Political News

క్షేత్ర స్థాయి వ్య‌తిరేక‌త‌ను త‌ట్టుకోగ‌ల‌రా ? గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ..

ఎల్లుండి నుంచి మ‌రో ప్ర‌త్యేక రీతిలో వైసీపీ క‌నిపించ‌నుంది. సామాన్య రీతిలో ఉన్న‌జ‌నానికి ఈ ప్ర‌త్యేక రీతి చేరువ అవుతుందో లేదో కానీ ఎట్ట‌కేల‌కు జ‌గ‌న్ త‌న మార్కు పాల‌న‌లో ఉన్న లోపాలు, మంచి చెడులు అన్న‌వి తెలుసుకునేందుకు స‌న్న‌ద్ధం అవుతున్నారు. అదేవిధంగా తన‌వారిని స‌న్న‌ద్ధం చేస్తున్నారు. అధికారం ద‌క్కి మూడేళ్లయిన నేప‌థ్యంలో ఓ విధంగా ఆర్థికంగా త‌ల‌నొప్పులు ఎన్ని ఉన్నా వాటిని దాటుకుని ప్ర‌యాణిస్తున్న వైనం పై కొన్ని విమ‌ర్శ‌లున్నా, ఏ మాట‌కు ఆ మాట తాను చేయాల్సిందేదో చేస్తూనే ఉంటాన‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. పాల‌న పై స్ప‌ష్ట‌మైన అభిప్రాయం ఏంట‌న్న‌ది ప్ర‌జ‌ల నుంచి తెలుసుకోవాల‌ని ఇప్ప‌టికే ఆదేశాలు ఇచ్చారు జ‌గ‌న్.

ఆ విధంగా వైసీపీ స‌ర్కారుకు కొద్ది రోజుల్లో గ్రౌండ్ లెవ‌ల్ రియాల్టీ ఏంట‌న్న‌ది తెలిసిపోనుంది. మే 11 (బుధ‌వారం) నుంచి ప్రారంభం అయ్యే ఈ కార్య‌క్ర‌మంలో గ్రామ స‌చివాల‌యాల ప‌రిధిలో రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలూ, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధులు ప‌ర్య‌టించి స్థానిక స‌మ‌స్య‌లు తెలుసుకోనున్నారు. ప‌థ‌కాల అమ‌లు తీరు గురించి తెలుసుకోనున్నారు. ప‌థ‌కాలను అందుకున్న లబ్ధిదారుల‌తో మాట్లాడ‌డున్నారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. ఇవ‌న్నీ బాగానే ఉన్నా.. స్థానిక వ్య‌తిరేక‌త‌ను ఏ విధంగా నిలువ‌రించ‌గ‌ల‌రు ?

ఇప్ప‌టికే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, గోపాల‌పురం ఎమ్మెల్యేపై అక్క‌డి ప్ర‌జ‌లు తిరుగుబాటు చేశారు. ఓ హ‌త్యోదంతంలో ఆయ‌న అనుచ‌రుల పాత్ర ఉంద‌ని అభియోగం చేస్తూ ఎమ్మెల్యేను అన‌రాని మాట‌లు అని పిడి గుద్దులు కురిపించారు. ఆ రోజు ఏదో ఒక విధంగా పోలీసుల సాయంతో ఆయ‌న బ‌య‌ట‌ప‌డ్డారు. అదేవిధంగా క‌ర్నూలులో కూడా ప్ర‌జావ్య‌తిరేక‌త అన్న‌ది తీవ్ర స్థాయిలో ఉంది. అక్క‌డ కూడా ఇదే త‌ర‌హా ఘ‌ట‌న‌లు జ‌రిగేయి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్ప‌టిదాకా ప‌ర్య‌టించ‌ని గ్రామాలున్నాయి. సంద‌ర్శించని కాల‌నీలు ఉన్నాయి. స‌చివాల‌య వ్య‌వ‌స్థ ఉన్నా చాలా చోట్ల స్థానిక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌ని యంత్రాంగం ఉంది. యాంత్రాంగం నిర్ల‌క్ష్య వైఖ‌రి కార‌ణంగా ఎమ్మెల్యేలు మ‌రింత ప‌రువు పోగొట్టుకుంటున్నారు కూడా !

ముఖ్యంగా చెత్త ప‌న్ను వ‌సూలు త‌మ‌కు ఓ త‌ల‌నొప్పిగా ఉంద‌ని స‌చివాల‌య సిబ్బంది వాపోతున్నారు. అంతేకాదు ముంద‌స్తు ఆస్తిప‌న్ను వ‌సూలు కూడా పెద్ద‌గా ఫ‌లితాలు ఇవ్వ‌లేదు. పెంచిన ప‌న్నులు, విద్యుత్ ఛార్జీలు కూడా జ‌నామోదం పొందేలా లేవు.

ఒక వైపు సంక్షేమం అంటూనే మ‌రోవైపు ప‌న్నుల వ‌డ్డ‌న చేయ‌డం ఏమంత భావ్యం కాద‌ని ప్ర‌జ‌లు విప‌క్ష నేత‌ల ఎదుట గ‌గ్గోలు పెడుతున్నారు. ఇప్ప‌టికే టీడీపీ చేప‌డుతున్న బాదుడే బాదుడు కార్య‌క్ర‌మ ప్ర‌భావం జ‌నంపై విప‌రీతంగా ఉంది. ఈ ద‌శ‌లో క్షేత్ర స్థాయిలో పోలీసుల స‌హ‌కారం ఉన్నా కూడా ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ల‌ను నిలువ‌రించ‌డం సాధ్యం కాక‌పోవ‌చ్చు అన్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి విన‌వ‌స్తున్న ఓ అభిప్రాయం.

This post was last modified on May 9, 2022 3:08 pm

Share

Recent Posts

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

2 hours ago

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

2 hours ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

2 hours ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

6 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

6 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

6 hours ago