Political News

కాంగ్రెస్ సీరియస్ గానే రెడీ అవుతోందా?

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గానే రెడీ అవుతున్నట్లుంది. పార్టీలో పునరుత్తేజం నింపటానికి అధినేత్రి సోనియాగాంధీ మూడు కమిటిలను నియమించారు. రాజస్ధాన్లోని ఉదయపూర్లో మొన్న మూడు రోజులు జరిగిన చింతన్ శిబిర్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల తర్వాత సీరియస్ గానే కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే మూడు కమిటీలు నియమించింది. మొదటిదేమో రాజకీయ వ్యవహారాల కమిటీ, రెండోదేమో టాస్క్ ఫోర్స్.

ఇక మూడో కమిటీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పార్టీ మొదలు పెట్టనున్న పాదయాత్ర భారత్ జోడో కార్యక్రమం రూపకల్పన కమిటీ. మొదటి రెండు కమిటీలకు సోనియాగాంధీ, చిదంబరం నాయకత్వం వహించబోతున్నారు. వీరిలో సీనియర్లు, జూనియర్లు ప్రాతిపదికగా సభ్యులను నియమించారు. టాస్క్ ఫోర్స్ కమిటీలో పార్టీ వ్యవహారాలు, కమ్యూనికేషన్, మీడియా, సోషల్ మీడియా, ఆర్థిక వనరుల సమీకరణ లాంటి కీలకమైన అంశాలున్నాయి.

అక్టోబర్లో 2వ తేదీ నుంచి మొదలయ్యే భారత్ జోడో కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో సెంట్రల్ ప్లానింగ్ గ్రూపును సోనియా నియమించారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే పార్టీ పదవుల్లో ఇకనుండి 50 శాతం యువతకే కేటాయించాలన్న నిర్ణయాన్ని నాయకత్వం తుంగలో తొక్కేసింది. రాజకీయ వ్యవహారాల కమిటీ, టాస్క్ ఫోర్స్ బృందంలో ఇప్పటివరకు ఉన్న నేతలనే నాయకత్వం రెన్యువల్ చేసింది. ఈ రెండు కమిటిల్లో ఉన్నవారంతా పాతవారే.

టాస్క్ ఫోర్స్ లో నియమితుడైన హైదరాబాద్ కేంద్రంగా మైండ్ షేర్ అనలిటిక్స్ సంస్ధ అధినేత సునీల్ కానుగోలు యువకుడి కిందే లెక్క. భారత్ జోడో కార్యక్రమంలో నియమితులైన సచిన్ పైలెట్, రవ్ నీత్ బిట్టు, జ్యోతిమణి లాంటి వాళ్ళు మాత్రమే 50 ఏళ్ళ వయసువారు. ఎందుకంటే వీరు రాహుల్ గాంధీతో పాటు పాదయాత్రలో పాల్గొనాల్సుంటుదేమో. అందుకనే భారత్ జోడో పర్యవేక్షణ కమిటీలో మాత్రం యువకులను వేశారు. మొత్తానికి భారత్ జోడో కార్యక్రమం మొదలైన తర్వాత పార్టీకి ఊపు వస్తుంది అని నాయకత్వం భావిస్తోంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్రంటే మామూలు విషయం కాదు.

This post was last modified on May 25, 2022 12:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago