మొత్తం మీద ఇటు తెలుగుదేశం పార్టీయే కాదు మిత్రపక్షం బీజేపీ నుంచి కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు షాకులు గట్టిగానే తగిలాయి. టీడీపీ నేతల నుంచి షాకులు తగిలాయంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ మిత్రపక్షం బీజేపీ నుంచి ఇంతటి షాక్ తగలటమే ఆశ్చర్యంగా ఉంది. త్యాగాలు చేసేది లేదని, పల్లకి మోసేదిలేదని చెబుతూ వచ్చిన పవన్ హఠాత్తుగా మూడు ఆప్షన్లు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
మూడు ఆప్షన్లు ఇవ్వటంలో పవన్ ఉద్దేశ్యం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించటం, ప్రకటించటమే. పవన్ కు బాగా తెలుసు టీడీపీ ఆ పని చేయదని. అయినా సరే గాల్లో బాణం వేశారంతే. అందరూ ఊహించినట్లే టీడీపీ నేతల నుండి పవన్ పై ఎదురుదాడులు మొదలయ్యాయి. చంద్రబాబునాయుడుకే పవన్ మూడు ఆప్షన్లు ఇవ్వటంపై తమ్ముళ్ళల్లో కొందరు రెచ్చిపోయి పవన్ను వాయించేశారు.
సరే ఈ విషయం టీడీపీ తరపున చాలామంది ఊహించిందే కాబట్టి ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇదే సమయంలో అలాంటి సంకేతాన్నే బీజేపీ నేతలకు కూడా పంపారు. ఆశ్చర్యకరంగా పవన్ ను సీఎం అభ్యర్ధిగా కమలనాథులు కూడా అంగీకరించలేదు. అంటే పవన్ ను సీఎం అభ్యర్థిగా ఇటు టీడీపీ అటు బీజేపీ కూడా అంగీకరించకపోవటం సంచలనంగా మారింది. మిత్రపక్షం నేతల నుండి ఇలాంటి తిరస్కారం ఎదురవుతుందని పవన్ ఊహించి ఉండరేమో.
పవన్ సీఎం అభ్యర్ధిగా టీడీపీ అంగీకరించలేదంటే అర్ధముంది. ఎలాగంటే జనసేనకన్నా టీడీపీ చాలా పెద్ద పార్టీ. మొన్నటి సాధారణ ఎన్నికల్లో టీడీపీకి 39 శాతం ఓట్లు వస్తే జనసేనకు వచ్చింది 5.6 శాతం ఓట్లు మాత్రమే. ఎక్కడైనా పెద్ద ఓటుబ్యాంకున్న పార్టీయే సీఎం కుర్చీ కోరుకోవటం సహజం. ఇదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది 0.56 శాతం ఓట్లు మాత్రమే. ఓట్లశాతాన్ని ప్రామాణికంగా తీసుకున్నపుడు ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీ నేతలు కూడా పవన్ ను సీఎం అభ్యర్ధిగా అంగీకరించటంలేదు. మొత్తం మీద ఎగస్పార్టీతో పాటు మిత్రపక్షం కూడా పవన్ కు పెద్ద షాకే ఇచ్చింది.
This post was last modified on June 7, 2022 11:33 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…