టీడీపీ అధినేత చంద్రబాబు.. రాజకీయ పొత్తులపై తొలిసారి పెదవి విప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అన్ని పార్టీలూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమం నిర్మించాలని.. దీనికి టీడీపీ నాయకత్వం వహిస్తుందని తేల్చి చెప్పారు. “ఏపీలో ప్రజా ఉద్యమం రావాలి. ఈ ప్రజా ఉద్యమానికి టీడీపీ నాయకత్వం వహిస్తుంది. ఈ విషయంలో టీడీపీ ఎన్నిత్యాగాలు చేసేందుకైనా సిద్దం. ఇప్పటికే మాతో కలిసి పనిచేసేందుకు సీపీఐ సిద్ధంగా ఉంది” అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాకినాడ జిల్లాలో టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన సమయం వచ్చిందన్నారు. కరెంటు రాదు.. కానీ, బిల్లులు మాత్రం వస్తాయని.. సర్కారు తీరును ఆయన ఎండగట్టారు. జగన్ దెబ్బకు కింగ్ ఫిషర్ పోయిందని.. అన్నారు. బాబాయి హత్య మాదిరిగా .. మిమ్మల్ని.. నన్ను కూడా హత్య చేసేందుకు ఈ ప్రభుత్వం వెనుకాడడం లేదని వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు జగన్ కంకణం కట్టుకున్నారని..చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తును జగన్ అంధకారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపైనే తన పోరాటం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర పరిస్థితి చూసి.. ఆవేదన, ఆందోళన కూడా కలుగుతున్నాయని చెప్పారు. ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతుంటే.. మహిళా మంత్రి.. తల్లులను తప్పుపట్టడం ఎంత దారుణమో.. అందరూ అర్ధం చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకున్న కల్తీ సారా మరణాలను సహజ మరణాలుగా జగన్ చెప్పారని.. ఇంతకన్నా.. ఘోరం ఏం ఉంటుందని అన్నారు. దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీనేనని చంద్రబాబు చెప్పారు. క్విట్ జగన్-సేవ్ ఆంధ్ర నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు నేతలకు సూచించారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టినా.. తాము ప్రజల కోసం.. పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…