వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లే నలుగురి జాబితా రెడీ అయిందా? ఇప్పటికే అభ్యర్థులను పార్టీ అధినేత, సీఎం జగన్ ఖరారు చేశారా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్లు. ఏపీ నుంచి రాజ్యసభకు తాజాగా నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఈ సభ్యులను ఖరారు చేసే పనిని పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి సుజనా చౌదరి, విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేశ్, సీఎం రమేష్ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు కూడా ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా.. వైసీపీకే దక్కనున్నాయి.
అయితే.. ఈ నాలుగు స్థానాల కోసం.. పార్టీలోతీవ్రమైన పోటీ ఉంది. అయినప్పటికీ.. వైసీపీ అధినేత జగన్ మాత్రం జంపింగులకు అవకాశం ఇచ్చారు. ఇదే ఇప్పుడు.. వైసీపీలో మంటలు రేపుతున్నాయి. నిజానికి జాబితా ఇంకా బయటకు రాకపోయినా.. పార్టీ అధిష్టానం నుంచి అందుతున్న సంకేతాలను బట్టి..ఈ సీట్లను ఆశించిన నాయకులు.. మాత్రం రగిలిపోతున్నారు.
జాబితాలో ఆ నలుగురు వీరేనా!?
రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి వైసీపీ తరఫున అవకాశమివ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని సమాచారం. అలాగే వైసీపీ నేత విజయసాయిరెడ్డిని రెండోసారి కూడా పార్లమెంటు ఎగువ సభకు పంపనున్నారు. అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి గానీ లేదంటే ఆయన భార్య ప్రీతి అదానీకి గానీ టికెట్ ఇవ్వాలని ఇదివరకే నిశ్చయించినట్లు సమాచారం.
అయితే మహిళ కోటాలో కృపారాణిని పంపుతున్నందున గౌతమ్ అదానీకే అవకాశం లభిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీద మస్తాన్రావు కు బీసీ కోటా రాజ్యసభ సీటివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి ఖరారు చేశారని.. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఎంపికలో పదనిసలు..
This post was last modified on May 13, 2022 4:50 pm
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…