Political News

రెండేళ్లలో ఏం సాధిస్తారు? వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం

ఏపీలో అధికార పార్టీ నేత‌ల అంత‌ర్మ‌థ‌నం తారాస్థాయికి చేరింది. ఎన్నిక‌ల‌కు కేవ‌లం రెండు సంవ‌త్స‌రాల‌ స‌మ‌య‌మే ఉంది. నిజానికి చెప్పాలంటే.. రెండేళ్ల స‌మ‌యం కూడా లేదు. ఏడాదిన్న‌ర మాత్ర‌మే ఉంది. చివ‌రి ఆరునెల‌లు.. అంద‌రూ ఎన్నిక‌ల మూడ్‌లోకి వెళ్లిపోతారు. దీంతో మిగిలిన ఈ స‌మ‌యంలో ఏం చేస్తారు? స‌మ‌స్య‌ల‌ను ఎలా ప‌రిష్క‌రిస్తారు? అనే చ‌ర్చ వైసీపీలోనే ఎక్కువ‌గా సాగుతోంది. ఎందుకంటే.. మూడేళ్లు గ‌డిచిపోయినా.. జ‌గ‌న్ పాల‌న‌లో ఒక్క ఇటుక కూడా ప‌డ‌ని ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి.

ఇవే అంశాల‌ను.. ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న పాద‌యాత్రలు, ‘గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం’ కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. ప్రాజెక్టులు లేవు.. ఉపాధి లేదు.. రాష్ట్రానికి అప్పులు త‌ప్ప‌.. మిగిలింది ఏమీ క‌నిపించ‌డం లేదు.. అని పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. దీంతో ఎన్ని ప‌థ‌కాలు ఇచ్చినా.. ఎంత సొమ్ములు ధార‌పోయినా..యువ‌త ఉద్యోగాల‌ను కోరుకుంటున్నారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం.. అభివృద్ధిని కోరుతోంది.

ఈ నేప‌థ్యంలో ఆయా అంశాల‌కు ప్రాధాన్యం లేకుండా.. ఎన్ని చేసినా ప్ర‌యోజ‌నం లేద‌ని.. వైసీపీ నాయ కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఖ‌జానా కొల్ల బోతోంది. వ‌చ్చిన సొమ్ములు జీతాల‌కు ఇచ్చేందుకు, పెంన్ష‌న్ల‌కు ఇచ్చేందుకు మాత్ర‌మే స‌రిపోతోంది. దీంతో అభివృద్ధికి ప్ర‌త్యేకంగా కేటాయించే స‌మ‌యం, సొమ్ములు కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా నెట్టుకురావాల‌నేది వైసీపీ నాయ‌కుల భావ‌న‌.

ఇదే విష‌యంపై.. ఇటీవ‌ల మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ నిర్వ‌హించిన‌.. ఉత్త‌రాంధ్ర వింగ్ వైసీపీ స‌మావే శంలో నేత‌లు ప్ర‌శ్నించారు. “మీరు చెబుతారు.. మేం ప్ర‌జ‌ల్లోకి వెళ్తాం. కానీ.. అక్క‌డ రోడ్లు అడుగుతున్నారు. తాగు నీటి ప‌థ‌కాల‌ను కోరుతున్నారు. కానీ, డ‌బ్బులు లేవు. ఏం చేయాలి? ఇలా అయితే.. మా మొహం ప్ర‌జ‌ల‌కు ఎలా చూపించాలి?” అని నేత‌లు ప్ర‌శ్నించారు. దీంతో వీరికి స‌మాధానం చెప్పలేక‌.. అందుకే ఈ స‌మావేశం నిర్వ‌హించామ‌ని.. మీస‌మ‌స్య‌లు చెబితే.. సీఎం దృష్టికి తీసుకువెళ్తామ‌ని..చెప్పి..బొత్స స‌మావేశాన్ని ముగించార‌ట‌. ఇదీ.. సంగ‌తి!!

This post was last modified on June 14, 2022 11:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

31 minutes ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

1 hour ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

2 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

3 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

4 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

4 hours ago