జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటన చూసిన తర్వాత అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నాదెండ్ల మాట్లాడుతూ వచ్చే అక్టోబర్ 5వ తేదీ నుంచి అంటే విజయదశమి నుంచి యాత్ర మొదలుపెడతారని ప్రకటించారు. తిరుపతి నుండి మొదలయ్యే యాత్రలో ఆరు మాసాల్లో రాష్ట్రమంతటా చుట్టేస్తారట. ప్రతి జిల్లా కేంద్రంలోను ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే పవన్ యాత్ర అన్నారే కానీ పాదయాత్ర లేకపోతే బస్సుయాత్రా అనేది చెప్పలేదు. పైగా వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లో రాష్ట్రంలో కచ్చితంగా ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయని కూడా నాదెండ్ల చెప్పారు. మార్చి, ఏప్రిల్లో ఎన్నికలు జరగబోతున్నాయంటే ఈ డిసెంబర్లోనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని రద్దు చేయాల్సుంటుంది. ఇంత హఠాత్తుగా యాత్ర నిర్ణయాన్ని పవన్ తీసుకోవటం దాన్ని నాదెండ్ల ప్రకటించటం ఆశ్చర్యంగానే ఉంది.
ఇదంతా చూస్తుంటే వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ప్రకటనే కారణమని అనుమానంగా ఉంది. ఢిల్లీలో శుక్రవారం రఘురాజు మీడియాతో మాట్లాడుతు ఈ డిసెంబర్లో అసెంబ్లీ రద్దుకు జగన్మోహన్ రెడ్డి సిఫారసు చేస్తారని, వచ్చే మార్చి, ఏప్రిల్లో ముందస్తు ఎన్నికలు జరగవచ్చని చెప్పారు. బహుశా దాన్ని పట్టుకునే పవన్ ముందస్తు ఎన్నికల విషయంలో ఒక అంచనాకు వచ్చినట్లు అర్ధమవుతోంది. గతంలో పవన్ పాదయాత్రపై మాట్లాడుతూ తాను జనాల్లోకి రావటం కష్టమన్నారు.
తాను కనుక పాదయాత్ర పేరుతో జనాల్లోకి వస్తే కచ్చితంగా ట్రాఫిక్ సమస్యలు వస్తాయన్నారు. తనకోసం వచ్చే జనాలను ప్రభుత్వం కంట్రోల్ చేయలేదని చెప్పారు. మరిపుడు పాదయాత్ర చేస్తార లేకపోతే బస్సుయాత్ర చేద్దామని అనుకుంటున్నారో క్లారిటీ లేదు. నాదెండ్ల మాట్లాడుతూ రాబోయే ముందస్తు ఎన్నికలకు జనసేన నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. పవన్ తాజా నిర్ణయంతో ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా ఎన్నికల వేడి మాత్రం అమాంతం పెరిగి పోవడం ఖాయం. పైగా యాత్ర కూడా వచ్చే మార్చి, ఏప్రిల్ అంటున్నారు. అంటే భగభగ మండిపోయే ఎండల్లో అన్నమాట. తిరుపతిని ఎంపిక చేసుకోవడం వెనుక ఇక్కడినుండే పోటీ చేయాలనే ఆలోచన కూడా ఉందంటున్నారు. చూద్దాం చివరకు ఏమిచేస్తారో.
This post was last modified on June 11, 2022 9:53 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…