Political News

రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయ్‌.. జ‌గ‌న్ వైఫ‌ల్య‌మేనా?

రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి. అవి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. రాజ‌కీయంగా పెను సంచ‌నాల‌కు వేదిక‌గా మారుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్‌.. గ‌తంలో జ‌గ‌న్‌కు సాయం చేయ‌గా.. ఇప్పుడు ఆయ‌న టీడీపీ వైపు చూస్తున్నార‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. ఇది జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా ప్ర‌మాద ఘంటిక‌ల‌ను మోగిస్తోంది. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అధినేత .. ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు రావాల‌ని కోరుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న బ‌హిరంగ వేదిక‌ల‌పైనే ప్ర‌క‌టించారు.

కానీ, ఇప్పుడు అదే కేసీఆర్.. టీడీపీకి అనుకూలంగా ప‌నిచేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల ప్రారంభ సమయంలో ఎన్టీఆర్‌కు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ ఎస్ నాయ‌కులు అన్న‌గారు ఎన్టీఆర్‌కు ఘ‌న నివాళులర్పించారు. వీరిలో ఏమీ చిన్నా చిత‌కా నాయ‌కులు లేరు. సీఎం కేసీఆర్‌కు రైట్, లెఫ్ట్ హ్యాండ్స్‌గా ప‌రిగ‌ణించే మంత్రి మ‌ల్లారెడ్డి, ఎంపీ నామా నాగేశ్వ‌రరావు వంటివారు ఉన్నారు. పైగా అన్న‌గారికి భార‌త ర‌త్న వ‌చ్చేలా కృషి చేస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు.

ఇది నిజంగానే సంచ‌ల‌నంగా మారింది. మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌కు సంకేతాలుగా విశ్లేష‌కులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఏపీలో టీడీపీ వ‌స్తే.. త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో భాగ‌మ‌ని కొంద‌రు అప్పుడే విశ్లేషిస్తున్నారు. మ‌రికొంద‌రు మ‌రో రెండు అడుగులు ముందుకు వేసి.. ఏపీలో టీడీపీనే వ‌చ్చేస్తుంద‌ని.. కేసీఆర్ న‌మ్మ‌కంగా ఉన్నార‌ని.. అందుకే వ్యూహం మార్చుకున్నార‌ని.. చెబుతున్నారు. ఎందుకంటే..ఇన్నాళ్ల‌లో ఎప్పుడూ.. ఎన్టీఆర్‌ను ప‌ట్టించుకోని.. కేసీఆర్‌..ఇప్పుడు అన‌నూహ్యంగా అన్న‌గారి జ‌పం చేస్తున్నారంటే.. ఏపీలో రాజ‌కీయాలు మారుతున్నాయ‌ని ఆయ‌న ధ్రుడంగా విశ్వ‌సిస్తున్నార‌ని.. ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి కేసీఆర్‌పై జ‌గ‌న్‌.. జ‌గ‌న్‌పై కేసీఆర్ చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. అనూహ్యంగా జ‌ల వివాదాలు తెర‌మీదికి రావ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య దోస్తీ ప‌క్క‌దారి ప‌ట్టింది. దీంతో వైరివ‌ర్గాలుగా మారిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. ఏపీలో ప‌రిణామాలు కూడా.. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా మారుతున్నాయి. ఇక్క‌డ పాల‌న‌పై త‌ర‌చుగా.. విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌జ‌ల్లోనూ వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఎక్క‌డా అభివృద్ది లేద‌ని.. అమ‌రావ‌తిని కూల్చేశార‌ని.. మూడు రాజ‌ధానులతో ఒరిగేదేంట‌ని.. ఇలా అనేక రూపాల్లో ప్ర‌జ‌ల నుంచి కూడా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్య‌లోనే జ‌గ‌న్‌పై విశ్వాసం సన్న‌గిల్లి.. రాజ‌కీయాలు మారుతున్నాయ‌నే సంకేతాలు పొరుగు రాష్ట్రం వ‌ర‌కు విస్త‌రించాయ‌ని అంటున్నారు. మ‌రి ఈ ప‌రిణామాల‌ను వ‌చ్చే రెండేళ్ల‌లో అయినా.. జ‌గ‌న్ మార్చుకుంటారా.. లేక ఇలానే ఉంటారో చూడాలి.

This post was last modified on May 29, 2022 1:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేశ చ‌రిత్ర‌లో.. `మ‌మ‌త` గెలిచారు… మరి ఈసీ మాటేంటి?!

సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచార‌ణ‌కు వ‌స్తాయి. న్యాయ‌శాస్త్రంలో ల‌బ్ధ‌ప్ర‌తిష్టులైన అనేక మంది న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపిస్తారు. ఇది…

2 hours ago

గంపెడు సినిమాలు… గుప్పెడు అంచనాలు

రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…

3 hours ago

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

7 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

11 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

12 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

13 hours ago