జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటన చూసిన తర్వాత అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నాదెండ్ల మాట్లాడుతూ వచ్చే అక్టోబర్ 5వ తేదీ నుంచి అంటే విజయదశమి నుంచి యాత్ర మొదలుపెడతారని ప్రకటించారు. తిరుపతి నుండి మొదలయ్యే యాత్రలో ఆరు మాసాల్లో రాష్ట్రమంతటా చుట్టేస్తారట. ప్రతి జిల్లా కేంద్రంలోను ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే పవన్ యాత్ర అన్నారే కానీ పాదయాత్ర లేకపోతే బస్సుయాత్రా అనేది చెప్పలేదు. పైగా వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లో రాష్ట్రంలో కచ్చితంగా ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయని కూడా నాదెండ్ల చెప్పారు. మార్చి, ఏప్రిల్లో ఎన్నికలు జరగబోతున్నాయంటే ఈ డిసెంబర్లోనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని రద్దు చేయాల్సుంటుంది. ఇంత హఠాత్తుగా యాత్ర నిర్ణయాన్ని పవన్ తీసుకోవటం దాన్ని నాదెండ్ల ప్రకటించటం ఆశ్చర్యంగానే ఉంది.
ఇదంతా చూస్తుంటే వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ప్రకటనే కారణమని అనుమానంగా ఉంది. ఢిల్లీలో శుక్రవారం రఘురాజు మీడియాతో మాట్లాడుతు ఈ డిసెంబర్లో అసెంబ్లీ రద్దుకు జగన్మోహన్ రెడ్డి సిఫారసు చేస్తారని, వచ్చే మార్చి, ఏప్రిల్లో ముందస్తు ఎన్నికలు జరగవచ్చని చెప్పారు. బహుశా దాన్ని పట్టుకునే పవన్ ముందస్తు ఎన్నికల విషయంలో ఒక అంచనాకు వచ్చినట్లు అర్ధమవుతోంది. గతంలో పవన్ పాదయాత్రపై మాట్లాడుతూ తాను జనాల్లోకి రావటం కష్టమన్నారు.
తాను కనుక పాదయాత్ర పేరుతో జనాల్లోకి వస్తే కచ్చితంగా ట్రాఫిక్ సమస్యలు వస్తాయన్నారు. తనకోసం వచ్చే జనాలను ప్రభుత్వం కంట్రోల్ చేయలేదని చెప్పారు. మరిపుడు పాదయాత్ర చేస్తార లేకపోతే బస్సుయాత్ర చేద్దామని అనుకుంటున్నారో క్లారిటీ లేదు. నాదెండ్ల మాట్లాడుతూ రాబోయే ముందస్తు ఎన్నికలకు జనసేన నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. పవన్ తాజా నిర్ణయంతో ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా ఎన్నికల వేడి మాత్రం అమాంతం పెరిగి పోవడం ఖాయం. పైగా యాత్ర కూడా వచ్చే మార్చి, ఏప్రిల్ అంటున్నారు. అంటే భగభగ మండిపోయే ఎండల్లో అన్నమాట. తిరుపతిని ఎంపిక చేసుకోవడం వెనుక ఇక్కడినుండే పోటీ చేయాలనే ఆలోచన కూడా ఉందంటున్నారు. చూద్దాం చివరకు ఏమిచేస్తారో.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…