రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అవి కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. రాజకీయంగా పెను సంచనాలకు వేదికగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్.. గతంలో జగన్కు సాయం చేయగా.. ఇప్పుడు ఆయన టీడీపీ వైపు చూస్తున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇది జగన్కు రాజకీయంగా ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఎందుకంటే.. గత ఎన్నికల్లో టీఆర్ ఎస్ అధినేత .. ఏపీలో జగన్ సర్కారు రావాలని కోరుకున్నారు. ఈ విషయాన్ని ఆయన బహిరంగ వేదికలపైనే ప్రకటించారు.
కానీ, ఇప్పుడు అదే కేసీఆర్.. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకల ప్రారంభ సమయంలో ఎన్టీఆర్కు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ ఎస్ నాయకులు అన్నగారు ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు. వీరిలో ఏమీ చిన్నా చితకా నాయకులు లేరు. సీఎం కేసీఆర్కు రైట్, లెఫ్ట్ హ్యాండ్స్గా పరిగణించే మంత్రి మల్లారెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు వంటివారు ఉన్నారు. పైగా అన్నగారికి భారత రత్న వచ్చేలా కృషి చేస్తామని కూడా ప్రకటించారు.
ఇది నిజంగానే సంచలనంగా మారింది. మారుతున్న రాజకీయ పరిణామాలకు సంకేతాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఏపీలో టీడీపీ వస్తే.. తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమని కొందరు అప్పుడే విశ్లేషిస్తున్నారు. మరికొందరు మరో రెండు అడుగులు ముందుకు వేసి.. ఏపీలో టీడీపీనే వచ్చేస్తుందని.. కేసీఆర్ నమ్మకంగా ఉన్నారని.. అందుకే వ్యూహం మార్చుకున్నారని.. చెబుతున్నారు. ఎందుకంటే..ఇన్నాళ్లలో ఎప్పుడూ.. ఎన్టీఆర్ను పట్టించుకోని.. కేసీఆర్..ఇప్పుడు అననూహ్యంగా అన్నగారి జపం చేస్తున్నారంటే.. ఏపీలో రాజకీయాలు మారుతున్నాయని ఆయన ధ్రుడంగా విశ్వసిస్తున్నారని.. పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి కేసీఆర్పై జగన్.. జగన్పై కేసీఆర్ చాలానే ఆశలు పెట్టుకున్నారు. అయితే.. అనూహ్యంగా జల వివాదాలు తెరమీదికి రావడంతో వీరిద్దరి మధ్య దోస్తీ పక్కదారి పట్టింది. దీంతో వైరివర్గాలుగా మారిపోయారు. అయినప్పటికీ.. ఏపీలో పరిణామాలు కూడా.. జగన్కు వ్యతిరేకంగా మారుతున్నాయి. ఇక్కడ పాలనపై తరచుగా.. విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల్లోనూ వ్యతిరేకత కనిపిస్తోంది. ఎక్కడా అభివృద్ది లేదని.. అమరావతిని కూల్చేశారని.. మూడు రాజధానులతో ఒరిగేదేంటని.. ఇలా అనేక రూపాల్లో ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యలోనే జగన్పై విశ్వాసం సన్నగిల్లి.. రాజకీయాలు మారుతున్నాయనే సంకేతాలు పొరుగు రాష్ట్రం వరకు విస్తరించాయని అంటున్నారు. మరి ఈ పరిణామాలను వచ్చే రెండేళ్లలో అయినా.. జగన్ మార్చుకుంటారా.. లేక ఇలానే ఉంటారో చూడాలి.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…