బెదిరింపుల కేసులో రెండు రోజుల క్రితమే అరెస్టయిన వైఎస్ కొండారెడ్డిని కడప జిల్లా నుండి బహిష్కరించే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డికి కొండారెడ్డి కజిన్ బ్రదర్ అవుతారు. వైఎస్ కుటుంబానికి ఈయన అత్యంత సన్నిహితుడు. పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలానికి పార్టీ తరపున ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. పేరుకు మండల ఇన్చార్జే కానీ జిల్లాలోని చాలాప్రాంతాల్లో చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి.
రాయచోటి-వేంపల్లి రోడ్డు పనులు చేస్తున్న ఎస్ ఆర్కె కంపెనీని డబ్బుల కోసం బెదిరించినట్లు ఈయనపై ఆరోపణలున్నాయి. కంపెనీ ప్రతినిధులు ఈయన బాదలు పడలేక జిల్లా ఎస్పీకి చెప్పుకున్నారు. అంతర్గతంగా విచారణ జరిపిన ఎస్పీ బెదిరింపులు నిజమే అని నిర్ధారించుకున్నారు. అయితే వెంటనే యాక్షన్ తీసుకోవటానికి వెనకాడారు. కారణం ఏమిటంటే జగన్ కు కజిన్ బ్రదర్ కావటమే కారణం.
ఇదే విషయాన్ని ఎస్పీ ఉన్నతాధికారులకు చేరవేయగా అక్కడి నుండి ఇదే విషయం జగన్ దగ్గరకు చేరింది. దాంతో జగన్ వెంటనే స్పందించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలే అది తీసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొండారెడ్డిని అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన కోర్టు ఈయనకు రిమాండ్ విధించింది. బుధవారమే కొండారెడ్డి బెయిల్ పై బయటకు వచ్చారు.
బెయిల్ పై బయటకు వచ్చినా కొండారెడ్డి వ్యవహారంలో ఎలాంటి మార్పు ఉండదని నిర్ణయానికి వచ్చిన ఎస్పీ ఏకంగా జిల్లా బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించే విషయాన్ని ఆలోచిస్తున్నారు. ఈ మేరకు గట్టి ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ కు పంపారని సమాచారం. ఎస్పీ అన్బురాజన్ నుండి వచ్చిన ప్రతిపాదనను కలెక్టర్ పరిశీలిస్తున్నారు. కలెక్టర్ ఓకే అనుకుంటే వెంటనే కొండారెడ్డిపై జిల్లా బహిష్కరణ వేటు పడుతుందని సమాచారం. చక్రాయపేట పోలీసుస్టేషన్ పరిధిలో కొండారెడ్డిపై ఐపీసీ 386, ఐపీసీ 506 సెక్షన్ల క్రింద కేసులు నమోదయ్యాయి. మరి కలెక్టర్ ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.
This post was last modified on May 12, 2022 4:13 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…