Political News

2024కు ముందే ఉమ్మ‌డి పౌర‌స్మృతి.. మైనారిటీలే టార్గెట్‌?

యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ఇటీవల కాలంలో డిమాండ్లు ఎక్కువయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు ముందే కచ్చితంగా దీన్ని అమలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అమిత్ షా భోపాల్ పర్యటనలో దీనిపై హింట్ ఇచ్చినట్లు బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(ఉమ్మడి పౌర స్మృతి) అమలుపై మధ్యప్రదేశ్ భోపాల్ పర్యటన సందర్భంగా చిన్న హింట్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

ఆ తర్వాతి నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి మద్దతుగా వరుస ప్రకటనలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాక పుష్కర్ సింగ్ ధామీ.. ఈ అంశాన్ని మొదటగా లెవనెత్తారు. ఆ తర్వాత కమలం పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్.. యూనిఫాం సివిల్ కోడ్ అంశాన్ని ప్రస్తావించారు. ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై చర్చ జోరందుకుంది. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సమాజ్వాదీ ప్రోగ్రెసివ్ పార్టీ అధినేత శివపాల్ యాదవ్.. యూసీసీని కచ్చితంగా అమలు చేయాలన్నారు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ను అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

అన్ని మ‌తాల‌కు ఒకే నిబంధ‌న

బీజేపీ పాలిత గోవాలో మాత్రమే ప్రస్తుతం యూసీసీ అమల్లో ఉంది. 1961కి ముందు నుంచే పోర్చుగీస్ వారు పాలించే సమయం లోనే దీన్ని గోవాలో అమల్లోకి తెచ్చారు. యూసీసీ అమల్లోకి వస్తే అన్ని మతాలకు ఒకే నిబంధన వర్తించేలా కొత్త చట్టం వస్తుంది. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత ఇలా అన్ని విషయాల్లో మతాలకు అతీతంగా అందరికీ ఒకే రకమైన నిబంధనలు ఉంటాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44లో యూనిఫాం సివిల్ కోడ్ ప్రస్తావన ఉంటుంది. అయితే యూసీసీ గురించి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పదే పదే ప్రస్తావించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందా? లేక 2024 సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధతను ఇది సూచిస్తుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

బీజేపీ ఎజెండాలో..

యూసీసీ అంశం బీజేపీ ఎజెండాలో ఎప్పటినుంచో ఉంది. కశ్మీర్లో ఆర్టికల్ 370ని ఎత్తివేయడం, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అడ్డంకులు తొలగించడం వంటివి చూస్తే యూసీసీ అమలుపై కూడా బీజేపీ వెనకడుగు వేసే సూచనలు కన్పించడం లేదు. 2024 సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. రామమందిర నిర్మాణం పూర్తి చేసి, దేశంలో యూనిపాం సివిల్ కోడ్ను అమల్లోకి తెచ్చిన తర్వాతే భాజపా ఎన్నికలకు వెళ్తుందనే ప్రచారం జరగుతోంది.

మైనారిటీలకు వ్యతిరేకంగానే యూసీసీని అమలు చేస్తున్నామనే భావనను ప్రజల్లో తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పలువురు మతపెద్దలు మాత్రం మైనారిటీల్లో అయోమయం సృష్టించేందుకే యూసీసీని తెరపైకి తెస్తున్నారని పేర్కొన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ మైనారిటీలకు వ్యతిరేకం కాదని, కానీ ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించాలని వారు భావిస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని నిరసనల బాట పట్టకుండా వ్యవహార జ్ఞానంతో ఉండాల‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

1 hour ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

4 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

6 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

6 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

6 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

7 hours ago