Political News

కడపను వదిలి వెళ్లకుంటే బాంబులేస్తాం

కరుడుగట్టిన నేరస్తులకు సైతం వణుకు తెప్పించే సీబీఐ టీంకు అనూహ్యమైన షాకులు ఎదురవుతున్నాయి. దేశంలో మరెక్కడా లేని రీతిలో మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో భాగంగా కడప జిల్లాకు చేరిన సీబీఐ సిబ్బందికి ఎదురవుతున్న హెచ్చరికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సీబీఐ వైపు కన్నెత్తి చూసేందుకు సైతం ఆలోచించే నేరస్తులకు భిన్నంగా.. కడప జిల్లాలో మాత్రం సీబీఐ సిబ్బందికే బెదిరింపులు ఎదురైన వైనం ఇప్పుడు అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వివేకా హత్య కేసును ఒక కొలిక్కి తెచ్చేందుకు కష్టపడుతున్న సీబీఐ సిబ్బంది కడపను వదిలి వెళ్లకుంటే బాంబులేస్తామంటూ బెదిరించేస్తున్నారు.

వరుస పెట్టి ఎదురవుతున్న బెదిరింపులతో విచారణ మందగిస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే కడప జిల్లాకు వచ్చిన అధికారులు ఢిల్లీకి వెళ్లిపోగా.. మిగిలిన కొందరు సైతం తమకెందుకీ కష్టమన్నట్లుగా వారి తీరు ఉన్నట్లుగాతెలుస్తోంది. ప్రస్తుతం కడపలో సీబీఐకి చెందిన ఎస్ఐ స్థాయి అధికారితో పాటు కేవలం ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. రోజువారీ కార్యకలాపాల కోసం వారు రెండు వాహనాల్లో కడప ప్రభుత్వ అతిథి గృహం నుంచి కేంద్ర కారాగారం అతిథి గృహానికి వెళ్లి వస్తుంటారు. ఈ సందర్భంగా వారికి అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి.

నాలుగు రోజుల క్రితం (మే 8న) కడప సెంట్రల్ జైలుకు సమీపంలోని పంజాబీ డాబాకు భోజనం తెచ్చుకోవటానికి వెళ్లిన సీబీఐ డ్రైవర్ వలీభాషకు.. ముసుగు ధరించిన వ్యక్తి ఒకరు అడ్డగించి.. విజయవాడకు వెంటనే వెళ్లిపోవాలని లేకుంటే బాంబులేసి లేపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. వివేకా కేసు విచారణకు వెళ్లిన అధికారులకు ఇలాంటి బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. ముసుగు ధరించిన వ్యక్తి ఒకరు సీబీఐకు చెందిన వాహనాన్ని ఫాలో అవుతున్నట్లుగా చెబుతున్నారు. తమ వాహన కదలికల్ని వారం నుంచి గమనిస్తున్నట్లుగా సీబీఐ సిబ్బంది చెబుతున్నారు.

అంతేకాదు.. తాము చేస్తున్న ప్రతి పని వివరాల్ని డ్రైవర్ కు వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి పూసగుచ్చినట్లుగా చెప్పటం ద్వారా.. మీకు సంబంధించిన అన్ని వివరాలు మాకు తెలుసు.. మేం తలుచుకుంటే మిమ్మల్ని ఏదైనా చేయగలమన్న సందేశాన్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. చివరకు హైకోర్టుకు వెళ్లేందుకు ట్రైన్ లో వెళ్లిన సందర్భంగా కారు పార్కింగ్ చేసిన వైనాన్ని కూడా ప్రస్తావించినట్లు చెబుతున్నారు. దీంతో.. తమకు ఎదురైన హెచ్చరికలపై తాజాగా సీబీఐ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏమైనా.. నేరస్తులకు సింహస్వప్నంగా ఉండే సీబీఐ సిబ్బందికి కడప జిల్లాలో రోటీన్ కు భిన్నమైన అనుభవాలు ఎదురవుతున్నట్లుగా చెబుతున్నారు.

This post was last modified on May 12, 2022 1:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

4 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

8 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

8 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

9 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

9 hours ago