వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లే నలుగురి జాబితా రెడీ అయిందా? ఇప్పటికే అభ్యర్థులను పార్టీ అధినేత, సీఎం జగన్ ఖరారు చేశారా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్లు. ఏపీ నుంచి రాజ్యసభకు తాజాగా నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఈ సభ్యులను ఖరారు చేసే పనిని పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి సుజనా చౌదరి, విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేశ్, సీఎం రమేష్ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు కూడా ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా.. వైసీపీకే దక్కనున్నాయి.
అయితే.. ఈ నాలుగు స్థానాల కోసం.. పార్టీలోతీవ్రమైన పోటీ ఉంది. అయినప్పటికీ.. వైసీపీ అధినేత జగన్ మాత్రం జంపింగులకు అవకాశం ఇచ్చారు. ఇదే ఇప్పుడు.. వైసీపీలో మంటలు రేపుతున్నాయి. నిజానికి జాబితా ఇంకా బయటకు రాకపోయినా.. పార్టీ అధిష్టానం నుంచి అందుతున్న సంకేతాలను బట్టి..ఈ సీట్లను ఆశించిన నాయకులు.. మాత్రం రగిలిపోతున్నారు.
జాబితాలో ఆ నలుగురు వీరేనా!?
రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి వైసీపీ తరఫున అవకాశమివ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని సమాచారం. అలాగే వైసీపీ నేత విజయసాయిరెడ్డిని రెండోసారి కూడా పార్లమెంటు ఎగువ సభకు పంపనున్నారు. అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి గానీ లేదంటే ఆయన భార్య ప్రీతి అదానీకి గానీ టికెట్ ఇవ్వాలని ఇదివరకే నిశ్చయించినట్లు సమాచారం.
అయితే మహిళ కోటాలో కృపారాణిని పంపుతున్నందున గౌతమ్ అదానీకే అవకాశం లభిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీద మస్తాన్రావు కు బీసీ కోటా రాజ్యసభ సీటివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి ఖరారు చేశారని.. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఎంపికలో పదనిసలు..
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…
ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…