ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. వైసీపీ నాయకులు.. ప్రతిపక్షాలు. మేధావులు చేస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తున్నా.. ఆయా నేతలు.. పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలపై అంతో ఇంతో దృష్టి పెట్టేవారు కూడా ఉన్నారు. చాలా మంది పైకి మాత్రం .. దురుద్దేశ పూర్వకంగానే తమ ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని.. బురద జల్లుతున్నారని.. చెబుతున్నారు.
ఇది పైకి కనిపిస్తున్న విషయం. కానీ, మరికొందరు సీనియర్లు.. పార్టీకి నిజంగా మేలు చేయాలని భావించేవారు మాత్రం అంతర్మథనం చెందుతున్నారు. వైసీపీ సర్కారుపై తరచుగా.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ పాలనపై ఆయన సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒక్కొక్కసారి ఆయన చేస్తున్న విమర్శలు… ప్రతిపక్షాల కంటే కూడా దారుణంగా ఉంటున్నాయి.
అలాగని తీసిపారేయడానికి లేదు. అందుకే.. వైసీపీ లో ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దాడి వీరభద్రరావు.. వంటివారు.. ఉండవల్లి చేస్తున్న విమర్శలపై నిశితంగా ఆలోచన చేస్తున్నారు. ఇక, ఉండవల్లి ఇటీవల సంచలన వ్యాఖ్యల చేశారు. పోలవరం పూర్తి చేయాలని.. జగన్కు లేదని.. దీనిని మరోసారి ఎన్నికల అస్త్రంగా ప్రయోగించాలని ఆయన భావిస్తున్నారని.. అన్నారు. అదేసమయంలో దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే.. ఎక్కడా ప్రజాస్వామ్య దేశాల్లో సంక్షేమ అజెండాను పట్టుకుని మళ్లీ మళ్లీ గెలిచిన ప్రభుత్వాలు లేవని.. అభివృద్ధితో పాటు.. అవినీతి లేదని పాలన ఉన్నచోటే..ప్రజలు మళ్లీ మళ్లీ పట్టం కడుతున్నారని.. చెప్పుకొచ్చారు.
నిజానికి ఇవి.. విమర్శలుగా అనిపించినా.. భవిష్యత్తుకు సంబంధించి తమను తాము సరిదిద్దుకునేందు కు ఒక మార్గదర్శకమేనని.. ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దూరమైన వర్గాలను చేరువ చేసుకునేందుకు.. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను, వివాదాలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని.. అదేసమయంలో అసలు మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయాలపపై దృష్టి పెట్టి దానికి అనుగుణంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని.. వారు చెబుతున్నారు. సో.. మొత్తానికి ఉండవల్లి వ్యాఖ్యలపై వైసీపీలో అంతర్మథనం అయితే.. జరుగుతోంది. ఫలితం ఉంటుందా? ఉండదా? అనేది చూడాలి.
This post was last modified on May 28, 2022 8:36 am
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాటజీకి తెరదీశారు. త్వరలోనే జిల్లాల విభజన చేయనున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను కస్టడీలో హింసించారని.. దీంతో తనకు…
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…