బెదిరింపుల కేసులో రెండు రోజుల క్రితమే అరెస్టయిన వైఎస్ కొండారెడ్డిని కడప జిల్లా నుండి బహిష్కరించే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డికి కొండారెడ్డి కజిన్ బ్రదర్ అవుతారు. వైఎస్ కుటుంబానికి ఈయన అత్యంత సన్నిహితుడు. పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలానికి పార్టీ తరపున ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. పేరుకు మండల ఇన్చార్జే కానీ జిల్లాలోని చాలాప్రాంతాల్లో చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి.
రాయచోటి-వేంపల్లి రోడ్డు పనులు చేస్తున్న ఎస్ ఆర్కె కంపెనీని డబ్బుల కోసం బెదిరించినట్లు ఈయనపై ఆరోపణలున్నాయి. కంపెనీ ప్రతినిధులు ఈయన బాదలు పడలేక జిల్లా ఎస్పీకి చెప్పుకున్నారు. అంతర్గతంగా విచారణ జరిపిన ఎస్పీ బెదిరింపులు నిజమే అని నిర్ధారించుకున్నారు. అయితే వెంటనే యాక్షన్ తీసుకోవటానికి వెనకాడారు. కారణం ఏమిటంటే జగన్ కు కజిన్ బ్రదర్ కావటమే కారణం.
ఇదే విషయాన్ని ఎస్పీ ఉన్నతాధికారులకు చేరవేయగా అక్కడి నుండి ఇదే విషయం జగన్ దగ్గరకు చేరింది. దాంతో జగన్ వెంటనే స్పందించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలే అది తీసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొండారెడ్డిని అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన కోర్టు ఈయనకు రిమాండ్ విధించింది. బుధవారమే కొండారెడ్డి బెయిల్ పై బయటకు వచ్చారు.
బెయిల్ పై బయటకు వచ్చినా కొండారెడ్డి వ్యవహారంలో ఎలాంటి మార్పు ఉండదని నిర్ణయానికి వచ్చిన ఎస్పీ ఏకంగా జిల్లా బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించే విషయాన్ని ఆలోచిస్తున్నారు. ఈ మేరకు గట్టి ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ కు పంపారని సమాచారం. ఎస్పీ అన్బురాజన్ నుండి వచ్చిన ప్రతిపాదనను కలెక్టర్ పరిశీలిస్తున్నారు. కలెక్టర్ ఓకే అనుకుంటే వెంటనే కొండారెడ్డిపై జిల్లా బహిష్కరణ వేటు పడుతుందని సమాచారం. చక్రాయపేట పోలీసుస్టేషన్ పరిధిలో కొండారెడ్డిపై ఐపీసీ 386, ఐపీసీ 506 సెక్షన్ల క్రింద కేసులు నమోదయ్యాయి. మరి కలెక్టర్ ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.
This post was last modified on May 12, 2022 4:13 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…