Political News

వైసీపీ స‌ర్కారుపై వ్య‌తిరేక‌త ఉంది: రోజా

ఏపీ మంత్రి రోజా.. సీఎం జ‌గ‌న్ గాలిని అమాంతం తీసేశారు. ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడి యాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇవి సీఎం జ‌గ‌న్‌కే కాకుండా.. వైసీపీకి కూడా తీవ్ర ఇబ్బందిక‌రంగా ప‌రిణమించాయి. ఒక‌వైపు..తాము అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నామ‌ని.. ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను రెండు చేత‌లా ప్ర‌జ‌ల‌కు పంచిపెడుతున్నామ‌ని.. కాబ‌ట్టి.. త‌మ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక‌త ఎందుకు ఉంటుందని… సీఎం జ‌గ‌న్ ప్ర‌శ్నిస్తున్నారు.

అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 151 కాదు.. ఈ సంక్షేమ ల‌బ్ధి కార‌ణంగా 175/175 సీట్లు ఎందుకు తెచ్చుకోలేమని కూడా పార్టీ నేత‌ల‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు. అంటే.. వైసీపీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త లేద‌ని… జ‌గ‌న్ చెప్ప‌క‌నే చెబుతున్నారు. ఇక‌, మంత్రి జోగి ర‌మేష్ వంటివారు కూడా ఇదే మాట చెబుతున్నారు. వ్య‌తిరేక‌త ఎందుకు ఉంటుంద‌ని ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి ఇంత‌లా జ‌గ‌న్ కాన్ఫిడెంట్‌తో ఉంటే… మంత్రి రోజా మాత్రం.. ఆయ‌న గాలి తీసేసే వ్యాఖ్య‌లు చేశారు.

వైసీపీ స‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌ని రోజా చెప్పేశారు. అది కూడా మాజీ మంత్రులు.. జ‌గ‌న్‌కు క‌ర‌డు గ‌ట్టిన అభిమానులు అయిన‌..పేర్ని నాని, కొడాలి నాని వంటి దిగ్గ‌జ నాయ‌కుల స‌మ‌క్షంలోనే రోజా ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానికైనా మూడు సంవత్స రాల తర్వాత ప్రజల నుంచి కొంత వ్యతిరేకత సహజంగానే వస్తుందని రోజా అన్నారు. దీనిని తెలుసుకుని, సరిదిద్దుకునేందుకే తమ ప్రభుత్వం ‘గడప గడపకు  వైసీపీ’ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళుతోందని తెలిపారు.

మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోజా మాట్లాడారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, శాసనసభ్యులు ఇంటింటికీ వెళ్తారని, ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాలను ప్రజలకు వారు వివరిస్తారన్నారు. అధికారులు సహకరించాలని కోరారు. ప్ర‌తిప‌క్షం చెబుతున్నంత తీవ్ర వ్య‌తిరేక‌త ఉందా.. భారీ వ్య‌తిరేక‌త ఉందా.. అనే విష‌యాల‌ను తాను చెప్ప‌లేన‌ని.. అయితే.. వైసీపీపై మాత్రం వ్య‌తిరేక‌త ఉంద‌న్నారు.

గడప గడపకూ వైసీపీ కార్యక్రమం అనేకన్నా ‘గుండెగుండెలో జగనన్న’ అనే పేరు పెడితే బాగుంటుందన్నారు. ఇక‌,  ప్రతిపక్షం టీడీపీపై రోజా విమర్శలు గుప్పించారు. ‘‘టీడీపీ నాయకులు ఏనాడైనా చెప్పింది చేశారా, అధికారపార్టీపై నిందలువేస్తూ, వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ చంద్రబాబు, లోకేశ్‌, వారికి మద్దతిస్తున్న పవన్‌కల్యాణ్‌ రాష్ట్రానికి చీడపురుగులుగా మారారు’’ అని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచిందని టీడీపీ విషప్రచారం చేస్తోందని, టీడీపీ పాలనలో 22 వేల కోట్లు బకాయిలు పేరుకుపోవడం వల్లే కరెంటు చార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు.  మ‌రి రోజా వ్యాఖ్య‌ల‌పై స‌ల‌హాదారు స‌హా సీఎం ఏమంటారో చూడాలి.

Satya

Recent Posts

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…

1 hour ago

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

2 hours ago

OG 2… ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…

4 hours ago

హీరోల్లో గుబులు రేపుతున్న సమంత

హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్‌ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…

4 hours ago

బండ్ల గణేష్… త్రివిక్రమ్… కలిసిపోయారు!

టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…

7 hours ago

మహిష్మతి మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుందా

బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…

8 hours ago