కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన అందరిలోను టెన్షన్ పెంచేస్తోంది. మే 6వ తేదీన వరంగల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగబోతోంది. రైతుల సమస్యలు, పరిష్కారాలు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల పరామర్శే టార్గెట్ గా బహిరంగ సభ జరగబోతోంది. బహిరంగ సభ నిర్వహణకు ముందుగానే అనుమతి తీసుకున్నారు కాబట్టి దీనిపై ఎలాంటి సమస్య లేదు.
రాహుల్ రెండు రోజుల పర్యటనలో విద్యార్థులు, నిరుద్యోగులతో ముఖాముఖి కార్యక్రమం విషయంలోనే టెన్షన్ పెరిగిపోతోంది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధులతో రాహుల్ ముఖాముఖి కార్యక్రమం అనుమతిని యూనివర్సిటి తిరస్కరించింది. దాంతో ఈ విషయం కాస్త వివాదాస్పదమైంది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగంణంలోకి రాహుల్ అనుమతిని నిరాకరించిన విషయమై టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
వరంగల్ లో బహిరంగ సభ అయిపోయిన తర్వాత రాహుల్ ఏమి చేయబోతున్నారన్నదే ఇపుడు కీలకమైంది. ఎలాగైనా విద్యార్థి, నిరుద్యోగ సంఘాలతో రాహుల్ ముఖాముఖి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు పంతంగా ఉన్నారు. ఆ భేటీ ఎక్కడ జరగాలన్నదే ఇంకా తేలలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు భేటీ విషయాన్ని వ్యూహాత్మకంగానే గోప్యంగా ఉంచుతున్నట్లు ప్రచారం అవుతోంది. రాహుల్ పర్యటనలో విద్యార్ధులు, నిరుద్యోగులు భేటీ కాకూడదన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు అనుమానంగా ఉంది.
లేకపోతే విద్యార్థులు, నిరుద్యోగులతో రాహుల్ భేటీ అయితే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటో అర్ధం కావటం లేదు. ఈ భేటీని ప్రభుత్వం అడ్డుకునే కొద్దీ జనాల్లో రాహుల్ పర్యటనపై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతోంది. ఒకవేళ యూనివర్సిటీ అధికారులు రాహుల్ కార్యక్రమానికి అనుమతి ఇచ్చేసుంటే ఇపుడున్నంత ఆసక్తి అప్పుడుండేది కాదు. కార్యక్రమంలో రాహుల్ పాల్గొనేవారు, నిరుద్యోగులు, విద్యార్ధులు ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేసేవారు, కార్యక్రమం అయిపోయేది. కానీ అలాకాకుండా ప్రోగ్రామ్ ను అడ్డుకోవటంతోనే సమస్యంతా వచ్చింది. ప్రభుత్వం అనాలోచితంగా రాహుల్ సభకు లేనిపోని క్రేజ్ తెచ్చుపెడుతోందనే అనామానలు పెరిగిపోతున్నాయి. చివరకు రాహుల్ పర్యటనలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…