జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటన చూసిన తర్వాత అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నాదెండ్ల మాట్లాడుతూ వచ్చే అక్టోబర్ 5వ తేదీ నుంచి అంటే విజయదశమి నుంచి యాత్ర మొదలుపెడతారని ప్రకటించారు. తిరుపతి నుండి మొదలయ్యే యాత్రలో ఆరు మాసాల్లో రాష్ట్రమంతటా చుట్టేస్తారట. ప్రతి జిల్లా కేంద్రంలోను ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే పవన్ యాత్ర అన్నారే కానీ పాదయాత్ర లేకపోతే బస్సుయాత్రా అనేది చెప్పలేదు. పైగా వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లో రాష్ట్రంలో కచ్చితంగా ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయని కూడా నాదెండ్ల చెప్పారు. మార్చి, ఏప్రిల్లో ఎన్నికలు జరగబోతున్నాయంటే ఈ డిసెంబర్లోనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని రద్దు చేయాల్సుంటుంది. ఇంత హఠాత్తుగా యాత్ర నిర్ణయాన్ని పవన్ తీసుకోవటం దాన్ని నాదెండ్ల ప్రకటించటం ఆశ్చర్యంగానే ఉంది.
ఇదంతా చూస్తుంటే వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ప్రకటనే కారణమని అనుమానంగా ఉంది. ఢిల్లీలో శుక్రవారం రఘురాజు మీడియాతో మాట్లాడుతు ఈ డిసెంబర్లో అసెంబ్లీ రద్దుకు జగన్మోహన్ రెడ్డి సిఫారసు చేస్తారని, వచ్చే మార్చి, ఏప్రిల్లో ముందస్తు ఎన్నికలు జరగవచ్చని చెప్పారు. బహుశా దాన్ని పట్టుకునే పవన్ ముందస్తు ఎన్నికల విషయంలో ఒక అంచనాకు వచ్చినట్లు అర్ధమవుతోంది. గతంలో పవన్ పాదయాత్రపై మాట్లాడుతూ తాను జనాల్లోకి రావటం కష్టమన్నారు.
తాను కనుక పాదయాత్ర పేరుతో జనాల్లోకి వస్తే కచ్చితంగా ట్రాఫిక్ సమస్యలు వస్తాయన్నారు. తనకోసం వచ్చే జనాలను ప్రభుత్వం కంట్రోల్ చేయలేదని చెప్పారు. మరిపుడు పాదయాత్ర చేస్తార లేకపోతే బస్సుయాత్ర చేద్దామని అనుకుంటున్నారో క్లారిటీ లేదు. నాదెండ్ల మాట్లాడుతూ రాబోయే ముందస్తు ఎన్నికలకు జనసేన నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. పవన్ తాజా నిర్ణయంతో ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా ఎన్నికల వేడి మాత్రం అమాంతం పెరిగి పోవడం ఖాయం. పైగా యాత్ర కూడా వచ్చే మార్చి, ఏప్రిల్ అంటున్నారు. అంటే భగభగ మండిపోయే ఎండల్లో అన్నమాట. తిరుపతిని ఎంపిక చేసుకోవడం వెనుక ఇక్కడినుండే పోటీ చేయాలనే ఆలోచన కూడా ఉందంటున్నారు. చూద్దాం చివరకు ఏమిచేస్తారో.
This post was last modified on June 11, 2022 9:53 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…