Political News

జాతీయ మీడియా దృష్టికి చేరిన ఏపీ హోంమంత్రి కామెంట్లు

రేపల్లె రైల్వే స్టేషన్లో వివాహితపై అత్యాచార ఘ‌ట‌న తెలుగు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. మద్యం మత్తులో వివాహితపై అత్యాచారానికి ఒడిగ‌ట్ట‌డ‌మే కాకుండా ఆమె భర్తపై దాడికి‌ దిగారు. అయితే, అత్యాచారానికి గురైన బాధితురాలి విష‌యంలో అన్నివ‌ర్గాల నుంచి సానుభూతి వ్య‌క్త‌మ‌వుతుండ‌గా, ఏపీ హోంమంత్రి తానేటి వ‌నిత చేసిన కామెంట్లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అత్యాచారం ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌రిగిన ఘ‌ట‌న కాద‌ని, ఆ స‌మ‌యంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌తో అప్ప‌టిక‌ప్పుడు జ‌రిగింద‌ని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు తెలుగు మీడియాలో ప్ర‌ధానంగా ప్ర‌సారం కావ‌డంతో పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే, తాజాగా ఏపీ హోంమంత్రి కామెంట్ల‌పై నేష‌న‌ల్ మీడియా సైతం దృష్టి సారించింది.

బాధిత‌ మ‌హిళ భర్త నుంచి డ‌బ్బుల దొంగ‌లించాల‌నే ఉద్దేశంతో వ‌చ్చిన దుండ‌గుల‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన స‌మ‌యంలో ఆమెపై అత్యాచారయ‌త్నానికి పాల్ప‌డ్డార‌ని, ఈ సంఘ‌ట‌న ప్ర‌ణాళిక‌బ‌ద్ద‌మైన విష‌యంగా చూడ‌వ‌ద్ద‌ని సాక్షాత్తు హోంమంత్రి పేర్కొన‌డం స‌రికాద‌ని ప‌లు మీడియా సంస్థ‌లు కామెంట్ చేశాయ‌ని తెలుగుదేశం నేత‌లు పేర్కొంటున్నారు. దాడి చేస్తున్న బాధ్యులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యపై ఘాతుకానికి పాల్పడటం వంటి అంశాల‌ను చూస్తుంటే సంఘ‌ట‌న‌లో సైక‌లాజిక‌ల్ అంశాలు ప్రాధాన్యం పోషించిన విష‌యం అర్థ‌మ‌వుంతోద‌ని మంత్రి పేర్కొన‌డం ఏంట‌ని వారు విస్మ‌యం వ్య‌క్తం చేశారు. టీడీపీ నేతల ప్రమేయంతోనే ఏపీలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని మంత్రి తానేటి వనిత విమర్శించడంపై సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల విష‌యంలో శాంతిభ‌ద్ర‌త‌ల అంశంపై స్పందించాల్సింది పోయి

కాగా, రేపల్లె రైల్వే స్టేషన్ అత్యాచార ఘటనపై టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు స్పందిస్తూ ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో శాంతి, భద్రతలు కూడా లోపించాయని ఆరోపించారు. అయితే, ఈ వ్యాఖ్యలకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జరిగిన సంఘటనల గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని, ఒకట్రెండు సంఘటనలతో రాష్ట్రంలో శాంతి -భద్రతలు లేవని వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదన్నారు. ఇదిలా ఉండ‌గా, ఆంధ్రప్రదేశ్ లో మహిళల పై రోజు రోజుకు పెరిగిపోతున్న అకృత్యాలలు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమేన‌ని పేర్కొంటూ బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టింది. ఇదే స‌మ‌యంలో #APWomenInsecured హ్యాష్ ట్యాగ్‌ ట్విట్టర్ లో కూడా ట్రెండ్ అయి దేశవ్యాప్తంగా 5 వ స్థానంలో నిలిచింది.

This post was last modified on May 5, 2022 8:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

45 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago