Political News

క్షేత్ర స్థాయి వ్య‌తిరేక‌త‌ను త‌ట్టుకోగ‌ల‌రా ? గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ..

ఎల్లుండి నుంచి మ‌రో ప్ర‌త్యేక రీతిలో వైసీపీ క‌నిపించ‌నుంది. సామాన్య రీతిలో ఉన్న‌జ‌నానికి ఈ ప్ర‌త్యేక రీతి చేరువ అవుతుందో లేదో కానీ ఎట్ట‌కేల‌కు జ‌గ‌న్ త‌న మార్కు పాల‌న‌లో ఉన్న లోపాలు, మంచి చెడులు అన్న‌వి తెలుసుకునేందుకు స‌న్న‌ద్ధం అవుతున్నారు. అదేవిధంగా తన‌వారిని స‌న్న‌ద్ధం చేస్తున్నారు. అధికారం ద‌క్కి మూడేళ్లయిన నేప‌థ్యంలో ఓ విధంగా ఆర్థికంగా త‌ల‌నొప్పులు ఎన్ని ఉన్నా వాటిని దాటుకుని ప్ర‌యాణిస్తున్న వైనం పై కొన్ని విమ‌ర్శ‌లున్నా, ఏ మాట‌కు ఆ మాట తాను చేయాల్సిందేదో చేస్తూనే ఉంటాన‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. పాల‌న పై స్ప‌ష్ట‌మైన అభిప్రాయం ఏంట‌న్న‌ది ప్ర‌జ‌ల నుంచి తెలుసుకోవాల‌ని ఇప్ప‌టికే ఆదేశాలు ఇచ్చారు జ‌గ‌న్.

ఆ విధంగా వైసీపీ స‌ర్కారుకు కొద్ది రోజుల్లో గ్రౌండ్ లెవ‌ల్ రియాల్టీ ఏంట‌న్న‌ది తెలిసిపోనుంది. మే 11 (బుధ‌వారం) నుంచి ప్రారంభం అయ్యే ఈ కార్య‌క్ర‌మంలో గ్రామ స‌చివాల‌యాల ప‌రిధిలో రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలూ, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధులు ప‌ర్య‌టించి స్థానిక స‌మ‌స్య‌లు తెలుసుకోనున్నారు. ప‌థ‌కాల అమ‌లు తీరు గురించి తెలుసుకోనున్నారు. ప‌థ‌కాలను అందుకున్న లబ్ధిదారుల‌తో మాట్లాడ‌డున్నారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. ఇవ‌న్నీ బాగానే ఉన్నా.. స్థానిక వ్య‌తిరేక‌త‌ను ఏ విధంగా నిలువ‌రించ‌గ‌ల‌రు ?

ఇప్ప‌టికే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, గోపాల‌పురం ఎమ్మెల్యేపై అక్క‌డి ప్ర‌జ‌లు తిరుగుబాటు చేశారు. ఓ హ‌త్యోదంతంలో ఆయ‌న అనుచ‌రుల పాత్ర ఉంద‌ని అభియోగం చేస్తూ ఎమ్మెల్యేను అన‌రాని మాట‌లు అని పిడి గుద్దులు కురిపించారు. ఆ రోజు ఏదో ఒక విధంగా పోలీసుల సాయంతో ఆయ‌న బ‌య‌ట‌ప‌డ్డారు. అదేవిధంగా క‌ర్నూలులో కూడా ప్ర‌జావ్య‌తిరేక‌త అన్న‌ది తీవ్ర స్థాయిలో ఉంది. అక్క‌డ కూడా ఇదే త‌ర‌హా ఘ‌ట‌న‌లు జ‌రిగేయి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్ప‌టిదాకా ప‌ర్య‌టించ‌ని గ్రామాలున్నాయి. సంద‌ర్శించని కాల‌నీలు ఉన్నాయి. స‌చివాల‌య వ్య‌వ‌స్థ ఉన్నా చాలా చోట్ల స్థానిక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌ని యంత్రాంగం ఉంది. యాంత్రాంగం నిర్ల‌క్ష్య వైఖ‌రి కార‌ణంగా ఎమ్మెల్యేలు మ‌రింత ప‌రువు పోగొట్టుకుంటున్నారు కూడా !

ముఖ్యంగా చెత్త ప‌న్ను వ‌సూలు త‌మ‌కు ఓ త‌ల‌నొప్పిగా ఉంద‌ని స‌చివాల‌య సిబ్బంది వాపోతున్నారు. అంతేకాదు ముంద‌స్తు ఆస్తిప‌న్ను వ‌సూలు కూడా పెద్ద‌గా ఫ‌లితాలు ఇవ్వ‌లేదు. పెంచిన ప‌న్నులు, విద్యుత్ ఛార్జీలు కూడా జ‌నామోదం పొందేలా లేవు.

ఒక వైపు సంక్షేమం అంటూనే మ‌రోవైపు ప‌న్నుల వ‌డ్డ‌న చేయ‌డం ఏమంత భావ్యం కాద‌ని ప్ర‌జ‌లు విప‌క్ష నేత‌ల ఎదుట గ‌గ్గోలు పెడుతున్నారు. ఇప్ప‌టికే టీడీపీ చేప‌డుతున్న బాదుడే బాదుడు కార్య‌క్ర‌మ ప్ర‌భావం జ‌నంపై విప‌రీతంగా ఉంది. ఈ ద‌శ‌లో క్షేత్ర స్థాయిలో పోలీసుల స‌హ‌కారం ఉన్నా కూడా ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ల‌ను నిలువ‌రించ‌డం సాధ్యం కాక‌పోవ‌చ్చు అన్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి విన‌వ‌స్తున్న ఓ అభిప్రాయం.

This post was last modified on May 9, 2022 3:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మైఖేల్ జాక్సన్ మీద ఇంత ప్రేమ ఉందా

ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…

3 hours ago

శ్రీలీల డెబ్యూకి మోక్షం ఎప్పుడో

అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…

4 hours ago

పెయిడ్ ట్వీట్లతో ప్రయోజనమేమి?

చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…

6 hours ago

LSG: ఓనర్ గోయెంకా కోపంలో తప్పు లేదు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…

6 hours ago

తెలుగు టైటిల్స్ నిర్లక్ష్యం చేయకండి

ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…

6 hours ago

క‌విత దూకుడు మామూలుగా లేదు

క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. మాజీసీఎం కేసీఆర్ త‌న‌య‌గా.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఆ పార్టీతో…

6 hours ago