వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లే నలుగురి జాబితా రెడీ అయిందా? ఇప్పటికే అభ్యర్థులను పార్టీ అధినేత, సీఎం జగన్ ఖరారు చేశారా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్లు. ఏపీ నుంచి రాజ్యసభకు తాజాగా నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఈ సభ్యులను ఖరారు చేసే పనిని పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి సుజనా చౌదరి, విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేశ్, సీఎం రమేష్ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు కూడా ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా.. వైసీపీకే దక్కనున్నాయి.
అయితే.. ఈ నాలుగు స్థానాల కోసం.. పార్టీలోతీవ్రమైన పోటీ ఉంది. అయినప్పటికీ.. వైసీపీ అధినేత జగన్ మాత్రం జంపింగులకు అవకాశం ఇచ్చారు. ఇదే ఇప్పుడు.. వైసీపీలో మంటలు రేపుతున్నాయి. నిజానికి జాబితా ఇంకా బయటకు రాకపోయినా.. పార్టీ అధిష్టానం నుంచి అందుతున్న సంకేతాలను బట్టి..ఈ సీట్లను ఆశించిన నాయకులు.. మాత్రం రగిలిపోతున్నారు.
జాబితాలో ఆ నలుగురు వీరేనా!?
రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి వైసీపీ తరఫున అవకాశమివ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని సమాచారం. అలాగే వైసీపీ నేత విజయసాయిరెడ్డిని రెండోసారి కూడా పార్లమెంటు ఎగువ సభకు పంపనున్నారు. అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి గానీ లేదంటే ఆయన భార్య ప్రీతి అదానీకి గానీ టికెట్ ఇవ్వాలని ఇదివరకే నిశ్చయించినట్లు సమాచారం.
అయితే మహిళ కోటాలో కృపారాణిని పంపుతున్నందున గౌతమ్ అదానీకే అవకాశం లభిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీద మస్తాన్రావు కు బీసీ కోటా రాజ్యసభ సీటివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి ఖరారు చేశారని.. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఎంపికలో పదనిసలు..
This post was last modified on May 13, 2022 4:50 pm
అసలు భారతీయుడు 2 ఎప్పుడు రిలీజనేది తేలలేదు కానీ అప్పుడే మూడో భాగానికి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. కమల్ హాసన్…
దేశంలో సార్వత్రిక ఎన్నికలు కీలకదశకు చేరుకున్న నేపథ్యంలో దేశంలో వివిద నియోజకవర్గాలలో నిలబడ్డ ప్రముఖులలో ఎవరు గెలుస్తారు ? అని…
https://www.youtube.com/watch?v=CKpbdCciELk జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర పాటల సందడి మొదలైపోయింది. నాలుగేళ్లకు పైగా సుదీర్ఘమైన…
ఒక హీరో వద్దన్న స్టోరీలు ఇంకొకరు తీసుకోవడం సినీ పరిశ్రమలో లెక్కలేనన్నిసార్లు జరిగి ఉంటుంది. త్రివిక్రమ్ చెప్పినప్పుడు నిద్రరాకపోయి ఉంటే…
యానిమల్ విడుదలైన టైంలో, అంతకు ముందు కబీర్ సింగ్ సమయంలో బాలీవుడ్ విమర్శకులు, కొందరు నటీనటులు అదే పనిగా దర్శకుడు…
ఎన్నికల ప్రచారంలో ఎండనక.. వాననక.. నానా కష్టాలూ పడిన రాజకీయ ప్రముఖులు, పోలింగ్ తర్వాత, కౌంటింగ్కి ముందు.. కొంత ఉపశమనం…