వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లే నలుగురి జాబితా రెడీ అయిందా? ఇప్పటికే అభ్యర్థులను పార్టీ అధినేత, సీఎం జగన్ ఖరారు చేశారా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్లు. ఏపీ నుంచి రాజ్యసభకు తాజాగా నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఈ సభ్యులను ఖరారు చేసే పనిని పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి సుజనా చౌదరి, విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేశ్, సీఎం రమేష్ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు కూడా ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా.. వైసీపీకే దక్కనున్నాయి.
అయితే.. ఈ నాలుగు స్థానాల కోసం.. పార్టీలోతీవ్రమైన పోటీ ఉంది. అయినప్పటికీ.. వైసీపీ అధినేత జగన్ మాత్రం జంపింగులకు అవకాశం ఇచ్చారు. ఇదే ఇప్పుడు.. వైసీపీలో మంటలు రేపుతున్నాయి. నిజానికి జాబితా ఇంకా బయటకు రాకపోయినా.. పార్టీ అధిష్టానం నుంచి అందుతున్న సంకేతాలను బట్టి..ఈ సీట్లను ఆశించిన నాయకులు.. మాత్రం రగిలిపోతున్నారు.
జాబితాలో ఆ నలుగురు వీరేనా!?
రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి వైసీపీ తరఫున అవకాశమివ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని సమాచారం. అలాగే వైసీపీ నేత విజయసాయిరెడ్డిని రెండోసారి కూడా పార్లమెంటు ఎగువ సభకు పంపనున్నారు. అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి గానీ లేదంటే ఆయన భార్య ప్రీతి అదానీకి గానీ టికెట్ ఇవ్వాలని ఇదివరకే నిశ్చయించినట్లు సమాచారం.
అయితే మహిళ కోటాలో కృపారాణిని పంపుతున్నందున గౌతమ్ అదానీకే అవకాశం లభిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీద మస్తాన్రావు కు బీసీ కోటా రాజ్యసభ సీటివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి ఖరారు చేశారని.. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఎంపికలో పదనిసలు..
This post was last modified on May 13, 2022 4:50 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…