గత ఎన్నికల్లో గెలిచిన భీమవరం శీను (పూర్తి పేరు గ్రంధి శ్రీనివాస్) కు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో పవన్ పై గెలిచి అనూహ్య రీతిలో సక్సెస్ సాధించిన గ్రంధి శ్రీనుకు ఇప్పుడు అధిష్టానం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని విజువల్స్ తో సహా వెల్లడవుతోంది. ఇక్కడి రీజనల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి (ఎంపీ) కి కలిసి గోడు చెప్పుకున్నా ఫలితం లేకుండా పోతోందని కూడా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం పోకడలు నచ్చక భీమవరం ఎమ్మెల్యే వర్గీయులు ముభావంగానే ఉంటున్నారు. వాస్తవానికి ఆయన గెలవగానే బాగానే గుర్తింపు ఇచ్చారు. అదేవిధంగా పవన్ పై అప్పట్లో రాజకీయ విమర్శలు కూడా బాగానే చేయించారు. కానీ కహానీ ఎక్కడ చెడిందో కానీ ఆయనకు ఇప్పుడు తగు ప్రాధాన్యం దక్కడమే లేదని తెలుస్తోంది.
ఒకప్పుడు తిరుగులేని విధంగా నాయకత్వ పటిమతో రాణించిన ఆయనకు ఈ సారి టికెట్ ఇవ్వడమే కష్టం అన్న భావనతో వైసీపీ ఉందన్న ప్రచారం ఒకటి ఇప్పటికే సోషల్ మీడియాలో ఉంది. జనసేన కూడా ఈ ఎమ్మెల్యేపై అనేక సార్లు తన గొంతుక బలీయమైన రీతిలోనే వినిపించింది.అయితే శ్రీను అనుచరులు తమ నేతను మించి పోటుగాడు మరొకరు లేరు అన్న రీతిలో మాట్లాడుతున్నారని, ఇదెంత మాత్రం తగదని జగన్ ఎమ్మెల్యే పై జనసేన సెటైర్లు వేస్తోంది.
తమ అధినేత పై గెలిచారన్న ఆనందమే తప్ప ఆయన కానీ ఆయన వర్గీయులు కానీ ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని, వీలున్నంత వరకూ తమపై భౌతిక దాడులు చేయడమే కాదు, పార్టీ కి మరియు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడం అన్నది ఆయన తరుచూ చేస్తున్న పని అని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on May 12, 2022 5:51 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…