకు రావొచ్చు కదా?
  • అగ్నిపథ్‌ పథకం దేశానికి సంబంధించిన అంశం.. కేంద్రం నుంచి ప్రకటన వస్తేనే ఆందోళన విరమిస్తాం.
  • పోలీసులు అరెస్ట్‌ చేసిన యువకులను వెంటనే విడుదల చేయాలి. వాళ్ల ప్రాణాలకు ఏదైనా అయితే పోలీసులదే బాధ్యత.

This post was last modified on June 18, 2022 11:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

51 minutes ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

2 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

2 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

4 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

4 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

4 hours ago