Political News

ట్రంప్ తీరుపై సుందర్ పిచాయ్ అసంతృప్తి

మహమ్మారి వైరస్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికాకు వచ్చే వ‌ల‌స‌లదారుల‌‌పై ట్రంప్ ఏప్రిల్ నుంచి 3 నెలల తాత్కాలిక నిషేధం విధించారు. వైరస్ వ్యాప్తి మరింత తీవ్రతరం కావడంతో తాజాగా ఆ నిషేధాన్ని డిసెంబరు వరకు పొడిగిస్తూ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

అమెరికాలో నిరుద్యోగ స‌మ‌స్య‌ను అరికట్టేందుకే ట్రంప్ హెచ్‌1-బీ, హెచ్-4 స‌హా అన్ని ర‌కాల టెంప‌ర‌రీ వ‌ర్క్ వీసాల‌పై నిషేధం కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ నిర్ణ‌యంతో హెచ్‌1-బీ వీసాలు, ఎల్ వీసాలు, హెచ్‌2-బీ సీజనల్ వర్కర్ వీసాలు, జే వీసాలతో అమెరికాలోకి వచ్చేందుకు అవసరమైన అన్నిరకాల వీసాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వ‌ర్క్ వీసాల‌పై నిషేధం జూన్ 24 నుంచి డిసెంబర్ 31 వరకు అమ‌ల్లో ఉంటుంది. అయితే, ట్రంప్ నిర్ణయంపై గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ట్రంప్ నిర్ణయంపై సుంద‌ర్ పిచాయ్ స్పందించారు. ఇమ్మిగ్రంట్ వీసాలపై ట్రంప్ తీరును సుందర్ పిచాయ్ తప్పుబట్టారు. అమెరికా ఆర్థిక రంగంలో సాధించిన విజయాల్లో ఇమ్మిగ్రేష‌న్ వీసాలు ఎంతగానో సహకరించాయని పిచాయ్ చెప్పారు.

ఇమ్మిగ్రెంట్ల సహకారం కూడా తోడవడంతోనే అమెరికా సాంకేతికపరంగా గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా ఎదిగిందని సుందర్ పిచాయ్ గుర్తు చేశారు. గూగుల్ సహా పలు దిగ్గజ సంస్థలు గొప్ప స్థానాల్లో ఉండడానికి ఇమ్మిగ్రేషన్‌ విధానం కారణమని పిచాయ్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ ప్రకటనతో నిరుత్సాహపడ్డామని, తాము ఇమ్మిట్రంట్లను ప్రోత్సహిస్తూనే ఉంటామని, అర్హత ఉన్నవారందరికీ దేశంతో సంబంధం లేకుండా అవ‌కాశాలు క‌ల్పిస్తూనే ఉంటామ‌ని ప్రకటించారు.

This post was last modified on June 23, 2020 6:59 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

2 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

6 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

7 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

8 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

8 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

10 hours ago