బెంగళూరులో జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ, ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామితో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని.. తొందర్లోనే తప్పకుండా వస్తుందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెండు, మూడు నెలల తర్వాత ఓ సంచలన వార్త చెప్తానని సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని.. తొందర్లోనే తప్పకుండా వస్తుందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెండు, మూడు నెలల తర్వాత ఓ సంచలన వార్త చెప్తానని సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ, ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ సమావేశమయ్యారు.
మధ్యాహ్నం వారితో కలిసి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. అనంతరం సుమారు మూడు గంటల పాటు భేటీ అయ్యారు. జాతీయ, కర్ణాటక రాజకీయాలతో పాటు కీలక విషయాలపై చర్చించినట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటికీ దేశంలో మంచినీరు, విద్యుత్, సాగు నీటి కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సంకల్పముంటే అమెరికా కంటే బలమైన ఆర్థికశక్తిగా భారత్ను తీర్చిదిద్దొచ్చని చెప్పారు.
ఉజ్వల భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. గతంలో కర్ణాటకకు వచ్చినప్పుడు తాను చెప్పిన మాట నిజమైందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు కర్ణాటకకు వచ్చిన సమయంలో.. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వస్తానని చెప్పి వెళ్లానని.. అది అక్షరాల నిజమైందని వివరించారు. ఇప్పుడు కూడా జాతీయస్థాయిలో పెనుమార్పు రాబోతోందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి రెండు, మూడు నెలల్లోనే ఓ సంచలన వార్త చెప్తామన్నారు.
“ఉజ్వల భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు. మహిళలు, యువత సహా ఎవరీలోనూ ఆనందం లేదు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయింది. జీడీపీలో భారత్ను చైనా అధిగమించింది. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలి. జాతీయ స్థాయిలో మార్పు వచ్చి తీరుతుంది. దేశంలో వచ్చే మార్పును ఎవరూ ఆపలేరు. జాతీయ, కర్ణాటక రాజకీయాలపై మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో చర్చించాం. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెప్తాం.“ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
This post was last modified on May 26, 2022 7:23 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాటజీకి తెరదీశారు. త్వరలోనే జిల్లాల విభజన చేయనున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను కస్టడీలో హింసించారని.. దీంతో తనకు…
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…