నిన్నటిదాకా సూర్య దర్శకుడు బాలా కాంబినేషన్ లో సినిమా ఆగిపోయిందనే ప్రచారానికి హీరోనే స్వయంగా చెక్ పెట్టాడు. ఇందాకా ట్విట్టర్ లో వి ఆర్ బ్యాక్ టు ది సెట్స్ (మేము షూటింగ్ కి వచ్చేసాం)అనే క్యాప్షన్ పెట్టి బాలాతో ఉన్న ఫోటో పోస్ట్ చేయడంతో అందరికీ క్లారిటీ వచ్చింది. గత వారం రోజులుగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిలేషన్ గురించి తమిళనాడు ప్రధాన మీడియాలోనే చాలా కథనాలు వచ్చాయి. వాటి ఆధారంగానే మనవాళ్ళు సైతం ఇది నిజమే అనుకున్నారు. కట్ చేస్తే కేవలం గంటల వ్యవధిలో సూర్య క్లారిటీ ఇచ్చాడు.
దీంతో కల్ట్ కాంబినేషన్ రిపీట్ అవ్వడం ఖాయమని తేలిపోయింది. ఇప్పటికీ ఈ కాంబో అంటే గుర్తొచ్చే మూవీ పితామగన్. విక్రమ్ తో కలిసి సూర్య అందులో ఇచ్చిన పెర్ఫార్మన్స్ ఎవరూ మర్చిపోలేరు. అంతకు ముందు బాలాతో నంద చేసినప్పటికీ శివపుత్రుడు ఇచ్చిన బ్రేక్ వేరే లెవెల్. అందుకే ఇది ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తన 2డి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్య జ్యోతికలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ డిఫరెంట్ జానర్ మూవీని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనే సంకల్పంతో ఉన్నారు.
కాకపోతే ఒకటే రిస్క్ ఉంది. బాలా చాలా కాలం నుంచి ఫామ్ లో లేరు. అర్జున రెడ్డి రీమేక్ వర్మని దారుణంగా తీశారని విక్రమ్ అదేపనిగా వేరే దర్శకుడితో కొత్త వెర్షన్ తీయించడం అప్పట్లో బాలాకు జరిగిన అవమానంగా ఫ్యాన్స్ ఫీలయ్యారు. దీనికన్నా ముందు వాడే వాడు, నేను దేవుణ్ణి, పరదేశి లాంటివి టెక్నికల్ గా ఎంత గొప్ప ప్రశంసలు అందుకున్నప్పటికీ వాటిలో ఉన్న ఓవర్ వయొలెన్స్ వల్ల అన్ని వర్గాలను మెప్పించలేకపోయాయి. మరి సూర్య తనకిచ్చిన గోల్డెన్ ఛాన్స్ ని బాలా ఎలా వాడుకుంటారో చూడాలి
This post was last modified on May 26, 2022 6:11 pm
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…