తనపై పడుతుందని అనుకుంటున్న బహిష్కరణ వేటు నుంచి తప్పించుకునేందుకు వైఎస్ కొండారెడ్డి రివర్స్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పులివెందులలోని చక్రాయపల్లె మండలానికి కొండారెడ్డి వైసీపీ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి స్వయంగా కజిన్ బ్రదర్ అయిన కారణంగా ఈయనకు బాగా ప్రాధాన్యత వచ్చేసింది.
సీఎంతో ఉన్న బంధుత్వాన్ని, ముఖ్యమంత్రి కుటుంబంతో ఉన్న సన్నిహితాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని రెచ్చిపోతున్నారు. చాగలమర్రి-రాయచోటి నేషనల్ హైవే రోడ్డు వేస్తున్న కాంట్రాక్టు కంపెనీ యాజమాన్యాన్ని కొండారెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈయన వేధింపులను తట్టుకోలేక సదరు యజమాని పోలీసులను ఆశ్రయించారు. దాంతో విచారణ జరిపిన పోలీసులు కొండారెడ్డి మీద కేసునమోదు చేసి కోర్టు ద్వారా రిమాండుకు కూడా పంపారు.
బెయిల్ మీద బయటకు వచ్చిన ఈయన్ను ఏకంగా జిల్లా నుండే బహిష్కరించాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపారు. ఈ నేపధ్యంలోనే తనపైన బహిష్కరణ వేటు ఖాయమని కొండారెడ్డికి అర్ధమైపోయినట్లుంది. అందుకనే రివర్సు వ్యూహాన్ని అమలుచేసి ప్రభుత్వంపై ఒత్తిడి మొదలుపెట్టారు. ఎలాగంటే మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలతో రాజీనామాలు చేయిస్తామంటు బెదిరింపులకు దిగారు.
మండలంలో తనకు మద్దతుదారులుగా నిలిచే సర్పంచుల్లో 16 మంది, 9 మంది ఎంపీటీసీలతో తమ పదవులకు రాజీనామాలు చేయించే ఆలోచనలో కొండారెడ్డి ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇందులో నలుగురు సర్పంచులు కొండారెడ్డి పీఏ ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కలిసి విషయాన్ని వివరించి చెప్పారట. కొండారెడ్డిపై బహిష్కరణ వేటు వేస్తే తామంతా పదవులకు రాజీనామాలు చేయబోతున్నట్లు చెప్పారట. అయితే ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆమోదించటం మినహా చేయగలిగేది ఏమీ లేదని ఎంపీ తేల్చి చెప్పారట. దాంతో ఏమి చేయాలో తేల్చుకోలేక అందరు అక్కడినుండి వెళ్ళిపోయారు. మరి ఎస్పీ ప్రతిపాదనలపై కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
This post was last modified on May 13, 2022 12:22 pm
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…
అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…
తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…