నొప్పి తెలియకుండా వాతలు పెట్టడం అంటే.. మోడీని చూసి నేర్చుకోవాల్సిందే! రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు కామన్. ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించేందుకు నాయకులు వ్యూహాలు వేయడం.. అందరికీ తెలిసిందే. అయితే.. కేంద్రంలోని నరేంద్ర మోడీ స్టయిలే వేరు. పైకి ఏమీ తెలియనట్టుగా నటిస్తూనే ఆయన తాజాగా పన్నిన వ్యూహం.. అతి పెద్ద కాంగ్రెస్ పార్టీని ముప్పుతిప్పలు పెడుతోంది. అది కూడా కీలకమైన… రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కావడంతో ఇప్పుడు ఆ పార్టీ ఇబ్బందుల్లో చిక్కుకుంది.
ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో.. అన్నట్టుగా.. మోడీ చేస్తున్న రాజకీయ విన్యాసంలో కాంగ్రెస్ ఇప్పటికే పావుగా మారిపోయింది. ఎక్కడో.. ఎప్పుడో మూలన పడిన నేషనల్ హెరాల్డ్ కేసును తెరమీదికి తీసుకురావడం ఏంటి? నేరుగా పోయి పోయి… కాంగ్రెస్ మూలస్తంభాల్లాంటి.. సోనియా, రాహుల్లకు నోటీసులు ఇవ్వడం ఏంటి? రాహుల్ను వరుస పెట్టి ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదికారులు విచారణ చేయడం ఏంటి? ఆయన ఈడీకి క్షమాపణలు చెప్పడం ఏంటి? ఇవన్నీ చూస్తే.. పొలిటికల్ సీరియల్లా అనిపించడం లేదూ!?
మోడీకి, బీజేపీకి కావాల్సింది ఇదే! ఎందుకంటే.. రాష్ట్రపతి ఎన్నికలకు రంగం రెడీ అయింది. మరో వైపు నాలుగు నెలల్లోనే.. మూడు కీలక రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ కూడా తెరమీదికి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీని కట్టడి చేయాలంటే.. కేవలం మాటలు చెబితే సరిపోదని అనుకున్నారో.. ఏమో.. అన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మూల స్తంభాలనే ముప్పుతిప్పలు పెడితే.. పార్టీని కూకటి వేళ్లతో సహా పెకలించే ప్రయత్నం చేస్తే.. అన్నట్టుగా మోడీ శైలి ఉందని చెబుతున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ను నైతికంగా దెబ్బతీయడమే మోడీ లక్ష్యంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి నైతికత లేని పార్టీని ప్రజలు హర్షించరు. ఇప్పుడు ఆ ముద్రే కాంగ్రెస్పై పడనుందని చెబుతున్నా రు. ఒక్క రాష్ట్రపతి ఎన్నికలే కాదు… 2024లో వచ్చే సార్వత్రిక సమరానికి సంబందించి మోడీ ముందస్తు ఎత్తుగడలు ఇవేనని చెబుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్కు ఇప్పుడున్న పరిస్థితి చరిత్రలో తొలి సారని అంటున్నారు. ఈ గండం నుంచి బయటకు రాకపోతే.. కాంగ్రెస్ నైతికంగా మరింత కుంగిపోయి.. ఉనికిని కోల్పోయినాఆశ్చర్యం లేదని అంటున్నారు. మరి కాంగ్రెస్ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారో చూడాలి.
This post was last modified on June 15, 2022 5:10 pm
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…