రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులపై టీఆర్ఎస్ కసరత్తు కొలిక్కివచ్చింది. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. రాజ్యసభ అభ్యర్థులుగా హెటిరో సంస్థల ఛైర్మన్ డాక్టర్. బండి పార్థసారథి, ఖమ్మం జిల్లా గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), ‘నమస్తే తెలంగాణ’ పత్రిక సీఎండీ దీవకొండ దామోదర్ రావును ఎంపిక చేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాశ్ స్థానం కోసం జరగనున్న ఉపఎన్నికకు ఈ నెల19తో నామినేషన్ల గడువు ముగియనుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్… రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు.
తెలంగాణకు సంబంధించి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా మూడు స్థానాలనూ టీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకోవడం లాంఛనమే. కాగా, ఇందులో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. దీనికి నోటిఫికేషన్ ఇప్పటికే జారీ అయింది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 19తో గడువు ముగుస్తోంది. మిగిలిన రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 24న జారీ కానుంది. రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్కు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఉప ఎన్నిక జరిగే స్థానానికి నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉంది.
డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానంలో ఎన్నికలకు ఈనెల 24 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఒకేసారి ముగ్గురు అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రకటించారు. మూడుస్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై కొన్ని రోజులుగా కేసీఆర్ ముమ్మర కసరత్తు చేశారు. మూడుస్థానాల కోసం సుమారు పది మందికి పైగా ఆశించినా… సీఎం కేసీఆర్.. వీరివైపే మొగ్గుచూపారు. వీరిలో ఇద్దరు పారిశ్రామిక వేత్తలు.. బండి పార్థసారథి, వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. మరొకరు అధికార పార్టీ పత్రిక ఎండీ ఉన్నారు.
This post was last modified on May 18, 2022 8:36 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…