Political News

కాంగ్రెస్ హ్యాపీయేనా?

తొందరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ హ్యాపీగానే ఫీలవుతోంది. ఎందుకంటే రాజ్యసభలో తన బలాన్ని పెంచుకునే అవకాశం రాబోతోంది. దాదాపు ఎనిమిదేళ్ళుగా వరస ఓటములతో పార్టీ బాగా ఇబ్బందులు పడుతోంది. అందుకనే లోక్ సభ, రాజ్యసభలో పార్టీ బలం నానాటికి తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో రాజ్యసభలో పార్టీ బలం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అందుకనే పార్టీ నాయకత్వం హ్యాపీగా ఉంది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఇపుడు రాజ్యసభలో కాంగ్రెస్ బలం 29 మాత్రమే. మరో రెండునెలల్లో 55 మంది ఎంపీలు రిటైర్ కాబోతున్నారు. ఈ 55 స్ధానాలు వివిధ పార్టీల ఖాతాలో పడబోతున్నాయి. అత్యధిక ఎంపీ సీట్లు బీజేపీ ఖాతాలోనే పడబోతున్నాయనటంలో సందేహంలేదు. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ ఖాతాలో కూడా ఏకంగా 11 స్ధానాలు పడబోతున్నాయి. పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు చిదంబరం, కపిల్ సిబల్, జైరాం రమేష్, అంబికాసోనీ, వివేక్ టంకా, ప్రదీప్ టంటా, ఛాయావర్మ పదవీకాలం ముగుస్తోంది.

కొత్తగా జరగబోయే ఎన్నికల్లో రాజస్ధాన్లో 3, ఛత్తీస్ ఘడ్ 2, తమిళనాడు, ఝార్ఖండ్, మహారాష్ట్ర ఒకస్ధానాన్ని కాంగ్రెస్ గెలుచుకోవటం ఖాయం. పార్టీ ఎంఎల్ఏల సంఖ్యాబలాన్ని బట్టిచూస్తే హరియానా, కర్నాటక, మధ్యప్రదేశ్ లో కూడా ఒక్కోసీటును గెలుచుకునే అవకాశాలు ఎక్కువున్నాయి.  ఇక్కడే సమస్య కూడా మొదలైంది. ఏకంగా 11 రాజ్యసభ స్ధానాలు పార్టీకి దక్కే అవకాశాలు ఉండటంతో పార్టీలో పోటీ విపరీతంగా పెరిగిపోయింది.

విచిత్రం ఏమిటంటే ఇప్పటికే అపరిమితమైన అధికారాలను అనుభవించేసిన గులాంనబీ ఆజాద్, జైరామ్ రమేష్ లాంటి వాళ్ళు కూడా మళ్ళీ పోటీపడుతున్నారు. ఒకవైపు యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న నాయకత్వం మరి ఏమి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా మారింది. 76 ఏళ్ళ ఆజాద్ లాంట వాళ్ళని పక్కనపెట్టేసి యువతకు పెద్దపీట వేస్తే పార్టీలోని యువనేతలకు మంచి ప్రోత్సాహమిచ్చినట్లవుతుంది. చివరకు ఏమవుతుందో చూడాలి. 

This post was last modified on May 26, 2022 10:51 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

9 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

9 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

10 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

11 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

11 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

13 hours ago