Political News

రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ వాటా ఎంతో తెలుసా ?

రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు ఓట్లేస్తారు. వీళ్లతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఎంఎల్ఏలు కూడా ఓటింగ్ లో పాల్గొంటారు. జూలై 18వ తేదీన జరగబోయే పోలింగుకు మూడు రోజుల తర్వాత అంటే 21వ తేదీన ఫలితాలు తెలుస్తాయి. నిజానికి నరేంద్ర మోడీ అనుకున్నట్లు వ్యవహారాలు సాగితే ఎన్డీయే అభ్యర్ధే రాష్ట్రపతి అవటం ఖాయం. అప్పుడు పోలింగ్, ఓట్ల లెక్కింపు అవసరం పడదు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే మొత్తం ఓట్ల విలువ 10,86,431. ఇందులో ఎంపీల ఓట్ల విలువ 5,43,200 అయితే ఎంఎల్ఏల ఓట్ల విలువ 5,43,231. ఎంఎల్ఏల ఓట్ల విలువ ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీ సభ్యుల సంఖ్య ఆధారంగా మారుతుంది. ఈ పద్దతిలో ఏపీ విషయం తీసుకుంటే 25 మంది లోక్ సభ+11 మంది రాజ్యసభ ఎంపీల విలువ 25,448. అలాగే 175 మంది ఎంఎల్ఏల ఓట్ల విలువ 27,825. అంటే మొత్తం ఓట్ల విలువ 53,313 అయితే ఇందులో వైసీపీ ఓట్ల విలువ 45,957.

ఇక్కడే కేంద్రంలో వైసీపీకి బాగా విలువ పెరిగిపోయింది. పార్లమెంట్ లో ఎక్కువ ఎంపీలున్న పార్టీల్లో వైసీపీ 5వ స్ధానంలో ఉంది. ఈ ఓట్లకోసం+రాజ్యసభలో అవసరాల కోసమే జగన్ తో మోడి సఖ్యతగా ఉంటున్నది. పైకి చూస్తే ఎన్డీయే బలంగా ఉందని అనిపిస్తున్నా ఓట్ల పరంగా చూస్తే తక్కువనే చెప్పాలి. ఎన్డీయే బలాన్ని భేరీజు వేసినపుడు యూపీఏ కన్నా ఎక్కువే. కానీ ఎన్డీయే బలం, నాన్ ఎన్డీయే పార్టీల బలాన్ని చూసినపుడు నాన్ ఎన్డీయే పార్టీల బలమే ఎక్కువ. అంటే నాన్ ఎన్డీయే పార్టీల మద్దతు లేనిదే మోడీ ప్రతిపాదించే రాష్ట్రపతి అభ్యర్ధి గెలవలేరు.

ఇక్కడ నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలంటే ఒడిస్సాలో బిజూ జనతాదళ్, ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ అనే ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ పార్టీల్లో ఏ ఒక్క పార్టీ ఎన్డీయేకి మద్దతిచ్చినా గెలుపు ఖాయమే. అయితే టీఆర్ఎస్ అధినేత కేసీయార్ వైఖరి ఎప్పుడెలాగుంటుందో ఎవరు చెప్పలేరు. బిజూ జనతాదళ్ అధినేత, ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ మనసులోని మాట ఏమిటో తెలీదు. మిగిలింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మొదటి నుండి జగన్ కేంద్రానికి మద్దతుగానే ఉంటున్నారు. కాబట్టి ఎన్డీయే అభ్యర్ధి గెలుపు లాంఛనమనే అనుకోవాలా ?

This post was last modified on June 10, 2022 6:50 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

2 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

3 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

6 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

6 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

7 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

7 hours ago