Political News

రెండు, మూడు నెల‌ల్లో సంచ‌ల‌న వార్త: కేసీఆర్

బెంగళూరులో జేడీ(ఎస్‌) అధినేత దేవెగౌడ, ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామితో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని.. తొందర్లోనే తప్పకుండా వస్తుందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెండు, మూడు నెలల తర్వాత ఓ సంచలన వార్త చెప్తానని సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని.. తొందర్లోనే తప్పకుండా వస్తుందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెండు, మూడు నెలల తర్వాత ఓ సంచలన వార్త చెప్తానని సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో జేడీ(ఎస్‌) అధినేత దేవెగౌడ, ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్‌ సమావేశమయ్యారు.

మధ్యాహ్నం వారితో కలిసి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. అనంతరం సుమారు మూడు గంటల పాటు భేటీ అయ్యారు. జాతీయ, కర్ణాటక రాజకీయాలతో పాటు కీలక విషయాలపై చర్చించినట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటికీ దేశంలో మంచినీరు, విద్యుత్‌, సాగు నీటి కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సంకల్పముంటే అమెరికా కంటే బలమైన ఆర్థికశక్తిగా భారత్‌ను తీర్చిదిద్దొచ్చని చెప్పారు.

ఉజ్వల భారత్‌ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. గతంలో కర్ణాటకకు వచ్చినప్పుడు తాను చెప్పిన మాట నిజమైందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు కర్ణాటకకు వచ్చిన సమయంలో.. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వస్తానని చెప్పి వెళ్లానని.. అది అక్షరాల నిజమైందని వివరించారు. ఇప్పుడు కూడా జాతీయస్థాయిలో పెనుమార్పు రాబోతోందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి రెండు, మూడు నెలల్లోనే ఓ సంచలన వార్త చెప్తామన్నారు.

“ఉజ్వల భారత్‌ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్‌, బీజేపీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు. మహిళలు, యువత సహా ఎవరీలోనూ ఆనందం లేదు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయింది. జీడీపీలో భారత్‌ను చైనా అధిగమించింది. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలి. జాతీయ స్థాయిలో మార్పు వచ్చి తీరుతుంది. దేశంలో వచ్చే మార్పును ఎవరూ ఆపలేరు. జాతీయ, కర్ణాటక రాజకీయాలపై మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో చర్చించాం. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెప్తాం.“ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

This post was last modified on May 26, 2022 7:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

2 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

2 hours ago

ప్రభాస్ విజయ్ ఇద్దరూ ఒకే దారిలో

జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…

4 hours ago

డేంజర్ బెల్స్ మ్రోగించిన అఖండ 2

బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…

5 hours ago

అన్నగారికి కొత్త డేట్?

డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…

6 hours ago

పెళ్ళి వార్తలపై నిప్పులు చెరిగిన హీరోయిన్

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…

6 hours ago